Home » Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..
Secundrabad Nagpur Vande Bharat Timings

Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

Spread the love

Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భార‌తీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని న‌రేంద్ర‌ మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియ‌న్ రైల్వేస్‌.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్త‌గా వందే భారత్ రైళ్ల‌ను న‌డిపించ‌నుది. భువనేశ్వర్ – విశాఖ – భువనేశ్వర్ కు కూడా వందేభార‌త్‌ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగ‌ళ‌వారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక‌ వందే భారత్ రైలు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ తొలి వందే భారత్ 2023 జనవరి 15 నుంచి సేవ‌లందిస్తోంది. ఈ రైలు ఉదయం 5:45 గంటలకు విశాఖ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని తిరిగి 3 గంటలకు బయలు దేరి రాత్రి 11:30 గంటలకు వైజాగ్ కు చేరుతుంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. వంద శాతం ఆక్యుపెన్సీతో రిజర్వేషన్ సైతం ల‌భించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ప్రయాణికులకు మేలు క‌లిగించేందుకు ఈ రెండు న‌గ‌రాల‌మ మ‌ధ్య మరో వందేభార‌త్ రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్తగా ప్ర‌వేశ‌పెట్టే రైలును కేవ‌లం 8 బోగీలతో మాత్రమే నడపనున్నారు.

READ MORE  సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

కొత్త వందే భారత్ టైమింగ్స్ ఇవే..

సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలుకు భార‌తీయ‌ రైల్వే శాఖ ఆమోదం తెలపగా.. త్వరలోనే ఈ రైలు కూడా పట్టాలెక్కనుంది. ట్రైన్ నెంబర్ 20707 /20708 సికింద్రాబాద్ – విశాఖ – సికింద్రాబాద్ రైలు గురువారం మిన‌హా మిగతా అన్ని రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ రోజూ ఉదయం 5:05 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖ స్టేష‌న్ కు చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు బయల్దేరి రాత్రి 11:20కి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ వందేభార‌త్‌ రైలు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో నిలుస్తుంది.

READ MORE  Amrit Bharat Station Scheme | అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ను చూడండి..

పూరీ – విశాఖ – పూరీకి వందేభారత్

విశాఖ నుంచి ఒడిశాలోని పూరీకి వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు (20841/ 20842) శనివారం మినహా మిగిలిన అన్ని రోజులు పరుగులు పెట్ట‌నుంది. ప్రతిరోజూ ఉదయం 5:15 గంటలకు పూరీ స్టేష‌న్‌లో బయలుదేరి ఉదయం 11:30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి రాత్రి 9:55 గంటలకు పూరీకి వ‌స్తుంది. అయితే ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలో మీటర్ల దూరాన్ని సుమారు కేవ‌లం 5 గంటల్లోనే చేరుకుంటుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున‌న వందేభారత్ రైలులో ఉండే ఛార్జీలే ఈ కొత్త రైలుకు వర్తింపచేస్తారని వాల్తేరు రైల్వే అధికారులు వెల్లడించారు.

ఏ స్టేషన్ కి ఎప్పుడు వస్తుంది..

పూరీ నుంచి విశాఖకు న‌డిచే వందేభారత్ రైలు ఖుర్దా రోడ్ (ఉదయం 5:33 గంటలకు), బరంపూర్ (ఉదయం 7:05 గంటలకు), ఇచ్ఛాపురం (ఉదయం 7:18 గంటలకు), పలాస (ఉదయం 8:18 గంటలకు), శ్రీకాకుళం రోడ్ (ఉదయం 9:03 గంటలకు), విజయనగరం (ఉదయం 09:48 గంటలకు)స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, విశాఖ నుంచి పూరీ వెళ్లే వందేభారత్ రైలు విశాఖలో మధ్యాహ్నం 03:45 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు విజయనగరం స్టేష‌న్ కు చేరుతుంది. అలాగే సాయంత్రం 5:28 గంటలకు శ్రీకాకుళం రోడ్, 6:30 గంటలకు పలాస, రాత్రి 7 గంటలకు ఇచ్ఛాపురం, 7:20 గంటలకు బరంపూర్, రాత్రి 8:57 గంటలకు ఖుర్దారోడ్, రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ స్టేష‌న్‌ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ రైలు ప్రతీ స్టేషన్ లో ఈ రైలు 2 నిమిషాల పాటు ఆగుతుందని అధికారులు తెలిపారు.

READ MORE  కొత్త‌గా నాగ్ పూర్ - సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..