Wednesday, April 16Welcome to Vandebhaarath

World

#international, #worldwide, #instagram, #travel #world #photography #art #india #fashion #usa #hiphop #business Global #online #artist #imun #uk #like #follow #news #education #lifestyle #africa #model #canada #dance #london USA

Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది
World

Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది

నాసా (Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి భారతదేశం పట్ల తన అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారత దేశం "అద్భుతం" గా కనిపించిందని తెలిపారు. సునీతా విలియమ్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భారతదేశాన్ని చూసిన తన విస్మయపరిచే అనుభవాన్ని పంచుకున్నారు, హిమాలయాలు, శక్తివంతమైన తీరప్రాంతం, ఉపఖండం అంతటా విస్తరించి ఉన్న నగర దీపాల వలయం ఉత్కంఠభరితమైన దృశ్యాలు అద్నుభుతంగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు."భారతదేశం అద్భుతంగా ఉంది," అని విలియమ్స్ అన్నారు. సుదీర్ఘకాలం స్పేస్ లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్ లో IND ఎయిరో ఫోర్స్ పైలట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లను...
Earthquake : మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం
World

Earthquake : మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం

Earthquake : భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ ప్రభుత్వ చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో మాట్లాడారు. మయన్మార్‌ను కుదిపేసిన భూకంపంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు భారతదేశం అండగా నిలబడటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆపరేషన్ బ్రహ్మ (Operation Brahma) కింద, విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, సెర్చ్, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నామని ఆయన అన్నారు.'X' పోస్ట్‌లో ప్రధాని మోదీ భూకంపం (Earthquake)లో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒక సన్నిహిత మిత్రుడిగా, పొరుగు దేశంగా, భారతదేశం ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ కింద విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, శోధన, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నాం ...
Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు
World

Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు

Breaking News | Balochistan : బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్‌లో, క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది. 100 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందిని బందీలుగా ఉంచినట్లు BLA వెల్లడించినట్లు తెలిసింది. రైలుపై BLA భారీ కాల్పులు జరిపింది. 400 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారని సమాచారం.పాకిస్తాన్ రైల్వే నడిపే ప్యాసింజర్ రైలు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి, బలూచిస్తాన్‌లో 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మంగళవారం ప్రకటించుకుంది. రైలును తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ ...
USAID $750 మిలియన్ల  నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
World

USAID $750 మిలియన్ల నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత ఎన్నికలను ప్రభావితం చేయడంలో USAID పాత్ర ఉందనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వార్షిక నివేదిక 2023-24లో 750 మిలియన్ డాలర్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని కేంద్రం వెల్లడించింది."ప్రస్తుతం, భారత ప్రభుత్వంతో భాగస్వామ్యంతో USAID ద్వారా మొత్తం 750 మిలియన్ డాలర్లు (సుమారుగా) బడ్జెట్ విలువైన ఏడు ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి" అని 2023-24 ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఏడు ప్రాజెక్టుల కింద US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) మొత్తం USD 97 మిలియన్ల (సుమారు రూ. 825 కోట్లు) బాధ్యతను చేపట్టిందని తెలిపింది.ద్వైపాక్షిక నిధుల ఏర్పాట్లకు నోడల్ విభాగంగా ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కూడా ...
Donald Trump :  మొద‌టిరోజే యాక్ష‌న్‌లోకి దిగిన‌ ట్రంప్.. పాత విధానాల‌ను ర‌ద్దు చేస్తూ సంత‌కాలు
World

Donald Trump : మొద‌టిరోజే యాక్ష‌న్‌లోకి దిగిన‌ ట్రంప్.. పాత విధానాల‌ను ర‌ద్దు చేస్తూ సంత‌కాలు

వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump )వచ్చీ రాగానే త‌న మార్క్ పాల‌నను ప్రారంభించారు. బిడెన్ కాలం నాటి 78 విధానాలను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అక్కడ అతను ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులకు ఒక్కొక్కటిగా సంతకం చేసిన పత్రాలను అందించారు. ఈ జాబితాలో, ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌పై నియంత్రణ, పారిస్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలగాలని లక్ష్యంగా పెట్టుకున్న ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.వైట్‌హౌస్‌కి వచ్చిన Donald Trumpడొనాల్డ్ J. ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు, సుదీర్ఘ కాలం తర్వాత ఓవల్ కార్యాలయానికి తిరిగి వచ్చినట్లు గుర్తు చేశారు. యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్‌లో రాజకీయ నాయకులు, ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ తో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం...
Donald Trump : ఆ న‌ర‌కానికి ముగింపు ప‌లుకుతాం.. ! హ‌మాస్‌కు ట్రంప్‌ మాస్ వార్నింగ్‌..
World

Donald Trump : ఆ న‌ర‌కానికి ముగింపు ప‌లుకుతాం.. ! హ‌మాస్‌కు ట్రంప్‌ మాస్ వార్నింగ్‌..

Donald Trump : డోనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను జనవరి 20న వైట్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించేలోపు ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయకుంటే ‘నరకం అంత‌మ‌వుతుంది’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు.మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. హమాస్ బందీలను విడుదలపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. "ఇది హమాస్‌కు మంచిది కాదు. ఇది ఎవరికీ మంచిది కాదు. హమాస్ ఇప్పటికే బందీల‌ను విడుద‌ల చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే చాలా మంది హ‌త్య‌కు గుర‌య్యారు."వారు ఇకపై బందీలుగా ఉండ‌రు.. నాకు ఇజ్రాయెల్ నుండి వచ్చిన వ్యక్తులు, ఇతరులు కాల్ చేస్తున్నారు, వాళ్ల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వారిని కూడా బందీలుగా చేశారు. వాళ్ల తల్లులు నా దగ్గరకు వచ్చార...
India-China tensions | ఒక మిలియన్ సుసైడల్ డ్రోన్స్ సిద్ధం చేస్తున్న చైనా!
World

India-China tensions | ఒక మిలియన్ సుసైడల్ డ్రోన్స్ సిద్ధం చేస్తున్న చైనా!

China's Kamikaze Drone Strategy | అనేక ద్వైపాక్షిక చర్చల తర్వాత భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఒక ముగింపుకు వచ్చినట్లు అనిపిస్తోంది. కానీ డ్రాగన్ దేశం ఇపుడు మనదేశంలో ఉద్రిక్తతలను (India-China tensions) పెంచే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలను సులభంగా టార్గెట్ చేయగల 100 కాదు, ఏకంగా 1 మిలియన్ సూసైడ్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని చైనా యోచిస్తున్నట్లు సమాచారం. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆదేశించిన ఈ డ్రోన్‌లను 2026 నాటికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA China army)కి అందజేయాలని భావిస్తున్న‌ది. అయితే, చైనా ఇంత పెద్ద మొత్తంలో సూసైడ్ డ్రోన్‌లను ఎందుకు కొనుగోలు చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నేప‌థ్యంలో తైవాన్ కూడా అతిపెద్ద ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని, భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, భారతదేశం ఇప...
India-Sri Lanka | భార‌త్‌ కు తిరుగులేని మద్ద‌తు ప్రకటించిన శ్రీలంక
World

India-Sri Lanka | భార‌త్‌ కు తిరుగులేని మద్ద‌తు ప్రకటించిన శ్రీలంక

New Delhi : శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే ( Anura Kumara Dissanayake ) సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో విస్తృత చర్చల సందర్భంగా భారత్ కు సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఇచ్చారు. భార‌త‌ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎవ‌రికీ అనుమతించ‌మ‌ని హామీ ఇచ్చారు. సంయుక్త పత్రికా ప్రకటనలో, శ్రీలంక అధ్యక్షుడు, "భారత ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా మా భూమిని ఉపయోగించడాన్ని మేము అనుమతించబోమని నేను భారత ప్రధానికి హామీ ఇచ్చాను. భారతదేశంతో త‌మ‌ సహకారం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని అన్నారు.India-Sri Lanka bilateral ties : సెప్టెంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం శ్రీలంక ప్రెసిడెంట్‌ దిసానాయక ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. చర్చలకు ముందు, రాష్ట్రపతి భవన్‌లో డిసానాయక్‌కు లాంఛనంగా స్వాగతం పలికారు. "వాణిజ్యం, పెట్టుబడులు, ...
Syria News | 50 ఏళ్ల‌ తర్వాత, సిరియాలోకి ప్ర‌వేశించిన ఇజ్రాయెల్.. గోలన్ హైట్స్ స్వాధీనం..
World

Syria News | 50 ఏళ్ల‌ తర్వాత, సిరియాలోకి ప్ర‌వేశించిన ఇజ్రాయెల్.. గోలన్ హైట్స్ స్వాధీనం..

Syria News LIVE Updates | 50 ఏళ్ల తర్వాత, HTS తిరుగుబాటుదారులు సిరియా డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోకి ప్రవేశించింది, ఇది సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను మాస్కోకు పారిపోయిన త‌ర్వాత డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ ఆర్మీ ట్యాంకులు కనిపించాయి. ఇజ్రాయెల్ సైన్యం గోలన్ హైట్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. ఇది వ్యూహాత్మక విజయంగా చెప్ప‌వ‌చ్చు.అయితే ఇజ్రాయెల్ చర్య ముస్లిం దేశాలకు కోపం తెప్పించింది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ ఇజ్రాయెల్ చర్యను 'ప్రమాదకరం' అని పేర్కొన్నాయి, మరోవైపు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిరియన్ విమానాశ్రయాలు, ఇతర వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడులు చేశాయి. యూదు దేశం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, సిరియాలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాయి. యూదు దేశం సిరియాపై దాడి చేస్తోంద‌ని సౌదీ అరేబియా ఆగ్ర‌హంవ్య‌క్తం చేసింది. గోలన్ హైట్...
Tulsi Gabbard | ట్రంప్ 2.0లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ గా హిందూ కాంగ్రెస్ మహిళ
World

Tulsi Gabbard | ట్రంప్ 2.0లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ గా హిందూ కాంగ్రెస్ మహిళ

Tulsi Gabbard | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో నేషనల్ ఇంటెలిజెన్స్ (Director of National Intelligence (DNI)) డైరెక్టర్‌గా తులసి గబ్బార్డ్‌ను నియమించారు. ఇది అమెరికా గూఢచారి సంస్థలలో అగ్రగామిగా, అధ్యక్షుడి అత్యున్నత స్పై ఏజెన్సీ సలహాదారుగా పనిచేసే శక్తివంతమైన పదవిగా భావిస్తారు. తులసి గబ్బర్డ్ ఎవరు? తులసి గబ్బార్డ్ రెండు దశాబ్దాలకు పైగా US ఆర్మీ నేషనల్ గార్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఇరాక్, కువైట్ రెండింటిలోనూ పనిచేసింది, ముఖ్యంగా, ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీపై హౌస్ కమిటీలో రెండు సంవత్సరాలు పనిచేశారు.2013 నుండి 2021 వరకు, గబ్బర్డ్ డెమొక్రాట్‌గా హవాయి 2వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆమె కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో, హౌస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో రెండు సంవత్సరాలు పనిచేసి, జాతీయ భద్రత, పౌర హక్కుల పట్ల ఆమె పోరాడి గుర్తింప...