Saturday, April 19Welcome to Vandebhaarath

తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Spread the love

అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో అక్టోబర్‌ 1, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (G.Kirshan Reddy) శుక్రవారం తెలిపారు. తన మహబూబ్‌నగర్ పర్యటనలో మోదీ రూ.13,545 కోట్లతో ప్రాజెక్టులను ప్రారంభిస్తారని, నిజామాబాద్‌లో రూ.8,021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు.

READ MORE  పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం

ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) రెండు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రధాని అయిన తర్వాత గత తొమ్మిదేళ్లలో కేంద్రం వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ అలసత్వం కారణంగా రాష్ట్రానికి కావాల్సిన భూమిని అప్పగించకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కలేకపోతున్నాయని ఆరోపించారు.

ఇప్పడు మా WhatsApp చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

READ MORE  TS Mahalakshmi Scheme | బీపీఎల్‌ కుటుంబాలకే రూ.500లకు గ్యాస్ సిలిండర్ ‌

బీఆర్‌ఎస్‌పై దాడి చేసిన ఆయన.. గతంలో మహిళా మంత్రి లేని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(KCR) ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు కేంద్రం మీటర్లు బిగించనుందన్న బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. అలాంటి చర్యేమీ లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గతంలోనే స్పష్టం చేశారని చెప్పారు.

కాగా, అక్టోబర్ 3న ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ రోజున ఎన్‌టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్‌ను మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

READ MORE  Hydra News | స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్‌, మాదాపూర్‌లో ఆక్రమణల నేలమట్టం

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *