Monkey pox : భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..
Monkey pox : ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాప్తి చెందిన మంకీపాక్స్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది.. దిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్గా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉన్నట్లు నిర్ధారించిందని తెలిపింది.
అయితే ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకు ముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు వివరించింది. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించింది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత...