Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: association for democratic reforms

Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై  క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..
Elections

Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..

Fourth Phase Election| నాలుగో విడ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 96 నియోజకవర్గాల్లో 58 (60%) నియోజకవర్గాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్ లో పేర్కొన్న‌ట్ల‌యితే అలాంటి చోట రెడ్‌ అలర్ట్ ఉంటుంది. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( Association For Democratic Reforms - ADR) ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, లోక్‌సభ ఎన్నికల్లో 4వ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మంది అభ్యర్థులు, మొత్తం 1,710 మంది అభ్యర్థుల్లో 360 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని వెల్లడించింది.మే 13న 4వ దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేస్తున్న 1,717 మంది అభ్యర్థుల్లో 1,710 మంది స్వీయ ప్రమాణ పత్రాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. ADR నివేదిక ప్రకారం, మొత్తం 360 (21%) మంది అభ్యర్థులు క్రి...
ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..
National

ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

ADR Report  | న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందగా , వాటిలో 45 బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజునే ఆమోదం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) విశ్లేషణలో వెల్లడైంది. లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అత్యధికంగా 410 ప్రశ్నలు అడిగారు. అప్నా దళ్ (సోనీలాల్)కు చెందిన ఇద్దరు ఎంపీలు కనీసం ఐదు అడిగారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధ‌వారంప్రచురించిన నివేదికలో పేర్కొంది. శివసేన 354 ప్రశ్నలతో, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం 284, తెలుగుదేశం పార్టీ (TDP) 247, ఎంకే స్టాలిన్ డీఎంకే 243 ప్రశ్నలు సంధించింది.ఇదిలా ఉంటే, అత్యల్ప సగటు ఉన్న పార్టీలలో అప్నా దళ్ (సోనీలాల్) ఐదు ప్రశ్నలు, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఏడు, ఆప్ 27, నేషనల్ కాన్ఫరెన్స్ 29, ఎల్‌జెపి 34 ప్రశ్నలు సంధించారు.  సగటున బీజేపీ ఎంపీలు 14...
దేశంలో 44% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
National

దేశంలో 44% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

వివరాలు వెల్లడించిన ఏడీఆర్ (association for democratic reforms) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రాష్ట్రాల అసెంబ్లీలలో సుమారు 44 శాతం మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ADR, నేషనల్ ఎలక్షన్ (NEW) నిర్వహించిన సర్వే, దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుత ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాలను పరిశీలించింది. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్ల నుంచి ఈ డేటా సేకరించారు. 28 రాష్ట్ర అసెంబ్లీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తున్న 4,033 మంది ఎమ్మెల్యేలలో మొత్తం 4,001 మంది డేటా సేకరించారు. కాగా ఈ డేటాను పరిశీలించగా విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యేలలో 1,136 మంది లేదా దాదాపు 28 శాతం మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు సంబ...