National

Bharat Rice | రూ. 29కి బియ్యం విక్ర‌యం.. రేప‌టి నుంచి మార్కెట్‌లోకి భార‌త్ రైస్

Spread the love

Bharat Rice : దేశంలో బియ్యం ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. బియ్యం ల‌భ్య‌త‌ను పెంచి ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవ‌లం రూ. 29కి విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌బ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎఫ్‌) కేంద్రియ భండార్ ఔట్‌లెట్ల ద్వారా విక్ర‌యించ‌నున్నట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ కోసం మన వాట్సప్ చానల్ లో చేరండి

Bharat Rice పై ఏ క్ష‌ణ‌మైనా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గోధుమ పిండి, ప‌ప్పు ధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్‌ పేరుతో త‌క్కువ ధ‌ర‌ల‌కే పంపిణీ చేస్తోంది. న‌వంబ‌ర్‌లో తృణ‌ధాన్యాల ధ‌ర‌లు ప‌ది శాతం పైగా ఎగ‌బాక‌డంతో ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 8.7 శాతానికి పెరిగింది.

Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *