Saturday, January 24Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Aadhaar free online update | మీ ఆధార్ ఇంకా అప్ డేట్ చేయలేదా.. మీకో గుడ్ న్యూస్..

Aadhaar free online update | మీ ఆధార్ ఇంకా అప్ డేట్ చేయలేదా.. మీకో గుడ్ న్యూస్..

Trending News
Aadhaar card free online update | ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాల‌నుకునే వారికి గుడ్ న్యూస్.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మిలియన్ల కొద్దీ ఆధార్ దారుల‌కు ఊర‌ట క‌లిగిస్తూ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ ఉచిత సేవ కోసం గడువు మొదటగా జూన్ 14, 2024 వ‌ర‌కు విధించ‌గా, ఆ త‌రువాత సెప్టెంబరు 14, 2024 వరకు పొడిగంచింది. ఇక తాజాగా మ‌రోసారి ఎక్స్‌టెండ్ చేస్తూ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి డిసెంబర్ 14, 2024 వరకు తుది గ‌డువు విధించింది.“#UIDAl ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని 14 జూన్ 2025 వరకు పొడిగించింది; లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర‌నుంది. ఈ ఉచిత సేవ #myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. #ఆధార్‌లో తాజా ధ్రవీక‌ర‌ణ పత్రాలను అప్‌డేట్ చేయాల‌ని UIDL ” అని ఒక ట్వీట్‌లో పేర్కొంది. అసలు గడ...
IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ

IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ

Trending News
IRCTC New App news : ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగిస్తుండగా ఇతర రైల్వే సేవల కోసం మ‌రో యాప్ ను వినియోగిస్తున్న‌రు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త యాప్‌లో రైల్వే సేవలన్నీ అందుబాటులో ఉంటాయి.IRCTC New App :ప్ర‌యాణికుల‌కు రైల్వేసేవ‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. రైల్వేశాఖ సరికొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, రైలు టికెట్ బుకింగ్ కోసం ప్ర‌యాణికులు IRCTC యాప్ వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారు. అయితే రైలు ర‌న్నింగ్ స్టాట‌స్ ను తెలుసుకోవ‌డానికి, PNRని తనిఖీ చేయడానికి ప్రత్యేక యాప్‌ని ఉపయోగిస్తున్నా...
IRCTC : తక్కువ ధరలోనే కాశీ, అయోధ్య యాత్ర..

IRCTC : తక్కువ ధరలోనే కాశీ, అయోధ్య యాత్ర..

Trending News
IRCTC MAHA KUMBH PUNYA KSHETRA YATRA | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి "మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర" భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అనే మరో టూరిస్ట్ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లోని ప్రసిద్ధ త్రివేణి సంగమం, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, వారణాసిలోని అన్నపూర్ణా దేవి, శ్రీరామ జన్మ భూమి, అయోధ్యలోని హనుమాన్ గర్హిని కవర్ చేస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు, రైలుతో పాటు రోడ్డు రవాణా, వసతి, క్యాటరింగ్‌లు ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.ఆసక్తిగల ప్రయాణికులు వెబ్‌సైట్: http://www.irctctourism.com ని సందర్శించవచ్చు లేదా 040-27702407/ 9701360701/ 9281495845ను సంప్రదించడం ద్వారా కౌంటర్ బుకింగ్‌లను సంప్రదించవచ్చు.పర్యటన వివరాలు   వ్యవధి : 07 రాత్రులు/08 రోజులు   పర్యటన తేదీ : 19.01.2025   పర్యటన ...
Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Trending News
Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా(Full list of Vande Bharat Express trains )20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్20833 - విశాఖపట్నం సికిం...
SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

Trending News
SCR Special Trains | పెరుగుతున్న ప్ర‌యాణిక‌ల ర‌ద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్ల‌ను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601 డిసెంబర్ 12, 2024, గురువారం రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెం. 07602 డిసెంబర్ 13, 2024 శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విల్లుపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు సర్వీసులు వన్-టైమ్ స్పెషల్‌లుగా షెడ్యూల్ చేసింది. కోచ్ కంపోజిషన్ రైళ్లలో రెండు AC టూ-టైర్ కోచ్‌లు, ఏడు AC త్రీ-టైర్ కోచ్‌లు, పదకొండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్‌ కోచ్ ఉంటుంది.దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రయాణికులు ఈ ప్...
Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..

Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..

Trending News
Delhi Jama Masjid : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సంభాల్‌ (Sambhal)లోని జామా మసీదును హరిహర‌ దేవాలయంగా, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ కోర్టుల‌లో పిటిష‌న్లు వేసిన విష‌యం తెలిసిందే.. అయితే తాజ‌గా హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదుపై కూడా పిటిష‌న్ వేశారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా స్పందిస్తూ.. జామా మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ భారత పురావస్తు శాఖ (ASI) జనరల్‌కు లేఖ రాశారు.జామా మసీదు మెట్లపై కృష్ణుడి ఆలయ విగ్రహాల అవశేషాలు ఉన్నాయని హిందూ సేన‌ పేర్కొంది. ఔరంగజేబ్ నామా, సాకీ ముస్తాక్ ఖాన్ ఔరంగజేబుపై రాసిన 'మసీర్-ఎ-ఆలమ్‌గిరి' పుస్తకంలో తమ రుజువు రాసి ఉంద‌ని తెలిపింది. హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదును సర్వే చేసి, ఆ విగ్రహాలను బయటకు తీసి ఆలయాల్లో తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతోంది. దీంతో ...
మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?

మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?

Trending News
EX CJI DY Chandrachud : మాజీ సీజేఐ డీవై చంద్ర‌చూడ్ పై కాంగ్రెస్ తోపాటు ప‌లు ముస్లిం పార్టీలు కొన్నిరోజులుగా టార్గెట్ చేశాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంభాల్‌లో మ‌సీదును స‌ర్వే చేసిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ దాఖ‌లైన‌ పిటిష‌న్‌ ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ‌రుస ప‌రిణామాల మధ్య భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాయి. మాజీ CJI ప్రతిపక్ష పార్టీల నుంచి దాడికి గురి కావడానికి కారణం, మసీదులలో సర్వేకు ఆయ‌న దారుల‌ను సుగ‌మం చేశారు. మెహబూబా ముఫ్తీ అయినా, కాంగ్రెస్ నాయకుడు రామ్ రమేష్ అయినా అందరూ మాజీ సీజేఐపై విరుచుకుపడడానికి కారణం ఇదే.2023లో జ్ఞాన్‌వాపిలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యంతెలిసిందే..ఈ తీర్పును వెలువరించిన న్యాయ...
Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Trending News
Mumbai-Ahmedabad Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మరియు సబర్మతి. ప్యాసింజర్-సెంట్రిక్ డిజైన్ స్టేషన్లలో ఇంటీరియర్స్, వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. నగర పరిధిలో ఉన్న స్టేషన్లతో స్థానిక రైల్వేలు, బస్సులు, మెట్రో లైన్లు, పార్కింగ్ సౌకర్యాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. ప్ర...
Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..

Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..

Trending News
Kolkatha | బంగ్లాదేశ్‌లోని హిందువుల (Hindu minorities )పై దాడుల‌కు నిర‌స‌న‌గా అలాగే భారత జాతీయ ప‌తాకానికి చేస్తున్న అవ‌మానాల‌కు నిర‌స‌న‌గా ప‌శ్చిమ బెంగాల్ లోని ఓ ఆస్ప‌త్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని ఆసుపత్రి బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం నిరవధికంగా అమలులో ఉంటుందని జెఎన్ రే హాస్పిట‌ల్‌ అధికారి ప్రకటించారు. హాస్పిట‌ల్ ప్రతినిధి సుభ్రాంషు భక్త్ మాట్లాడుతూ, “మేము ఈ రోజు నుంచి బంగ్లాదేశ్ రోగిని చికిత్స కోసం చేర్చుకోమని నోటిఫికేషన్ జారీ చేశాం. ఎందుకంటే వారు భారతదేశం పట్ల అవ‌మానక‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అని తెలిపారు.బంగ్లాదేశ్ వైఖ‌రిని నిరసనగా కోల్‌కతాలోని ఇతర ఆసుపత్రులు కూడా ఇదే వైఖరిని అవలంబించాలని భక్త్ పిలుపునిచ్చారు. " బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం అందించేందుకు భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది , అయ...
Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..

Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..

Trending News
Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌  కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది.ఈ కొత్త టెర్మినల్‌ ప్రారంభమయ్యాక హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్‌ ‌భవనంలో గ్రౌండ్‌ ‌ఫ్లోర్ లో ఆరు టికెట్‌ ‌బుకింగ్‌ ‌కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ...