Wednesday, February 18"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

World

#international, #worldwide, #instagram, #travel #world #photography #art #india #fashion #usa #hiphop #business Global #online #artist #imun #uk #like #follow #news #education #lifestyle #africa #model #canada #dance #london USA

Zombie Virus | శ‌తాబ్దాల‌ తర్వాత భ‌య‌పెడుతున్న‌ డేంజరస్‌ వైరస్‌.. కరోనాను త‌ల‌ద‌న్నే విపత్తు వ‌స్తుందా?

Zombie Virus | శ‌తాబ్దాల‌ తర్వాత భ‌య‌పెడుతున్న‌ డేంజరస్‌ వైరస్‌.. కరోనాను త‌ల‌ద‌న్నే విపత్తు వ‌స్తుందా?

World
Zombie Virus | కంటికి క‌నిపించ‌ని అతిభ‌యంక‌ర‌మైన‌ వైరస్! అది సోకిన మనుషులు వెంటనే రాక్షసుల్లా మారిపోతారు..! కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోవడం.. అంతా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తుంటారు.. ఆలోచించే విచక్ష‌ణ‌ జ్ఞానం కోల్పోయి కృర‌ మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ లో ఎన్నో జాంబీ వైరస్ కథలు చూశాం క‌దా ! ఇప్పటివరకు ఫిక్షనల్‌ స్టోరీగా ఉన్న ఈ వైరస్‌.. తొందరలోనే వాస్తవం కాబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా మంచులో కూరుకుపోయిన ఈ ప్రమాదకరమైన వైరస్‌లు‌.. ఇప్పుడు బయటకు వస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. కరోనా వైరస్‌ (corona virus) సృష్టించిన విపత్తు నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే.. కొవిడ్ ను తలదన్నే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు మానవులపైకి అటాక్ చేసేందుకు సిద్ధమవుతుందన్న విషయం తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు. గ్లోబర్ వార్...
మావోరి తెగ భాష‌లో ఇర‌గ‌దీసిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ.. వీడియో వైర‌ల్

మావోరి తెగ భాష‌లో ఇర‌గ‌దీసిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ.. వీడియో వైర‌ల్

Viral, World
వెల్లింగ్ట‌న్‌: న్యూజిలాండ్‌ (New Zealand) లో మావోరి తెగ‌కు చెందిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి మైపి క్లార్క్ మొదటి సారి పార్ల‌మెంట్‌కు ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో అతి పిన్న వ‌య‌స్సులో ఎంపికైన నేత‌గా ఆమె రికార్డు నమోదు చేశారు. గత సంవత్సరం అక్టోబ‌రు‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మైపిక్లార్క్ పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. హౌర‌కి వైకాటో స్థానం నుంచి ఎంపీగా ఆమె విజయం సాధించారు. న్యూజిలాండ్ లోని స్థానిక తెగ మావోరిల సంక్షేమం కోసం మైపి క్లార్క్ చాలా ఏల్లుగా నుంచి పోరాటం చేస్తున్నారు.కాగా పార్ల‌మెంట్‌లో తొలిసారి ప్ర‌సంగం చేసిన మైపి క్లార్క్.. మావోరి భాష‌లో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె చాలా ఆవేశ‌పూరితంగా మావోరి స్వ‌రాన్ని వినిపించారు. ‘మీ కోసం చ‌స్తా.. కానీ మీ కోసం కూడా జీవిస్తాను’ అని ఆమె త‌న ప్ర‌సంగంలో వివరించారు. మావోరిలో త‌మ భాష‌లో మాట్లాడుతుంటే.. ఎలాంట...
మా వేళ్లు ట్రిగ్గర్ మీద రెడీగా ఉన్నాయి… ఇజ్రాయెల్ కు ఇరాన్ తీవ్ర హెచ్చిరిక

మా వేళ్లు ట్రిగ్గర్ మీద రెడీగా ఉన్నాయి… ఇజ్రాయెల్ కు ఇరాన్ తీవ్ర హెచ్చిరిక

World
న్యూఢిల్లీ: గాజాపై భూ దండయాత్రకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మీద దాడిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్‌ తీరును కూడా తప్పుబట్టింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆగకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి" అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వార్తా సంస్థ రాయిటర్స్ కు వెల్లడించారు. గాజా(Gaza)పై నిరంతర ఇజ్రాయెల్ బాంబు దాడిలో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన కోస్టల్ ఎన్‌క్లేవ్‌కు నీరు, విద్యుత్, ఆహారాన్ని నిలిపివేసింది. కానీ నిన్న దక్షిణ ప్రాంతానికి నీటిని పునరుద్ధరించింది. ఇరాన్( Iran) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, "పరిస్థి...
Akshardham Temple : అమెరికా న్యూ జెర్సీలో అట్టహాసంగా ప్రారంభమైన అక్షరధామ్ దేవాలయం

Akshardham Temple : అమెరికా న్యూ జెర్సీలో అట్టహాసంగా ప్రారంభమైన అక్షరధామ్ దేవాలయం

World
Akshardham Temple : భారతదేశం వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునిక హిందూ దేవాలయం న్యూజెర్సీ అక్షరధామ్ ఆదివారం ప్రారంభమైంది. 183 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అసాధారణ నిర్మాణ అద్భుతం  న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణాన 90 కి.మీ దూరంలో ఉంది. 12 సంవత్సరాలలో (2011 నుండి 2023 వరకు), ఇది USA అంతటా 12,500 కంటే ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులచే నిర్మించబడింది. కాగా 1992లో గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో మొదటి అక్షరధామ్ నిర్మించబడింది. దాని తర్వాత న్యూఢిల్లీలో (2005లో) అక్షరధామ్ నిర్మించారు.న్యూజెర్సీలోని అక్షరధామ్ (Akshardham Temple) కోసం ఇటలీ నుండి నాలుగు రకాల పాలరాయి, బల్గేరియా నుండి సున్నపురాయితో కూడిన ఈ విలువైన వస్తువులను తీసుకొచ్చారు. న్యూజెర్సీ అక్షరధామ్ అనేది బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS), స్వామినారాయణ విభాగంలోని ప్రపంచ మతపరమైన అలాగే ప...
Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Trending News, World
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు.కాగా హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మ...
Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు

Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు

World
Kabul : ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా సుమారు 320 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌ ( Afghanistan's Herat) లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , వందలాది మంది గాయపడ్డారు. కాగా హెరాత్‌లోని స్థానిక అధికారులు ఈ ప్రావిన్స్‌లో అనేక భూకంపాల (earthquake) లో 30 మందికి పైగా మరణించారని 600 మందికి పైగా గాయపడ్డారని పజ్వాక్ ఆఫ్ఘన్ న్యూస్ నివేదించింది.Afghanistan earthquake అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జిందా జాన్, ఘోరియన్ జిల్లాల్లోని 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ మాట్లాడుతూ.. నేటి భూకంపం కారణంగా హెరాత్‌లోని "జిందా జాన్" జిల్లాలోని మూడు గ్రామాలలో కనీసం 15 మంది మరణించారని, దాదాపు 40 మంది గాయపడ్డారని టోలో న్యూస్ నివ...
వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు

వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు

World
Libya floods : తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో భారీ వరదలు తుఫాను కారణంగా సుమారు 2,000 మంది మరణించారు. వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. తూర్పు లిబియాను నియంత్రించే లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెర్నా నగరంపై ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు సంభవించిదని, భవనాలు, ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయని తెలిపారు. తప్పిపోయిన వారి సంఖ్య 5,000-6,000గా పేర్కొన్నారు. అంతకుముందు సోమవారం, ఈ ప్రాంతంలోని రెడ్ క్రెసెంట్ సహాయ బృందం అధిపతి డెర్నా మరణాల సంఖ్య 150 ఉందని, 250కి చేరుకుంటుందని అంచనా వేశారు. ట్రిపోలీలో, విభజించబడిన దేశంలో దేశాధినేతగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల అధ్యక్ష మండలి..  అంతర్జాతీయ సమాజాన్ని సహాయం కోరింది. సమాంతర తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ, 2,000 మందికి పైగా మరణించారు.. వేలాది మం...
ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ

ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ

World
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్', పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం.గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని మోదీ నాయకత్వం.. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని బలంగా నిలబెట్టిన ఆయన దార్శనికతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలను కూడా ఇది చాటుతుంది. ప్రధాని మోదీకి లభించిన అవార్డులను ఒకసారి చూద్దాం:జూన్ 2023లో ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ప్రధాని మోదీకి ఈజిప్ట్ యొక్క అత్యున్నత రాష్ట్ర ...
ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

World
గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ పురస్కార ప్రదానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ (Grand Cross of the Legion of Honour) ’ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు.  దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది.రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీ (Prime Minister Narendra Modi ) కి రెడ్ ఘన స్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఇక్కడ ఎలిసీ ప్యాలెస్‌లో జరిగిన అ...
ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

World
ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్  ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World's Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) ఈ సంవత్సరం ట్రావెల్ + లీజర్ రీడర్‌లకు ఇష్టమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏకైక భారతీయ విమానాశ్రయంగా నమోదైంది.విమానాశ్రయాల యాక్సెస్, చెక్-ఇన్, భద్రత, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ డిజైన్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసింది."ఈ గుర్తింపు ప్రపంచ స్థాయి ఆతిథ్యంతో పాటు ప్రయాణికులకు నిరంతరం అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో Chhatrapati Shivaji Maharaj International Airport  (CSMIA ) మేటిగా నిలిందని ఈ సర్వే చెబుతోంది.  CSMIA ప్రయాణికులపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఈ గౌరవప్రదమైన జాబితాలో తన అర్హతను ...