Thursday, July 31Thank you for visiting

Tag: telangana news

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

Telangana
Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తుచేశారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికికూపంగా మారిం ది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని.. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు... హ...
ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి

ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి

Telangana
Telangana CMO WhatsApp channel :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకునే పనిలో పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వాట్సాప్ చానెల్ (WhatsApp) ను ప్రారభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంవో నుంచి వెలువడే ప్రకటనలను ప్రజలకు చేరవేస్తుంది.ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలు, ముఖ్య సమాచారాన్ని సాధారణ ప్రజలకు వేగంగా చేరేలా చేస్తుంది. CMO ఛానెల్‌ ద్వారా ప్రజలు CMO నుండి తాజా అప్ డేట్స్ ను చూడవచ్చు.CMO వాట్సాప్ ఛానెల్‌ని IT డిపార్ట్‌మెంట్ లోని డిజిటల్ మీడియా విభాగం, ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం (CMPRO) నిర్వహిస్తుంది.  QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ప్రజలు  ఛానెల్‌లో చేరవచ్చు.CMO ఛానెల్‌లో ఇలా  చేరవచ్చు.1. WhatsApp అప్లికేషన్ తెరవండి.2. మొబైల్‌ ఫోన్ వాట్సప...
మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Crime, Local
Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది. మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగ...
ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

Local
Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు.ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు వివరాలను వెల్లడించారు. శనివారం రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు ఆభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్లింది. కాగా బంగారు ఆభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు మహిళ వెంటనే కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్ర రవికి సమాచారం ఇచ్చింది. ఆయన తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్ స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగతా ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ ల...
సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

Telangana
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు (64) గురువారం కన్నుమూశారు. కృష్ణారావుకు 47 ఏళ్ల అపారమైన అనుభవంతో జర్నలిజంలో అమూల్యమైన సేవలందించారు. ఈ రంగంలో ఆయన ప్రయాణం 1975లో ఒక స్టింగర్ గా ప్రారంభమైంది. ప్రతిభ, స్వశక్తితో వేగంగా ఉన్నతస్థానాలకు ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సహా పలు పత్రికల్లో ఆయన తన పనితీరుతో ఆంగ్ల, తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్ లో న్యూస్ బ్యూరో చీఫ్ గా 18 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆత్మీయులందరూ “బాబాయి” అని ముద్దుగా పిలుచుకునే కృష్ణారావు.. చురుకైన ఆలోచనలు ఆయనకు పాత్రికేయ వర్గాల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కాగా విషాదకరంగా, గత ఏడాది క్యాన్సర్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆయన గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు...
తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం..  మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

Crime, Telangana
 తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.  మార్చురీలో భద్రపరిచిన   ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి. వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016వ సంవత్సరంలో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రవి రెండో వివాహం చేసుకోగా వీరికి కుమారుడు జన్మించాడు. అయితేతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రవికుమార్‌ క్రమంగా మద్యాన...
రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

Telangana
52 వంతెనలు ధ్వంసం.. నేలకూలిన  5,557 విద్యుత్ స్తంభాలు పంటనష్టం, పరిహారంపై సోమవారం మంత్రి వర్గ సమావేశంహైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 52 వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వివరాలు పేర్కొన్నారు.వర్షాలు, వరద నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించగా, 16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి తదితర పంటలు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు.30,000 ఎకరాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయని, గ్రామాల్లో 700 కిలోమీటర్లకు పైగా పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, పట్టణాలు, నగరాల్లో 23,000 ఇళ్లు పూర్తిగా లేదా ...
వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

Telangana
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సా...
ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

Telangana
కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరంహైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది. 2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు.రాష్ట్ర జనా...
పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

Telangana
ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే.... వివరాలు ఇవీ.. Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల పిల్లలకు ప్రతి నెలలో నాలుగవ శనివారం నో బ్యాగ్‌ డే అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి కలుగుతుంది. రోజంతా ఆటపాటలు ఉత్సాహంగా గడపనున్నారు. మరోవైపు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలను తప్పనిసరి చేశారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివించడంతోపాటు 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని నిర్ణయించారు. ఇక పదో తరగతి సిలబస...