Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Vande Bharat

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

National
New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు:మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...
vande bharat | ఆల్‌స్టోమ్ కంపెనీ రూ.30,000 కోట్ల వందే భారత్ రైళ్ల తయారీ టెండర్‌ రద్దు

vande bharat | ఆల్‌స్టోమ్ కంపెనీ రూ.30,000 కోట్ల వందే భారత్ రైళ్ల తయారీ టెండర్‌ రద్దు

National
Indian Railways | ఊహించ‌ని విధంగా భారతీయ రైల్వే తాజాగా వందేభార‌త్ (vande bharat ) రైల్ కోచ్ ల త‌యారీకి సంబంధించి ఆల్‌స్టోమ్ ఒప్పందాన్ని రద్దు చేసింది. భారతీయ రైల్వే 100 అల్యూమినియం-బాడీ వందే భారత్ రైళ్ల తయారీతోపాటు నిర్వహణ కోసం రూ. 30,000 కోట్ల టెండర్‌ను రద్దు చేసింది. ఈ టెండ‌ర్ ను ఫ్రెంచ్ రోలింగ్ స్టాక్ మేజర్ ఆల్‌స్టోమ్ (Alstom India)జూన్ 2023లో గెలుచుకుంది.సాంప్రదాయ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో పోలిస్తే తక్కువ బరువు ఎక్కువ దృఢ‌త్వం క‌లిగిన‌ అల్యూమినియం-బాడీడ్ రైలు సెట్‌లు త‌యారు చేయాల‌ని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. భారతీయ రైల్వే తన రైళ్ల‌ వేగం, సామర్థ్యం, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ అధునాతన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని భావిస్తోంది. అయితే మొదటి అల్యూమినియం-బాడీ కలిగిన వందే భారత్ రైళ్లు స్లీపర్ కోచ్ లుగా ఉంటాయని, 2025 మొదటి త్రైమాసికం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తో...
Vizag Vande Bharat Express |  విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..

Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..

Telangana
Vizag Vande Bharat Express | హైదరాబాద్‌ : విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది.దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేవి.విశాఖపట్నం-సికింద్రాబద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్  రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ...
Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్

Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్

National
Bengaluru | ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగుళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Bengaluru-Ernakulam Vande Bharat) ఎట్టకేలకు జూలై 31న ప్రారంభం కానుంది. ప‌లు నివేదికల ప్రకారం, ఈ కొత్త రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని చాలా వ‌ర‌కు తగ్గిస్తుంది. కేరళలో ఇది మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్. టైమింగ్స్ ఇవీ.. ఎనిమిది కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది, ఎర్నాకులం నుంచి - బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు వారాల్లో సేవ‌లు అందజేస్తుంది.మరోవైపు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది, గురు, శని, సోమవారాల్లో నడుస్తుంది. రైలు మార్గంలో త్రిస్సూర్, పాలక్కాడ్, పోడన్న...
Vande Bharat | ప్రయాణీకులకు శుభవార్త: భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లు 2 నెలల్లో ట్రాక్‌లోకి..

Vande Bharat | ప్రయాణీకులకు శుభవార్త: భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లు 2 నెలల్లో ట్రాక్‌లోకి..

Trending News
Vande Bharat Sleeper Trains | ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే..  తన ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి నిరంతరం అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది.  ఈ క్రమంలోనే త్వరలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు రెడీ అయ్యాయి. రెండు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి అన్ని సాంకేతిక పనులు తుది దశలో ఉన్నాయని, ఈ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన వసతులను  అందజేస్తాయని వైష్ణవ్ తెలిపారు.  వందే భారత్ స్లీపర్ రైలు సెట్ పూర్తి చేసే పని శరవేగంగా జరుగుతుంది. మొదటి రైలు రెండు నెలల్లో ట్రాక్‌ పైకి వస్తుంది. సాంకేతిక పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. రైలు సెట్‌ను బెంగుళూరులోని దాని రైలు యూనిట్‌లో BEML లిమిటెడ్ తయారు చేసింది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎ...
Vane Bharat Express | వందే భారత్‌ రైళ్ల వేగం త‌గ్గింది…!

Vane Bharat Express | వందే భారత్‌ రైళ్ల వేగం త‌గ్గింది…!

National
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ప్ర‌యాణికుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో భార‌తీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్ల సంఖ్యను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తోంది. తక్కువ టైంలో సుదూర గమ్య‌స్థానాల‌కు వెళ్లడానికి ఎక్కువ మంది ప్ర‌యాణికులు ఈ వందేభార‌త్ రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నాళ్లుగా వందే భారత్‌ రైళ్ల వేగం క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ట్లు తెలిసింది. గ‌త మూడేండ్లలో వందే భారత్‌ రైళ్ల స్పీడ్‌ గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక‌ వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ స‌మాధానం ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్ స‌మాచార హ‌క్కుచ ట్టం కింద‌ దరఖాస్తు చేయ‌గా రైల్వే అధికారులు సమాధానమిచ్చారు.IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరల...
Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు  వందేభారత్ స్లీపర్ రైలు

Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు వందేభారత్ స్లీపర్ రైలు

National
Secunderabad-Pune Vande Bharat | వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవంతంమైన తర్వాత.. ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో  పెట్టుకొని త్వరలోనే వందేభారత్  స్లీపర్ రైళ్లను తీసురావాలని భారతీయ రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే..  ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని భావిస్తుండగా సరికొత్త స్లీపర్ వెర్షన్ ను సికింద్రాబాద్ - పూణే (Secunderabad-Pune Vande Bharat) మధ్య ప్రవేశపెట్టే అవకాశం ఉంది.వందే భారత్ స్లీపర్ రైళ్లు సుదూర ప్రయాణాలను అనుగుణంగా రాత్రివేళ ప్రయాణించేవారి కోసం తీసుకొస్తున్నారు. ఈ కొత్త రైళ్లు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నాయి. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశంలోని స్లీపర్ క్లాస్ రైళ్ల భవిష్యత్తుగా భావిస్తున్నారు. ఇవి అధునాతన భద్రతా వ్యవస్థలు, ప్ర‌యాణికుల‌కు అత్యాధునిక సౌకర్...
VandeBharat Metro | వందే మెట్రో – వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు

VandeBharat Metro | వందే మెట్రో – వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు

Trending News
Vande Bharat Express v/s VandeBharat Metro : భారత్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రవేశంతో  ప్రయాణ సమయం చాలా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించింది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లతో  భారతదేశంలో రైలు ప్రయాణ స్వరూపాన్నే మార్చేసింది. వాస్తవానికి 2019లో  మొదటి వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైళ్లు భారతీయ రైల్వేలకు గేమ్-ఛేంజర్‌గా మారాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం, 82 వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ వందేభారత్ రైళ్ల విజయతో భారతీయ రైల్వేలు ఇప్పుడు కొత్తగా వందే మెట్రో అనే కొత్త కేటగిరీ రైళ్లను పరిచయం చేయడానికి సిద్ధమైంది. వందే మెట్రో రైళ్లు ఏమిటి? Vande Bharat Metro : తక్కువ దూరం గల సిటీలకు మధ్య ప్రయాణాలకు ఉద్దేశించి  వందే మెట్రో ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకొస్తున్నారు. భారతదేశంలో సబర్బన్ ప్రయాణాన్ని మెరుగుపరచడంపై భారతీయ రైల్వే దృష్టి...
Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

National
Vande Bharat Metro | న్యూఢిల్లీ: తక్కువ దూరం గల నగరాల మధ్య వందే మెట్రో అన్ రిజర్వ్ డ్  రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ జూలై 2024లో ప్రారంభం కానుంది. ఈ రైళ్లు దేశంలోని 124 నగరాలను కలుపుతూ 100-250 కి.మీల దూరా మధ్య పరుగులు పెట్టనున్నాయి. లక్నో-కాన్పూర్, ఆగ్రా-మథుర,  తిరుపతి-చెన్నై వంటి ఎంపిక చేసిన నగరాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. రైళ్లు పెద్ద నగారాలు శాటిలైట్గ్ర నగరాల మధ్య ప్రయాణీకుకు రవాణా సౌకర్యం కోసం ఈ వందే భారత్ మెట్రో రైళ్లనుతీసుకువస్తున్నారు.  రైల్వే వర్గాల ప్రకారం, వందే మెట్రో ఒక విలక్షణమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ప్రతీ రైలులో  కనీసం 12 కోచ్‌లు ఉంటాయి. ప్రారంభంలో, కనీసం 12 వందే మెట్రో కోచ్‌లను ప్రవేశపెడతారు, రూట్ డిమాండ్ ఆధారంగా 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అన్ రిజర్వ్ డ్ ప్రయాణికులకు వరం.. నగరాల మధ్య రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం ఈ అత్యాధునిక వందే...
Vande Bharat : మరింత స్పీడ్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు..! ట్రయల్ రన్ కు సిద్ధం..

Vande Bharat : మరింత స్పీడ్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు..! ట్రయల్ రన్ కు సిద్ధం..

National, Trending News
Vande Bharat : దేశంలో అత్యంత పాపులర్ అయిన  వందే భారత్ రైళ్లు మరింత స్పీడ్ తో పరుగులు పెట్టనున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ట్రయిల్స్ నడుస్తున్నాయి. ముందుగా ముంబై - అహ్మదాబాద్ మార్గంలో టాప్ స్పీడ్ తో వందేభారత్ రైళ్లను నడిపించనున్నారు.ప్రస్తుతం వందేభారత్ ప్రీమియం సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే  గంటకు గరిష్టంగా 160 కి.మీ (కి.మీ) వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) ఆమోదం తెలిపింది. ట్రయల్ రన్ విజయవంతమైతే ప్రయాణికుల ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాలు తగ్గుతుంది.రైల్వే సేఫ్టీ కమిషన్..  ఇటీవల ముంబై సెంట్రల్‌లో వడోదర-అహ్మదాబాద్ మార్గంలో ఎగువ,  దిగువ రెండు దిశలలో 16 కోచ్ లు కలిగిన వందే భారత్ రైలు   కన్ఫర్మేటరీ ఓసిల్లోగ్రాఫ్ కార్ రన్ (COCR) నిర్వహించడానికి అనుమతిని ఇచ్చింది. అయితే ఈ ట్రయల్స్...