
Railway Budget 2024 | రైల్వేల భద్రతకు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు
Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమలు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చర్యలకు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం వంటివి ఉన్నాయి.“ఈ కేటాయింపులో పెద్ద భాగం - రూ. 1,08,795 కోట్లు - పాత ట్రాక్లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, కవాచ్ను ఇన్స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించనున్నట్లు చెప్పారు.
రైల్వే బడ్జెట్ కవాచ్కు ప్రాధాన్యం
కవాచ్కు ఇచ్చి...