Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా
మావోయిస్టులు వెంటనే హింసాకాండను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు. అనంతరం నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కు భారత్ తన శక్తి ఏమిటో చూపిందని అన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని, నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ వదిలేసి లొంగిపోవాలని, నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. . ఇప్పటివరకు 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని అమిత్ షా పేర్కొన్నారు.Amit Shah : తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం..త...