Wednesday, February 18"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

World

#international, #worldwide, #instagram, #travel #world #photography #art #india #fashion #usa #hiphop #business Global #online #artist #imun #uk #like #follow #news #education #lifestyle #africa #model #canada #dance #london USA

పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?

పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?

World
Pager | బీరుట్: లెబనాన్‌లో టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి పేజర్లు పేలిపోవడంతో   తొమ్మిది మంది మరణించగా, 2,800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. లెబనాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు (సాయంత్రం 6 గంటలకు IST) పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, దాదాపు 2,800 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధృవీకరించారు. పేజర్లు అంటే ఏమిటి? పేజర్ లేదా 'బీపర్' అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా సంక్షిప్త సందేశాలను స్వీకరించే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు పేజర్లను విస్తృతంగా ఉప‌యోగించేవారు ముఖ్యంగా వైద్యులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, యూత్ కోసం అప్ప‌ట్లో ఇది అత్యంత‌ కీలకమైన కమ్యూనికేషన్ సాధ...
Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

World
Beirut : లెబ‌నాన్‌లో ఎప్పుడూ చూడ‌ని కొత్త త‌ర‌హా పేలుళ్లు సంచ‌ల‌నం సృష్టించాయి. హిజ్‌బుల్లాలు వాడే పేజ‌ర్ల‌ను హ్యాక్‌ చేసి ఒక్క‌సారిగా పేల్చేశారు (Pagers Explosion). దీంతో లెబ‌నాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల‌లో ఉండే.. లిథియం బ్యాట‌రీల‌ను పేలుళ్ల కోసం వాడారు. పేజ‌ర్ పేలుళ్ల‌లో లెబ‌నాన్‌, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. ఎనిమిది మంది మృతి చెందారు. అయితే పేజ‌ర్ పేలుళ్ల‌కు సంబంధించిన‌ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పేజ‌ర్ వినియోగించేవారు ఒక్క‌సారిగా అది పేల‌డంతో తీవ్ర గాయాల‌పాలై కుప్ప‌కూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్‌బుల్లా ఆప‌రేటివ్స్ ఈ కొత్త త‌ర‌హా పేలుళ్ల‌తో గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హ‌స్తం ఉంద‌ని లెబ‌నాన్ ఆరోపిస్తుంది. Over 1,200 Hezbollah operatives injured in alleged Israeli supply-chain attack...
Donald Trump | ట్రంప్ పై మ‌రో హ‌త్యాయ‌త్నం.. రెండు నెలల్లో రెండవ సారి..

Donald Trump | ట్రంప్ పై మ‌రో హ‌త్యాయ‌త్నం.. రెండు నెలల్లో రెండవ సారి..

World
Donald Trump assassination attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పై మ‌రోసారి హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ వెలుపల తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ క్ర‌మంలో రెండు నెలల్లో ట్రంప్ రెండవ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. ఆదివారం (సెప్టెంబర్ 15). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లోకి రైఫిల్‌ను గురిపెట్టి కాల్పులు జరిపిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.ఫోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ దుండ‌గుడు అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. హుటాహుటిన ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.అమెరికా కాలమానం ప్రకారం ...
IRCTC ఈ టూర్ ప్యాకేజీ చాలా ప్రత్యేకమైనది.. త‌క్కువ ఖ‌ర్చుతో థాయ్‌లాండ్ టూర్‌..

IRCTC ఈ టూర్ ప్యాకేజీ చాలా ప్రత్యేకమైనది.. త‌క్కువ ఖ‌ర్చుతో థాయ్‌లాండ్ టూర్‌..

World
IRCTC Thailand Tour Package : ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా విదేశాల‌ను సందర్శించాలని ఎన్నో కలలు కంటారు. కానీ బడ్జెట్ ప‌రిమితుల‌ కార‌ణంగా చాలా మందికి జీవిత కాలం సాధ్య‌ప‌డ‌దు. ఎందుకంటే విదేశాలకు వెళ్లాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు కూడా అదే ఆలోచిస్తే ఈ వార్త మీకు మంచి వార్త కావొచ్చు. ఎందుకంటే మీరు చాలా తక్కువ డబ్బుతో థాయ్‌లాండ్‌ని సందర్శించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ ద్వారా పొంద‌వ‌చ్చు. ఇది మాత్రమే కాదు, మీరు టూర్ ప్యాకేజీ సమయంలో అన్ని రకాల సౌకర్యాలను ఆస్వాదించ‌వ‌చ్చు. అయితే ఈ పర్యటనను బెంగళూరు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టూర్ ప్యాకేజీలో మీకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో చూడండి. Thailand Tour Package వివరాలు.. IRCTC ఈ టూర్ ప్యాకేజీని థాయ్‌లాండ్ డిలైట్స్ ఎక్స్ బెంగళూరు (THAILAND DELIGHTS EX BENGALURU) గా పేర్కొంది. అలాగే, ప్యాకేజీ కోడ్ విష‌యానికొస్తే.. అది SBO5....
Bangladesh | పాక్ చెర‌లోకి వెళ్తున్న బంగ్లాదేశ్‌.. ?

Bangladesh | పాక్ చెర‌లోకి వెళ్తున్న బంగ్లాదేశ్‌.. ?

World
Bangladesh | బంగ్లాదేశ్ ఇస్లాంవాదులు, ప్రస్తుత పాలకుల తీరు తమ దేశాన్ని పాకిస్తాన్ వైపు మళ్లించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు.. మొహమ్మద్ అలీ జిన్నా వర్ధంతిని గ‌త‌ బుధవారం ఢాకాలో ఘనంగా నిర్వహించారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ బద్దశత్రువుగా భావించిన జిన్నాను విచిత్రంగా 76వ వర్ధంతి ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా ఉర్దూలో జిన్నాను పొడిగేలా పాటలు పాడ‌డ‌మే కాకుండా.. కొంద‌రు వక్తలు జిన్నాను 'జాతి తండ్రి'గా పేర్కొనాలని పిలుపునిచ్చారు.బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ కమ్రాన్ దంగల్ హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత పాలనకు అనుగుణంగా ఉన్నారు. ఈవెంట్‌లో చాలా మంది వక్తల ...
Earthquake in Delhi -NCR | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం.. ఢిల్లీలోనూ ప్ర‌కంప‌న‌లు

Earthquake in Delhi -NCR | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం.. ఢిల్లీలోనూ ప్ర‌కంప‌న‌లు

World
Earthquake in Delhi-NCR : పాకిస్తాన్‌లో ఈరోజు (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ త‌ర్వాత ఢిల్లీ ప‌రిస‌ర‌ప్రాంతంలో ప్రకంపనలు ఏర్పడ్డాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. దేశయ‌ వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం నాడు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఇది పాకిస్థాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:28 గంటలకు ఉద్భవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నైరుతి భాగంలో డేరా ఘాజీ ఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖను ఉటంకిస్తూ జి0యో న్యూస్ నివేదించింది.అయితే భూకంపం (Ea...
Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..

Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..

World
Adani Group | షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం (Bangladesh Crisis) తీవ్రమవుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఇటీవల రుణాల కోసం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)తో పాటు పలు చోట్ల తలుపులు తట్టారు. ఇప్పుడు అతడి ముందు మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా బిల్లును చెల్లించాలని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించింది.  దాదాపు 500 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించాలని అదానీ గ్రూప్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ ఒప్పందాలపై విమర్శలు.. అదానీ గ్రూప్ తన 1600 మెగావాట్ల గొడ్డ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే   ఇప్పుడు మహ్మద్ యూనస్ దీనిని చాలా ఖరీదైన ఒప్పందం అని పిలవడం ప్రారంభించాడు. ఈ డీల్‌లో కూడా పారదర్శకత పాటించలేదని, షేక్ హ...
Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

World
Rahul Gandhi in US | అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ సమస్యలు, తయారీ రంగంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. డల్లాస్‌లో సభికులను ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ, భారతదేశంతో సహా పాశ్చాత్య దేశాలు ఉత్పత్తి, తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఇది ఉద్యోగాల కల్పనకు కీలకమని ఆయన వాదించారు. అతని వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది భారతదేశ పురోగతిని బలహీనపరిచిందని మరియు చైనాకు అనుకూలంగా ఉందని ఆరోపించింది.రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఒకప్పుడు గ్లోబల్ తయారీలో ఆధిపత్యం చెలాయించాయి. భారత్‌తో సహా అనేక దేశాలు అధిక నిరుద్యోగిత రేటుతో సతమతమవుతున్నాయని, చైనా, వియత్నాం వంటి దేశాలు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం వల్ల తమ ఉపాధి సవాళ్లను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని ఆ...
Italy | యూరప్ వలస వాదంపై నిప్పులు చెరిగిన ఇటలీ ప్రధాని..

Italy | యూరప్ వలస వాదంపై నిప్పులు చెరిగిన ఇటలీ ప్రధాని..

World
Italy | వలస సంక్షోభంపై యూరప్ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఈ వైరల్ వీడియోలో, మెలోని ఇటలీ "యూరప్ శరణార్థి శిబిరం ప్రమాదంగా మారుతోంద‌ని, లిబియాలో నావికా దిగ్బంధనం చేయ‌డంతోప‌టు NGO రెస్క్యూ షిప్‌లను స‌ముద్రంలో ముంచేయాలని పిలుపునిచ్చింది. "మేము యూరప్ శరణార్థుల శిబిరంగా మారే ప్రమాదం ఉంది, మాకు లిబియాలో నావికా దిగ్బంధనం అవసరం, NGO నౌకలను ముంచడం ప్రారంభించాలి" అని ఇటాలియన్ PM ఆవేశపూరితంగా అన్నారు.అక్రమ వలసలకు వ్యతిరేకంగా మెలోని కఠిన వైఖరిని హైలైట్ చేస్తూ వీడియో వైరల్‌గా మారింది. ఆమె ప్రభుత్వం ఇటీవల 23వ సారి రెస్క్యూ షిప్ జియో బారెంట్స్‌ను స్వాధీనం చేసుకుంది. మధ్యధరా వలసలపై అణిచివేతను తీవ్రతరం చేసింది. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (MSF) ఆధ్యంలో నిర్వహిస్తున్న ఓడ 191 మంది వలసదారులను రక్షించిన తర్వ...
Bangladesh | బంగ్లాదేశ్ లో జడలు విప్పుతున్నమరో నిషేధిక ఉగ్రవాద సంస్థ.. భారత్ కూ ప్రమాదమే..

Bangladesh | బంగ్లాదేశ్ లో జడలు విప్పుతున్నమరో నిషేధిక ఉగ్రవాద సంస్థ.. భారత్ కూ ప్రమాదమే..

World
Bangladesh Crisis 2024 | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక‌త్త‌ల‌ మధ్య, ఆ దేశం మరో సవాలును ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ కాలిఫేట్‌ను తిరిగి స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా షరియాను అమలు చేయాలని కోరుకునే ఒక ఛాందసవాద రాజకీయ సంస్థ అయిన హిజ్బ్ ఉత్-తహ్రీర్ (HuT) ప్రభావం వేగంగా పెరుగుతోంది.అనేక దేశాలలో నిషేధించబడిన HuT ను గ‌బంగ్లాదేశ్‌లో కూడా అక్టోబ‌ర్ 9న బ్యాన్ చేశారు. అయితే ఈ సంస్థ మద్దతుదారుల (ఢాకాతో సహా) ర్యాలీలు చేస్తుండడంతోపాటు సంస్థ‌ భావజాలాన్ని ప్రచారం చేసే పోస్టర్‌లు ఇప్పుడు అక్క‌డ‌క్క‌డా వెలుస్తుండ‌డంతో ఇప్పుడు సీన్‌ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది."హిజ్బ్ ఉత్-తహ్రీర్ అనేది పాపులర్ అయిన విద్యావంతులను కలిగి ఉన్న సంస్థ. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని సమాజంలోని అన్ని వర్గాలలోనూ వారి ప్ర‌భావం ఉంది” అని ఢాకాకు చెందిన ఒక‌ ప్రొఫెసర్ మీడియాతో చెప్పారు. ఆగష్టు 9న, HuT మద్దతుదారులు ఢాకాలోని బైతుల...