Thursday, June 19Thank you for visiting

Tag: National news

Neet PG 2024 dates : అలర్ట్..  నీట్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Neet PG 2024 dates : అలర్ట్.. నీట్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

National
Neet PG 2024 dates : లోక్‌సభ ఎన్నికల కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మేర‌కు నేషనల్ మెడికల్ కమిషన్ బుధవారం స‌వ‌రించిన షెడ్యూల్ ను ప్రకటించింది. దీని ప్రకారం నీట్ పీజీ 2024 పరీక్ష తేదీని మే 5వ తేదీ నుంచి జూన్ 23కు మార్చారు.Neet PG 2024 dates : నీట్ పీజీ 2023 ఫలితాల విడుల‌య్యే తేదీని, అలాగే నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో కూడా మార్పులో చేశారు. అయితే ఇంటర్న్‌షిప్ చివరి తేదీ (Last Date)లో మాత్రం ఎలాంటి మార్పూలు చేయ‌ లేదు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డెరెక్టరేట్ జనరల్ ఫర్ హెల్త్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ తో కలిసి ప్రోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. నీ...
Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన‌ కేంద్రం.. కార‌ణ‌మిదే..

Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన‌ కేంద్రం.. కార‌ణ‌మిదే..

National
Ban on OTTs: చాలా ఓటీటీల్లో సెన్సార్‌ అనేదే లేకుండా అశ్లీలమైన కంటెంట్ విచ్చ‌ల‌విడిగా పాకిపోతోంది. పూర్తిగా అశ్లీలమైన కంటెంట్ తోనే కొన‌సాగుతున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం క‌ఠిన చర్య‌లు తీసుకుంది. ఒక్క‌సారిగా 18 ఓటీటీలపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ ఓటీటీలతోపాటు అశ్లీల కంటెంట్ ఉన్న 19 వెబ్ సైట్లు, 10 యాప్ లు 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కూడా వేటు వేసింది .అశ్లీల కంటెంట్ ఉన్న ఓటీటీలను నిషేధిస్తున్న విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు. నిషేధించిన‌ 18 ఓటీటీల్లో ఒక ఓటీటీ నుంచి ఇప్పటికే కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు తేల్చారు. మరో రెండు ఓటీటీల నుంచి 50 లక్షలకుపైగా డౌన్ లోడ్స్ చేసుకున్న‌ట్లు ప్రభుత్వం వెల్లడించింది. మ‌రోవైపు ఈ ఓటీటీల‌కు చెందిన‌ సోషల్ మీడియా హ్యాండిల్స్ కు మొత్తం 32 లక్షల మంది యూజర్లు ఉన్నారు. 18 ఓటీటీలు తమ స...
Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?

Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?

National
Electoral Bonds Case: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ త‌న ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త‌మ వ‌ద్ద కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ కేసులో ఈనెల 11న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం కంప్లయన్స్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తన అఫిడవిట్లో పేర్కొంది.ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవీ.. ఎస్బీఐ దాఖలు చేసిన కంప్లయన్స్ అఫిడవిట్ ప్రకారం.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వ‌ర‌కు మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) కొనుగోలు చేసిన‌ట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ ...
LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..

LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..

Business
 LPG cylinder price reduced : మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్ర‌ధాని మోదీ ప్రకటించారు వంట గ్యాస్​ సిలిండర్​ ధరను రూ. 100 వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు వెల్లించారు. ఈ ఎల్​పీజీ సిలిండర్​ ధర తగ్గింపు వ‌ల్ల‌ ముఖ్యంగా పేద‌ మహిళలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు.LPG gas cylinder price మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ. 100 తగ్గించాలని కేంద్రం నిర్ణ‌యించింది. తాజా నిర్ణ‌యం వ‌ల్ల‌ దేశంలోని కోట్లాది మంది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా.. నారీ శక్తికి ఇది చాలా ప్రయోజనకరమ‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్​ చేశారు మహిళల అభ్యున్నతి కోస‌మే ఈ నిర్ణయం తీసుకుందని ఆయ‌న పేర్కొన్నారు. వంట గ్యాస్​ మరింత చ‌వ‌క‌గా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వాలనే త‌మ లక్ష...
Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    

Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    

Crime, National
Demolition Drive : ఉత్తరప్రదేశ్‌కు చెందిన లిక్కర్ డాన్ పాంటీ చద్దా (Ponty Chadda)కు చెందిన కోట్లాది విలువైన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూల్చివేశారు, ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి ఫామ్‌హౌస్‌ ఉంది. ఆ ఫామ్ హౌస్‌ విలువ సుమారు రూ.400 కోట్ల కంటే పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.పాంటీ చద్దా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ ఫామ్‌హౌజ్‌ను నిర్మించినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్ర, శనివారాల్లో బుల్ డోజ‌ర్ తో వ‌చ్చి ఫామ్‌హౌస్‌ ను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌజ్‌ పాంటీ చద్దా కుమారుడు మన్‌ప్రీత్‌ అలియాస్‌ మాంటీ చద్దా ఆక్ర‌మ‌ణ‌లో ఉంది. ఈ ఫామ్‌హౌస్ లోనే గతంలో పాంటీ చద్దా, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ గ‌ర్ష‌ణ‌ప‌డి ప్రాణాలు పోగొట్టుకున్నారు.వీరి మ‌ధ్య‌ గొడవ తీవ్ర‌మై హర్దీప్‌ తన అన్న అయిన‌ పాంటీ చద్దాను తుపాకీతో కాల్చి...
BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..

BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..

National
BJP Candidates First List : లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్న 195 మంది అభ్య‌ర్ధుల‌తో బీజేపీ తొలి జాబితాను శ‌నివారం ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి వార‌ణాసి నుంచే పోటీ చేయ‌నున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజ‌రాత్‌ గాంధీ న‌గ‌ర్ నుంచి బ‌రిలో నిల‌వ‌నున్నారు.గ‌తంలో రాజ్య స‌భకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ గుజ‌రాత్‌లోని పోర్ బంద‌ర్ నుంచి బ‌రిలో ఉంటున్నారు. ఢిల్లీ నుంచి ప్ర‌వీణ్ ఖండేల్వాల్‌, మ‌నోజ్ తివారీ, సుష్మా స్వ‌రాజ్ కుమార్తె బ‌న్సూరి స్వ‌రాజ్ పోటీ చేయ‌నున్నారు. ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రుల‌కు చాన్స్‌ ల‌భించ‌గా 28 మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది.ఇద్ద‌రు మాజీ ముఖ్య‌మంత్రుల‌కు అవ‌కాశమిచ్చారు. 57 మంది ఓబీసీల‌కు తొలి జాబితాలో స్ధానం క‌ల్పించ‌గా, కీల‌కమైన‌ యూపీ నుంచి 51 మంది అభ్య‌ర్ధుల‌ను మొద‌టి జాబితాలో ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ బెంగాల...
Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?

Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?

National
రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్.. Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి రేసులోకి ఓ సన్యాసి తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.రాజస్తాన్ లో బీజేపీ విజయం ఖాయమైన క్రమంలో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే సీఎం రేసులో వసుంధర రాజే ముందుండగా మరోవైపు మహంత్ బాలక్ నాథ్ (Mahant Balak Nath) కూడా తెరపైకి వచ్చారు. ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు ఉండడండంతో అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు.40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ రాజస్తాన్ (Rajasthan) లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార (Tijara) సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన రాజస్తా...
కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి

కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి

National
కేరళలో మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపింది. ఐదుగురు వృద్ధ మహిళలు పాదాల కింద బొబ్బలు పెరగడంతోపాటు రక్తపు వాంతులతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడడం షాక్ గురిచేసింది.కేరళలోని మువట్టుపుజా(Muvattupuzha)లోని స్నేహవీడు(Snehaveedu) అనే వృద్ధాశ్రమంలో రెండు వారాల వ్యవధిలో ఒక అంతుచిక్కని చర్మ వ్యాధి ఐదుగురు వృద్ధ మహిళలను బలిదీసుకుంది. స్నేహం ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (Sneham Charitable and Educational Trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు మహిళల మరణానికి ముందు ఇలాంటి లక్షణాలను కనిపించినట్లు స్థానికులు తెలపిారు. వారు వారి పాదాల కింద వాపు, బొబ్బలు వచ్చాయి. అది చివరికి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. వారి చర్మం ఊడిపోయినట్ల కనిపించింది. తర్వాత వీరంతా రక్తపు వాంతులు చేసుకున్నారు.ఇవే లక్షణాలు కనిపించిన మరో ఆరుగురు బాధితులను మువట్టుపుజా జనరల్ ఆసుపత్రిలో ...
జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..

జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..

National, Trending News
జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. సర్వేను వెంటనే పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. సర్వేకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. "జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే ప్రారంభించవచ్చని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తెలిపింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను హెచ్‌సి సమర్థించింది" అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ANIకి తెలిపారు.జూలై 27న ఏఎస్...
24 గంటల్లో 5 భూకంపాలు

24 గంటల్లో 5 భూకంపాలు

National
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 5 తేలికపాటి-తీవ్రత గల భూకంపాలు (five-mild-earthquakes) సంభవించాయి వీటి తీవ్రత 4.5 అని గుర్తించారు. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత మొదటి ప్రకంపనలు సంభవించాయి.జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో అనేక తక్కువ-తీవ్రత గల భూకంపాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.03 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలోభూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. భూకంపం లోతు 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం,...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..