Monday, February 2"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

Spread the love

Indian Railway | మీరు త‌ర‌చూ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారిగా, భారత రైల్వే జూలై 1, 2025 నుంచి ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు తీసుకున్న‌ ఈ నిర్ణయం కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేయ‌నుంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఈ నిర్ణయం వల్ల కొన్ని వర్గాలలో ఎటువంటి పెరుగుదల ఉండదు.

జూలై 1 నుంచి, AC, నాన్-AC రైళ్లలో ప్రయాణించడం కాస్త ఖరీదైనదిగా మారుతుంది. శుభవార్త ఏమిటంటే జనరల్ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే ఛార్జీలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు, కి.మీ.కు 0.5 పైసలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఛార్జీ ఎంత పెరిగింది?

సెకండ్ క్లాస్‌కి, 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణానికి కిలోమీటరుకు 0.5 పైసలు, నాన్-ఎసి మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్లపై కిలోమీటరుకు 1 పైసా పెరుగుదల ఉంటుంది. అత్యధిక పెరుగుదల ఎసి తరగతిలో ఉంటుంది. ఎసి తరగతిలో ప్రయాణించే ప్రయాణికులు కిలోమీటరుకు 2 పైసలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికులకు రైల్వేలు ఉపశమనం కల్పించాయి. స్థానిక రైళ్లు, నెలవారీ సీజన్ టిక్కెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు ఉండదు.

Indian Railway టికెట్ ధరల పెంపు ఎందుకు?

మీరు దిల్లీ నుంచి పాట్నాకు టికెట్ బుక్ చేసుకుంటే, మీరు AC క్లాస్‌లో దాదాపు రూ.20. నాన్-ACలో రూ.10 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. . ఎందుకంటే దిల్లీ నుండి పాట్నాకు దూరం దాదాపు వెయ్యి కిలోమీటర్లు. దిల్లీ నుంచి ముంబైకి (సుమారు 1400 కి.మీ) AC క్లాస్‌లో దాదాపు రూ.28. నాన్-ACలో రూ.14 ఎక్కువ ఖర్చవుతుంది. రైల్వే నష్టాలు, పెరుగుతున్న ఖర్చుల పరిహారం దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ఛార్జీలను పెంచుతున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత జూలై 1, 2025 నుండి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *