Thursday, June 19Thank you for visiting

Tag: Mumbai

water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

National
water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై  అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే  కాదు.. ఇది భారతదేశంలోని  అనేక ప్రధాన నగరాలను వేధిస్తోంది. సమీప భవిష్యత్తులో పలు నగరాలు, పట్టణాల్లో  తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతం కానున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా దేశంలోని ఐదు నగరాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.. ఆ నగరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ముంబై: పెరుగుతున్న నీటి డిమాండ్, అస్థిరమైన వర్షపాతం, తగ్గుతున్న నీటి వనరులతో, నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేగవంతమైన పట్టణీకరణ, సరిపడని మౌలిక సదుపాయాలు,  అసమర్థమైన నీటి నిర్వహణ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో నీటి నిల్వలు తగ్గిపోవడం..  ప్రత్యామ్నాయ నీటి వనరుల కొరత కారణంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BM...
 విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి

 విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి

Crime
నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్ ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న  ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్ పూర్ లో అత్యవసరంగా నిలిపివేశారు. ముంబై-రాంచీ ఇండిగో ఎయిర్‌లైన్ విమానం సోమవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీకి గురికావడంతో వెంటనే విమానాన్నిల్యాండ్ చేసినట్లు అధికారి తెలిపారు. 62 ఏళ్ల ప్రయాణికుడు డి.తివారీని హుటాహుటిన ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు అయితే. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రయాణికుడు CKD (Chronic kidney disease), క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. అతడు విమానంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు నాగ్‌పూర్‌లోని KIMS హాస్పిటల్ బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ DGM ఏజాజ్ షమీ తెలిపారు. అతని మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల...
తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత

National
ముంబై: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నాగ్ పూర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో మంటలుముంబై-బె...
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

National
పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో లైవ్ బుల్లెట్, 4 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకీగా గుర్తించారు."వీరిద్దరినీ పట్టుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. వారి అరెస్టుపై ఒక్కొక్కరికి రూ...
ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

World
ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్  ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World's Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) ఈ సంవత్సరం ట్రావెల్ + లీజర్ రీడర్‌లకు ఇష్టమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏకైక భారతీయ విమానాశ్రయంగా నమోదైంది.విమానాశ్రయాల యాక్సెస్, చెక్-ఇన్, భద్రత, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ డిజైన్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసింది."ఈ గుర్తింపు ప్రపంచ స్థాయి ఆతిథ్యంతో పాటు ప్రయాణికులకు నిరంతరం అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో Chhatrapati Shivaji Maharaj International Airport  (CSMIA ) మేటిగా నిలిందని ఈ సర్వే చెబుతోంది.  CSMIA ప్రయాణికులపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఈ గౌరవప్రదమైన జాబితాలో తన అర్హతను ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..