Friday, April 11Welcome to Vandebhaarath

Tag: Rythu runa Mafi

Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై  బ్యాంక‌ర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు
Telangana

Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై బ్యాంక‌ర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు

Telangana | రైతు రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల‌క (Bhatti Vikramarka) వ్యాఖ్య‌లు చేశారు. రుణాల మాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని అన్నారు. హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని బ్యాంక‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం ఇప్ప‌టి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం వ్యవసాయ రంగం రాష్టాన్రికి వెన్నెముకగా భావిస్తున్న‌ద‌ని తెలిపారు. వ్యవ‌సాయానికి మ‌ద్ద‌తిచ్చేందుకు రుణమాఫీ (Rythu Runamafi ), రైతు భరోసా, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రూ.36వేల కోట్ల విలువైన  ఎంఓయూలు ఉచితంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని, రెండు లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని చెప్పారు. ఇవి వ్యవసాయం అన...
Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌
Telangana

Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌

వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన Rythu runa Mafi | ఖమ్మం : ‌రుణ‌మాఫీ ప‌థ‌కంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ ఆగస్టట్ 15‌లోపు చేస్తామని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15‌లోపు రుణాలు మాఫీ చేస్తామ‌ని తెలిపారు. వైరాలో భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. వైరా నుంచి ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేస్తామన్నారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి చాలెంజ్‌ ‌చేశారని.... కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ సోదరులు మంచి సందేశం ఇచ్చేలా సభ జరుపు...
Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం
Telangana

Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం

Rythu Runa Mafi | తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను ప్ర‌భుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ప్ర‌త్యేక‌ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడారు ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాత‌ బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని సీఎం వెల్ల‌డించారు.రుణమాఫీ (Runa Mafi) నిధులు రైతుల ఖాతాల్లోకి బ‌దులుగా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపట్టినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవే...
Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..
Telangana

Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..

Rythu Runa Mafi | గ‌త ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమ‌లు చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కాగా రుణమాఫీకి సంబంధించి ప్ర‌క్రియను ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ప్రారంభించింది. ఢిల్లీలో శుక్ర‌వారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామ‌ని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ ‌కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదని అన్నారు. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ చేయబోమ‌ని తేల్చి చెప్పారు. కేవ‌లం ప‌ట్టా పాస్‌ ‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ (Rythu Runa Mafi) ఉంటుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై ఆస‌క్తిక‌...
Rythu runa Mafi | రైతుల‌కు శుభ‌వార్త‌.. రుణ మాఫీపై డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు..
Telangana

Rythu runa Mafi | రైతుల‌కు శుభ‌వార్త‌.. రుణ మాఫీపై డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు..

Rythu runa Mafi | రుణ మాఫీ కోసం ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌కు రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. దీంతో విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. అయితే ఇటీవ‌ల లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ‌స్టు 15 లోపు రుణ‌మాఫీ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా ఉప‌ముఖ్య‌మ‌త్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti Vikramarka ) రుణ‌మాఫీ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా రూ 2 లక్షల రైతు రుణమాఫీ (Rythu runa Mafi )  ఆగస్టు నెలకు ముందే అమలు చేసి తీరుతామని ఈ ప‌థ‌కాన్ని ఎవరూ అడ్డుకోలేర‌ని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా అమ‌లుపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని రైతు భ‌రోసా ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి? అన్నది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామ‌ని, విధివిధానాల...