Home » ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్లు..
Indian railways

ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్లు..

Spread the love

తెలంగాణలో 21, ఏపీలో 18, రైల్వేస్టేషన్ల అభివృద్ధి కి శంకుస్థాపన చేసిన ప్రధాని

దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ పథకం కింద రూ.25 వేల కోట్ల నిధులతో దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆదివారం వర్చువల్ గా మోదీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ రైల్వే రంగంలో ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు.

కాగా, ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

READ MORE  Train Tickets Booking | రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ట్రెయిన్‌ టికెట్ల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

తెలంగాణలో 21 రైల్వేస్టేషన్ల ఎంపిక

దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పునరాభివృద్ధి కోసం 508 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశరు. వీటిలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లలో 55 చొప్పున, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉన్నాయి. ఇక తెలంగాణ 21 గుజరాత్ లో 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.

READ MORE  Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!

తెలంగాణ: హైదరాబాద్‌, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, మలక్ పేట, మల్కాజిగిరి, హఫీజ్ పేట, కాజీపేట, ఖమ్మం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, మధిర, జహీరాబాద్‌.
ఆంధ్రప్రదేశ్‌: కర్నూలు, కాకినాడ టౌన్‌, ఏలూరు, భీమవరం, తెనాలి, పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రేపల్లె, పిడుగురాళ్ల, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ.

స్టేషన్లలో ఈ సౌకర్యాలను కల్పించనున్నారు..

  • ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
  • ఎస్కలేటర్లు
  • ఎలివేటర్లు
  • ద్విచక్ర వాహనాలు, కార్ పార్కింగ్ ప్రాంతాలు
  • ల్యాండ్‌స్కేపింగ్/హార్టికల్చర్ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
  • సిగ్నల్స్ప్లాట్‌ఫారమ్‌లు, ప్లాట్‌ఫారమ్ షెల్టర్‌ల మెరుగుదల
  • బెంచీలు, వాష్ బేసిన్లు
  • మెరుగైన లైటింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు
  • సీసీటీవీలు
READ MORE  Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు

ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్ల అభివృద్ధి చేపట్టారు. స్టేషన్‌లలో మెరుగైన యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్‌లు, లిఫ్ట్/ఎస్కలేటర్‌లు, ఉచిత Wi-Fi, స్థానిక ఉత్పత్తుల కోసం ‘ఒక స్టేషన్ వన్ ప్రొడక్ట్’ వంటి వాటితోపాటు మరెన్నో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.
అలాగే మెరుగైన ప్రయాణికుల సమాచార వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, వ్యాపార సమావేశాల కోసం స్థలాలు, ల్యాండ్‌స్కేపింగ్ మొదలైనవి ప్రాజెక్ట్‌లో భాగంగా ప్లాన్ చేశారు.


Green Mobilty, Ev, Environment News కోసం హరిత మిత్ర ను సందర్శించండి, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం వందేభారత్ ను చూడండి. లేటెస్ట్  అప్డేట్స్ కోసం ట్విట్టర్ లోనూ సంప్రదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..