Friday, January 23Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా

మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా

Trending News
బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు రూ. 3,500 చెల్లించాల్సి వచ్చింది.బీహార్ లోని బక్సర్ లోని ఒక రెస్టారెంట్ లో దోసతో సాంబార్ లేకుండా వడ్డించారు. దానికి బదులుగా సూప్ ను సర్వ్ చేశారు. ఈ స్పెషల్ మసాలా దోస ధర రూ. 140 వసూలు చేశారు. అయితే రెస్టారెంట్ ఇప్పుడు పెనాల్టీగా రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. సాంబార్ చట్నీ దోసెలతో వడ్డించడం ఒక విధమైన ఆచారం. ఒక కస్టమర్ దానిని కోర్టుకు లాగడంతో రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించారు. పిటిషనర్ కు దోసతో సాంబార్ వడ్డించకపోవడం వల్ల కస్టమర్ "మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా" నష్టపోయాడని వినియోగదారుల కోర్టు పేర్కొంది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్ కు 45 రోజుల గడువు ఇచ్చింది. రెస్టారెంట్ జరిమానా చెల్లించకుంటే జరిమానా మొత్త...
వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య

వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య

Trending News
మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలపై మంగళవారం అర్ధరాత్రి అరెస్టు అయిన ప్రవేశ్ శుక్లా(30) నివాసంలో కొంత భాగాన్ని అధికారులు బుధవారం బుడ్డోజర్లతో కూల్చివేశారు. సిద్ధి జిల్లాలో పోలీసు బృందాలు తనిఖీలు చేసి శుక్లాను అరెస్టు చేశాయి. అతని అరెస్టు తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ సాకేత్ మాల్వియా.. శుక్లాపై జాతీయ భద్రతా చట్టం(NSA) కింద కేసు నమోదు చేశారు.NSAని అనుసరించి, బుధవారం బుల్డోజర్లు శుక్లా ఇంటికి చేరుకున్నాయి. ఇల్లు కూల్చివేయొద్దని శుక్లా తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకు విన్నవించినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకోవద్దని కుటుంబ సభ్యులు కోరారు. ఆ వీడియో నకిలీదని, "మమ్మల్ని ట్రాప్ చేయడానికి కుట్ర" జరిగిందని అతని తండ్రి పేర్కొన్నారు. "మా అబ్బాయి అలా చేయలేడు," అని అతను అధికారులకు మొరపెట్టుకున్నాడు. క...
‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

Entertainment, Trending News
‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం.. శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్‍గా మారాయి. సౌత్ ఏషియన్ ఫుల్‍బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్‍షిప్ టోర్నమెంట్ టైటిల్‍ను ఇండియా ఫుల్‍బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్‍లో కువైట్‍పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో రెండు జట్లు సమానంగా నిలవగా... తర్వాత పెనాల్టీ షూ టౌట్ జరిగింది. ఇందులో 5-4తో భారత జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగిం ది. టీమిండియా గెలుపొందగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ‘‘మా తుఝే సలాం’’ అనే పాటను ముక్తకంఠంతో పాడారు. వందేమాతరం అంటూ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్...
ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..

ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..

Trending News
మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది.. సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె "తప్పిపోయిన" బిడ్డ కోసం పోలీసులు వరుసగా మూడు రోజులు వెతికినప్పటికీ, చిన్నారి ఆచూకీ లభించలేదు.పోలీసుల విచారణలో చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో నయన మాండవి కూలీగా పనిచేస్తోంది. తన రెండున్నరేళ్ల కుమారుడు వీర్ మాండవి అదృశ్యంపై ఫిర్యా...
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

National, Trending News
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది.అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని... పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది.రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన సిద్ధప్ప కుప్పకూలిప...