Posted in

Hyderabad Flights | హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా విమానాలు

Hisar to Ayodhya
Hyderabad Flights
Spread the love

RGIA నుంచి ఏడు కొత్త డైరెక్ట్ విమానాలు ప్రారంభం

Hyderabad Flights | విమానయాన సంస్థ సెప్టెంబర్ 28న హైద‌రాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాన్ని ప్రారంభించనుంది. ఈ విమాన స‌ర్వీసులు సోమ, బుధ, శుక్రవారాలు, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడుస్తుంది. జూన్ 1న హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను స్పైస్‌జెట్ నిలిపివేసింది. ఈ క్ర‌మంలో మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి యూపీలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు తన డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. ఎయిర్‌లైన్స్ సెప్టెంబర్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి ఏడు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించింది . RGIA నుంచి కొత్త మార్గాలు హైదరాబాద్‌ను రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ న‌గ‌రాల‌కు కలుపుతాయి.

విమానయాన సంస్థ సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు అయోధ్యకు విమానాలను నడపనుంది. జూన్ 1న స్పైస్‌జెట్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసిన తర్వాత మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్-రాజ్‌కోట్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సెప్టెంబర్ 16న ప్రారంభం కాగా, హైదరాబాద్-అగర్తల మధ్య వారానికి 4 రోజుల సర్వీస్ సెప్టెంబర్ 23న ప్రారంభించింది. అలాగే హైదరాబాద్-జమ్మూ మధ్య వారానికి 3 రోజుల సర్వీసు సెప్టెంబర్ 24న ప్రారంభమైంది.

హ‌ర్షం వ్య‌క్తం చేసిన కిష‌న్ రెడ్డి

Hyderabad Flights హైదరాబాద్ నగరం నుంచి నెల రోజుల్లో 7 కొత్త సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రయాణికులు వివిధ సాంస్కృతిక గమ్యస్థానాలను అన్వేషించడం సులభతరం అవుతుందని ఆయన అన్నారు. ఈ కొత్త సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేర్చగలవని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *