Saturday, April 19Welcome to Vandebhaarath

400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..

Spread the love

Aligarh: రామమందిరం కోసం ప్రపంచంలోనే అతిపెద్దదైన తాళాన్ని తయారు చేశాడు అలీఘర్ కు చెందిన ఒక రామభక్తుడు సత్య ప్రకాశ్ శర్మ. చేతితో తాళాలను తయారు చేయడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తాజాగా అయోధ్యలోని రామమందిరం కోసం ఏకంగా 400 కిలోల తాళాన్ని రూపొందించారు. రామమందిరం వచ్చే ఏడాది జనవరిలో భక్తుల కోసం ప్రారంభించనుండగా సత్య ప్రకాష్ శర్మ “ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన తాళం” సిద్ధం చేయడానికి నెలల తరబడి కష్టపడ్డారు. దానిని ఈ సంవత్సరం చివర్లో రామ మందిర అధికారులకు బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నారు.

శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు మాట్లాడుతూ తమకు చాలా మంది భక్తుల నుండి కానుకలు అందుతున్నాయని, తాళం ఎక్కడ ఉపయోగించాలో చూడాలని అని పేర్కొన్నారు.
45 ఏళ్లుగా ‘తాళా నగరి’ (taala nagri) లేదా తాళాల భూమి (land of locks) అని కూడా పిలువబడే అలీఘర్‌లో తాళాలు తయారు చేయడంలో తన కుటుంబం ఒక శతాబ్దానికి పైగా నిమగ్నమై ఉందని సత్య ప్రకాశ్ శర్మ చెప్పారు. రామ మందిరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో నాలుగు అడుగుల తాళం వేసి తాళం వేసినట్లు శర్మ తెలిపారు.

READ MORE  Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..

ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన వార్షిక అలీఘర్ ఎగ్జిబిషన్‌లో భారీ తాళాన్ని ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం తన భారీ తాళానికి చిన్న చిన్న మార్పులు చేయడం, తుది మెరుగులు దిద్దడంలో శర్మ బిజీగా ఉన్నారు. ఇది పరిపూర్ణంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇది నాకు “ప్రేమ యొక్క శ్రమ” అయితే నా భార్య రుక్మణి కూడా ఈ కష్టమైన వెంచర్‌లో నాకు సహాయం చేసింది శర్మ చెప్పారు.

“ఇంతకుముందు మేము 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు గల తాళాన్ని తయారు చేశాము. కానీ కొంతమంది పెద్ద తాళం చేయమని సలహా ఇచ్చారు దీంతో మేము పని ప్రారంభించాము” అని రుక్మణి చెప్పారు. తాళానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

READ MORE  CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

రూ.2లక్షల ఖర్చు

ఈ తాళం చేయడానికి దాదాపు రూ.2 లక్షలు ఖర్చయిందని, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సాకారం చేయడంలో తన జీవితంలో పొదుపు చేసిన డబ్బులను ఇష్టపూర్వకంగా ధారపోశానని శర్మ చెప్పారు. దశాబ్దాలుగా తాళాలు వేసే పనిలో ఉన్న నేను మా ఊరు తాళాలకు పేరుగాంచిందని, ఇంతకు ముందు ఇలాంటి పనులు ఎవరూ చేయలేదని ఆలయానికి పెద్ద తాళం వేయాలని అనుకున్నాను అని వెల్లడించారు.

కాగా, ఆలయ ట్రస్టు వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం తెలిపారు.

READ MORE  Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత ...

Green Mobilty, Ev, Environment News కోసం హరిత మిత్ర ను సందర్శించండి, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం వందేభారత్ ను చూడండి. లేటెస్ట్  అప్డేట్స్ కోసం ట్విట్టర్ లోనూ సంప్రదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *