
దక్షిణ మధ్య రైల్వేలో కీలక నిర్ణయం
Kavach implementation in Guntur railway division : రైల్వే భద్రతను మెరుగుపరిచే దిశగా భారత రైల్వే (Indian Railway) కీలక అడుగులు వేస్తోంది. గుంటూరు రైల్వే డివిజన్ వ్యాప్తంగా అధునాతన ‘కవాచ్’ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (Kavach automatic train protection system) ను అమలు చేయనున్నాయి.
రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్, సిగ్నల్ ఓవర్షూట్ల సందర్భాలలో లేదా రెండు రైళ్లు ఢీకొనే ప్రమాదం ఎదురైనపుడు ఆటోమెటిక్ గా బ్రేక్లను అప్లై చేస్తుంది. ఈ వ్యవస్థ డిజిటల్ భద్రతా కవచంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తక్కువ దృశ్యమానత తక్కకువగా ఉన్నా.. లేదా డ్రైవర్ ఏమరపాటుగా ఉన్నా రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా చూడడంలో ఈ కవచ్ వ్యవస్థ ప్రభావవంతంగా పని చేస్తుంది.
“రెడ్ సిగ్నల్ వద్ద రైలు ఆగకపోతే లేదా ఎదురుగా ఢీకొనే ప్రమాదం ఉంటే, ఆ వ్యవస్థ మాన్యువల్ నియంత్రణలను అధిగమించి రైలును ఆపివేస్తుంది” అని రైల్వే అధికారులు తెలిపారు. . దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో కవచ్ ప్రాజెక్టుకు అనుమతి లభించిందని, రూ.460 కోట్లతో 1,570 కి.మీ.లు పని చేస్తోందని తెలిపారు.
Kavach : మొదటి దశలో నాలుగు కీలక మార్గాలు
- నంద్యాల–గుంటూరు (256.98 కి.మీ),
- గుంటూరు–నడికుడి (95.25 కి.మీ),
- నడికుడి–బీబీనగర్ (152.69 కి.మీ)
- గుంటూరు–కృష్ణా కెనాల్ (27.12 కి.మీ).
- మొత్తం కవరేజ్ 532.04 కి.మీ.
కవచ్ వ్యవస్థ కోసం ట్రాక్ల వెంట ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయనున్నారు. అలాగే టెలికాం టవర్లు ఏర్పాటు చేస్తారు. డేటా సెంటర్లను ప్రస్తుత సిగ్నలింగ్ నెట్వర్క్తో అనుసంధానిస్తారు. రియల్-టైమ్ మానిటరింగ్, అత్యవసర నియంత్రణ కోసం రైళ్లలో ఆన్బోర్డ్ కవచ్ పరికరాలు కూడా అమర్చుతారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వేల విస్తృత ఆధునీకరణలో భాగం, అలాగే ప్రయాణీకుల భద్రతను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.