
మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు
మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.“వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 (ముగ్గురు) ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 04 మంది (నలుగురు) వ్యక్తులను అరెస్టు చేశారు” అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.అంతకుముందు రోజు, హీరుమ్ హేరా దాస్, తౌబాల్ నివాసి, ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన మొదటి నిందితుడు. మరికొద్ది గంటల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని మణిపూర్ పోలీసులు తెలిపారు, నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఇప్పటికే అత్య...