Sunday, March 30Welcome to Vandebhaarath

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం
Telangana

Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం

Telangana BJP president post : తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్ష పదవికి బండి సంజ‌య్ (Bandi Sanjay) పేరు మ‌రోసారి తెర‌పైకి వచ్చింది. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌వి (BJP Telangana president post)లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, జి.కిష‌న్‌రెడ్డి (G Kishan Reddy) ఉండ‌గా సంస్థాగ‌త ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ బండి సంజ‌య్ పోటీ ప‌డుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి (MP and Union minister )గా బండి సంజ‌య్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష పద‌వి (Telangana BJP president post) రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు (ex-MLC Ram Chander Rao) పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.Telangana BJP president post : బండి సంజయే ఎందుకు?తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్షగా ఉన్న బండి సంజ‌య్ ను 2023 అసెంబ్లీ ఎన్నికల (state Assembly elections) ముం...
TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం
Telangana

TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్‌ ‌షాపులలో సన్నబియ్యం పంపిణీ  చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొననున్నారు.కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్‌ ‌షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్‌ ‌షా...
Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు
Telangana

Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు

TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది.హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది.TG Rain Alertనేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది.IMD HyderabadRain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ...
Telangana Budget 2025 – 26 | ₹3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయిపులు ఇవే..
Telangana

Telangana Budget 2025 – 26 | ₹3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయిపులు ఇవే..

Hyderabad : ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹ 3.04 లక్షల కోట్లతో బడ్జెట్‌ (Telangana Budget 2025 - 26) ను ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి మొత్తం ₹ 3,04,965 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు, ఇందులో ₹ 2,26,982 కోట్లు రెవెన్యూ వ్యయం కోసం, ₹ 36,504 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించారు."తెలంగాణను 10 సంవత్సరాలలో 1,000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు" అని అన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పింఛన్ల పంపిణీ వంటి అనేక పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.Telangana Budget 2025 ...
Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు
Telangana

Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు

Begumpet railway station : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (Amrit Bharat Station ) లో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది .ఈ క్రమంలో హైదరాబాద్ లో కీలకమైన బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. రూ.27 కోట్లతో చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్‌ డెవలప్ మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు ...
Malkajgiri : శరవేగంగా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు
Telangana

Malkajgiri : శరవేగంగా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

Amrit Bharat Station Scheme : రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద 'నయ భారత్ నయ స్టేషన్' చొరవలో భాగంగా చేపట్టిన మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ (Malkajgiri railway station) పునరాభివృద్ధికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇప్పటివరకు ప్రతిపాదిత అభివృద్ధి పనులలో దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. అదే సమయంలో, అన్ని పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మల్కాజ్‌గిరి స్టేషన్ పునరాభివృద్ధి కోసం సుమారు రూ. 27.61 కోట్ల నిధులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ (Malkajgiri railway station) లో అభివృద్ధి పనులు పూర్తయ్యాక రైలు ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు . సికింద్రాబాద్ నుండి 3 కి...
Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్..  త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు
Telangana

Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్.. త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు

Telangana news : మ‌హిళా దినోత్స‌వం (Womens Day 2025) సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మ‌హిళ‌ల‌కు కొత్త‌గా గోదాములు, రైస్ మిల్లుల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించేందుకు ప్ర‌యత్నాల‌ను మొద‌లుపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ (Secundrabad) పరేడ్ గ్రౌండ్‌లో శ‌నివారం జ‌రిగిన‌ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌ను మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గించామ‌ని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి (Indira Mahila Shakthi) సమావేశాలకు భ‌వ‌నాలు ఉండాల‌ని నిర్ణ‌యించి ప్ర‌తి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శ‌క్తి సంఘం భ‌వ‌నానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు ఆయ‌న గుర్తుచేశారు.మ‌హిళా సంఘాల‌కు సోలార్ ప్లాంట్లుTelangana news : సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ (Solar power Plants)ను మ‌హిళా సంఘాల()కు అప్...
Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ
Telangana

Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ

Future City | రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 7,257 చదరపు కిలోమీటర్ల (చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉన్న హెచ్‌ఎండీఏ ఇప్పుడు 11 జిల్లాల్లో దాదాపు 10,472.71 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. HMDA నాలుగు వైపులా విస్తరిస్తుంది. ఇప్ప‌టికే మ్యాప్ తయారీలో ఉందని అధికారులు చెబుతున్నారు. "రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని HMDA అధికార పరిధిగా నేరుగా తీసుకోలేం, ఎందుకంటే 36 గ్రామాలను HMDA నుంచి తొలగించి కొత్తగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కింద చేర్చారు" అని HMDA అధికారులు చెబుతున‌న్నారు.Future City : క‌నెక్టివిటీ కోసం రైలు, రోడ్డు మార్గాలునగర శివార్లలోని అనేక గ్రామాలను HMDAతో విలీనం చేయడం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి గ్రేటర్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ కూడా పెరు...
Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
Telangana

Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

Graduate MLC Elections : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా నిర్విరామంగా ఓట్ల లెక్కింపు జరగగా రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు. కాగా ఈవిషయాన్ని కాసేపట్లో అధికారులు అధికారిక ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.Karimnagar Graduate MLC Elections : ఇదిలా ఉండగా కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడంతో ఇప్పిటకే బిజెపి దళం మంచి ఊపుమీద ఉంది. తాజాగా పట్టభ్రదుల కోటాలోనూ కాషాయ పార్టీ గెలు...
Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..
Andhrapradesh, Telangana

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి.ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...