Friday, April 11Welcome to Vandebhaarath

Tag: West Bengal

RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోప‌ణ‌లు | అనాథ మృతదేహాలను వదల్లేదు..
Trending News

RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోప‌ణ‌లు | అనాథ మృతదేహాలను వదల్లేదు..

Kolkatha Rape Murder Case | కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య నేపథ్యంలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్  (RG Kar Hospital ) మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandip Ghosh) పై షాకింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. ఘోష్ హయాంలో అవినీతి, నేర కార్యకలాపాలకు సంబంధించి భయంకరమైన ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సంస్థలో "మాఫియా లాంటి" పాలన కొన‌సాగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.2021లో ప్రిన్సిపాల్‌గా నియమితులైన ఘోష్, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీకి వ‌చ్చే క్లెయిమ్ చేయని మృత దేహాలను అనధికార అవసరాల కోసం అమ్ముకొని సొమ్ముచేసుకున్న‌ట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీ.. ఘోష్ "బయోమెడికల్ వేస్ట్ స్కామ్" నిర్వహించారని, రబ్బరు గ్లోవ్‌లు, సెలైన్ బాటిళ్లు, సిరంజిలు, సూదులు వంటి వ్యర్థాలను అనధికారిక సంస్థలకు విక్రయించేవారని పేర్కొన్నారు. ఈ పద్ధతులు బయో-...
Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..
Elections

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా సాహిబ్(జ‌న‌ర‌ల్ ) పాటలీపుత్ర (జ‌న‌ర‌ల్) అర్రా (జ‌న‌ర‌ల్)బక్సర్ (జ‌న‌ర‌ల్) ససారం (SC) కరకత్ (జ‌న‌ర‌ల్) జహనాబాద్ (జ‌న‌ర‌ల...
PM Modi: సీఏఏ ర‌ద్దు చేయ‌డం ఎవ‌రి వల్లా కాదు.. ప్రధాని మోదీ..  బెంగాల్‌లో ప్రధానికి ఊహించని గిఫ్ట్‌
Elections

PM Modi: సీఏఏ ర‌ద్దు చేయ‌డం ఎవ‌రి వల్లా కాదు.. ప్రధాని మోదీ.. బెంగాల్‌లో ప్రధానికి ఊహించని గిఫ్ట్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సీట్లు వారి యువరాజు వయస్సును మించవు PM Modi On CAA | కోల్ క‌తా : తాను ఉన్నంత వరకు ‘సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్ (CAA ) ’ను రద్దు చేయడం ఎవరివల్లా కాదని ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) పార్టీపై ఆయ‌న‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా సెటైర్‌లు వేశారు. ఈరోజు బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లా బరాక్‌పూర్‌లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్ర‌ధాని ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ వోటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali ) లో తృణ‌మూల్ కాంగ్రెస్ నేతల చేతిలో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలను టీఎంసీ (TMC) గూండాలు బెదిరిస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఒక‌వైపు బాధితులను వేధిస్తూనే మ‌రోవైపు షాజహాన్‌ షేక్ వ...
Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్
National

Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్

Sandeshkhali row : పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali) లో అధికార టీఎంసీ పార్టీని 'ఉగ్రవాద సంస్థ'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసంలో విదేశీ రివాల్వర్‌లతో సహా అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న తరువాత సువేందు అధికారి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రమాద‌క‌ర‌ ఆయుధాలు, పేలుడు పదార్థాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, షేక్ లాంటి ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న ముఖ్య‌మంత్రికి ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే నైతిక అధికారాన్ని కోల్పోయార‌ని అన్నారు.''సందేశ్‌ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాల నుంచి వ‌చ్చిన‌వే.. ఆర్డీఎక్స్ ల...
Sandeshkhali |  సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..
Crime, National

Sandeshkhali | సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..

Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచ‌రుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల,  ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొంద‌రు అనుమానితుల వ‌ద్ద‌ భారీగ...
ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Elections

ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్ర‌భుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.మొదట లెఫ్ట్‌ ఫ్రంట్‌, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్‌ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుత...
Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమ‌లు చేయం: మ‌మ‌తా బెనర్జీ
National

Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమ‌లు చేయం: మ‌మ‌తా బెనర్జీ

Trinamool Congress  Menifesto | తాము ఎన్నిక‌ల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోమ‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)  వెల్లడించారు.  సిల్చ‌ర్‌లో జ‌రిగిన బహిరంగ సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత వంట సిలిండర్లు సహా సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో అత్యంత కీక‌ల‌మైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) రద్దు చేస్తామని, NRC ని నిలిపివేస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది.బీజేపీ మొత్తం దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ఇండియా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే CAA, NRC రద్దు చేస్తుంద‌ని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర ...
Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్..  ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?
Trending News

Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

Underwater Metro Train | పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భార‌త‌దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా సుల‌భ‌త‌రం కానుంది.కోల్ క‌తాలోని ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండ‌ర్ వాట‌ర్ మెట్రో లైన్‌ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి. ...
dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..
Trending News

dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..

Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు.ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చాడని భావించారు. అయితే కవర్ లో దోమలను చూసి ఆయనతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్సూర్ పరిస్థితిని వివరిస్తూ, " నా దుకాణం చుట్టూ మురుగు నీరు నిలిచి ఉంది. అక్కడ విపరీతంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుకాణం వద్ద మాకు తీవ్రమైన దోమలు, విషకీటకాల సమస్య ఉంది అని వివరించాడు. "నన్ను నేను రక్షించుకోవడానికి దోమల సమస్యను పరిష్కరించడానికి, నేను కొన్ని దోమలను పాలిథిన్...