Friday, January 23Thank you for visiting

Tag: PM modi

Wed in India |  ‘భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని’ ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు?

Wed in India | ‘భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని’ ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు?

Trending News
తన తదుపరి మిషన్ "వెడ్ ఇన్ ఇండియా (Wed in India)" అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్ర‌క‌టించారు. జ‌మ్మూకశ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్ లో ని జరిగిన విక‌సిత్ భారత్, విక‌సిత్ జమ్మూ & కాశ్మీర్' కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో వెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమ‌ని అన్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులు.. జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్ర‌ధాని సూచించారు. అలా చేయడం వ‌ల్ల ప్రతీ వ్యక్తి వారి పర్యటన నిమిత్తం బడ్జెట్‌లో కనీసం 5-10 శాతం స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు దీనివల్ల ఇక్కడి ప్రజల ఆదాయం పెరిగి, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వివ‌రించారు.ఇప్పుడు వెడ్ ఇండియా కార్య‌క్ర‌మం కింద ప్రజలు వివాహం (wedding) కోసం ఇక్కడికి రావాలని కోరారు. ప్రతి ఏడాది 5,000 మందికి పైగా భారతీయ జంటలు విదేశాలకు వెళ్లి వివాహాల...
Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్..  ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

Trending News
Underwater Metro Train | పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భార‌త‌దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా సుల‌భ‌త‌రం కానుంది.కోల్ క‌తాలోని ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండ‌ర్ వాట‌ర్ మెట్రో లైన్‌ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి. ...
PM Modi Tour | నా హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి..

PM Modi Tour | నా హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి..

Telangana
PM Modi Tour Live Updates | Sanareddy : తమ హయాంలో సర్టికల్స్ స్ట్రైక్స్ జరిగాయని, ఎయిర్‌స్ట్రైక్స్ కూడా జరుగుతాయని  ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని అంతమొందించేదుకు  మీ సహకారం కావాలని కోరారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ  సంగారెడ్డిలో  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై  విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఈ రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బందం ఉంది. దీని గురించి ప్రపంచమంతా  తెలుసు. కాంగ్రెస్‌ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది.   కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్లు దండుకుంది.  కానీ బీఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతోంది. కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగింది తెలిసినప్పటికీ కాంగ్రెస్  ఎందుకు మౌనంగ...
BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..

BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..

National
BJP Candidates First List : లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్న 195 మంది అభ్య‌ర్ధుల‌తో బీజేపీ తొలి జాబితాను శ‌నివారం ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి వార‌ణాసి నుంచే పోటీ చేయ‌నున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజ‌రాత్‌ గాంధీ న‌గ‌ర్ నుంచి బ‌రిలో నిల‌వ‌నున్నారు.గ‌తంలో రాజ్య స‌భకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ గుజ‌రాత్‌లోని పోర్ బంద‌ర్ నుంచి బ‌రిలో ఉంటున్నారు. ఢిల్లీ నుంచి ప్ర‌వీణ్ ఖండేల్వాల్‌, మ‌నోజ్ తివారీ, సుష్మా స్వ‌రాజ్ కుమార్తె బ‌న్సూరి స్వ‌రాజ్ పోటీ చేయ‌నున్నారు. ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రుల‌కు చాన్స్‌ ల‌భించ‌గా 28 మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది.ఇద్ద‌రు మాజీ ముఖ్య‌మంత్రుల‌కు అవ‌కాశమిచ్చారు. 57 మంది ఓబీసీల‌కు తొలి జాబితాలో స్ధానం క‌ల్పించ‌గా, కీల‌కమైన‌ యూపీ నుంచి 51 మంది అభ్య‌ర్ధుల‌ను మొద‌టి జాబితాలో ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ బెంగాల...
Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌

Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌

Trending News
Sudarshan Setu | దేశంలోనే అత్యంత‌ పొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ (Indias Longest Cable Stayed Bridge) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని ద్వారకాలో ఈ వంతెనను నిర్మించారు. ‘సుదర్శన్‌ సేతు’ (Sudarshan Setu) అనే పేరు గ‌ల ఈ వంతెన పొడ‌వు 2.3 కిలోమీటర్లు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్‌ ద్వారకా (Beyt Dwarka)తో క‌లుపుతుంది.2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల ఖ‌ర్చుతో దీన్ని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పు, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ కి ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పు గ‌ల‌ ఫుట్‌పాత్‌లు సైతం ఉన్నాయి. సుదర్శన్‌ సేతు ను ఒక విల‌క్ష‌ణ‌మైన‌ డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జికి ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను ఆక‌ట్టుకుంటాయి. Longest Cable Stayed Bri...
తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

National
 26న   ప్రారంభించనున్న ప్రధాని  మోదీ  తెలంగాణలో రూ. 230 కోట్ల  నిధులతో  15 అమృత్ భారత్ స్టేషన్లు  రూ.169 కోట్లతో  17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం  రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీRailway Development Works | మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైల్వేలలో దేశం గ‌ణ‌నీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది.  రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరణ  లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా పెద్దఎత్తున పురోగతి సాధించింది.  మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇన్నాళ్లు రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు కొత్తగా రైల్వే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయ...
PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..

PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..

Special Stories
PM Vishwakarma Scheme Application : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. సంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థిక సాయంతోపాటు, వృత్తిలో అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి..Pm Vishwakarma Yojana Scheme Updates : చేతివృత్తులు చేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్న పేద కుటుంబాల కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలుచేస్తోంది. ప్రధాని మోదీ జన్మదినాన్ని పుర‌స్క‌రించుకొని గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.. ఈ పథకానికి 18 రకాల చేతివృత్తుల వారు అర్హులుగా నిర్ణ‌యించారు. ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ.3 లక్షల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. దీనికోసం దరఖాస్తు చేసుకునే విధానం ఇదీ.. ఎవ‌రు అర్హులు? సంప్రదాయ కులవృత్తులు అయిన శ...
Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

Special Stories
Rooftop Solar Scheme: ప్రజలు తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ఈ పథకానికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar, Muft Bijli Yojana) ,  కింద ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-'25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు.Free Rooftop Solar Scheme సోలార్ ప్యానెల్ పథకం కింద, పథకం లబ్ధిదారులకు భారీగా సబ్సిడీలు అందించబడతాయని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని మోడీ చెప్పారు. భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల అందించి , ప్రజలపై ఎటువంటి వ్యయ భారం లేకుండా ...
BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

World
BAPS Hindu Mandir :  అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది  ఇప్పుడు మరో అద్బుతమైన దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో  అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది.  ఈ ఆలయాన్ని రేపు  14 ఫిబ్రవరి, 2024న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.  దీని ముందుగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి 13న నిర్వహించిన  భారీ సమావేశం జరుగుతుంది. దీనికి  అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం  2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ దేవాలయానికి  శంకుస్థాపన చేశారు. వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా.. ఈ భారీ దేవాలయం (B...
PV Narasimha Rao | మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన కేసీఆర్

PV Narasimha Rao | మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన కేసీఆర్

National
PV Narasimha Rao | హైద‌రాబాద్ : భార‌త దివంగత మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌ర‌సింహ రావుకు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డంపై  మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ప్ర‌ధాని పీవీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించ‌డంపై  ఎక్స్ వేదిక‌గా కేసీఆర్ ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. పీవీ న‌ర‌సింహా రావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆనందాన్ని  క‌లిగించింది అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పీవీది కీలక పాత్ర : ప్రధాని మోదీ PM Modi | దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ న‌ర్సింహారావుకు భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ .. సోషల్‌ మీడ...