South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..

South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్..  సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..

South Central Railway Updates | హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్‌ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్‌-వరంగల్‌ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్‌-హైదరాబాద్‌ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి.

ఇక సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్‌ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్‌ ఎంఈఎంయూ (07766), కరీంనగర్‌-బోధన్‌ ఎంఈఎంయూ(Karimnagar-Bodhan MEMU)(07894), నవంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు బోధన్‌-కరీంనగర్‌ మెము (07893), కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07765) రద్దు అయ్యాయి. అలాగే  నవంబర్‌1నుంచి 30 వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్టు  రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌1నుంచి 30వరకు హెచ్‌ఎస్. నాందేడ్‌-రాయిచూర్‌(17664) రైలును తాండూర్‌-రాయచూర్‌ల మధ్య, సెప్టెంబర్‌2 నుంచి అక్టోబర్‌ 1వరకు రాయిచూర్‌-పర్భని (17663) ఎక్స్ ప్రెస్ రైలును, రాయిచూర్‌-తాండూర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

READ MORE  Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *