Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Nitin Gadkari

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు
Andhrapradesh, Telangana

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ - విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు.భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ...
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ఎదుట రాష్ట్ర ర‌హ‌దారుల ప్రతిపాదనలు ఇవే.. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి
Telangana

కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ఎదుట రాష్ట్ర ర‌హ‌దారుల ప్రతిపాదనలు ఇవే.. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

New National Highways | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మాకాం వేసి వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి ప్ర‌తిపాద‌న‌ల‌ గురించి ఆయా శాఖ‌ల మంత్రుల‌తో సీఎం చ‌ర్చిస్తున్నారు. ఈమేర‌కు బుధ‌వారం కేంద్ర ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిశారు. ఈసంద‌ర్భంగా తెలంగాణ‌లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను కేంద్ర మంత్రికి ముందుంచారు.రీజిన‌ల్ రింగు రోడ్డు ( RRR) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు లైన్ల ర‌హ‌దారిగా విస్త‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గ‌జ్వేల్‌-జ‌గ‌దేవ్‌పూర్‌-భువ‌న‌గిరి-చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జా...
Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో  తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..
Telangana

Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..

Telangana Road ways |  మోదీ 3.0 ప్రభుత్వంలో  మొదటి 100 రోజుల ప్రణాళికలో తెలంగాణకు రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి రెండు రహదారులకు అవకాశం కల్పించారు. అందులో ఆర్మూరు – జగిత్యాల – మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రోడ్డు.. జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరుసల హైవే నిర్మించాలని  నిర్ణయించారు. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563 లకు మహర్దశ వచ్చినట్లైంది. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిజామాబాద్ - ఛత్తీస్ గడ్ హైవే.. నిజామాబాద్‌–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్‌ మధ్య ఉన్న నేషనల్ హైవే 63ను విస్తరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా పెద్ద పట్టణాలు, గ్రామాలు ఉ...
ORR Hyderabad |  ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో  ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..
Telangana

ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో చర్చించామన్నారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ట్రాఫిక్‌ కష్టాలనువ్వు తొలగించేందుకు  రాష్ట్రంలో మరిన్ని రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేగా NH-65కి సంబంధించి, మేము బ్లాక్ స్పాట్‌లకు సంబంధించిన పనులను ప్రారంభించాము, రోడ్లు అధ్వ...
Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..
National

Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..

Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్​ ఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​) ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆగస్టు 22న మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్​.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబరు నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా.. దేశీయంగా కార్​ క్రాష్​ టెస్ట్​ ప్రోగ్రామ్​ కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్​, దక్షిణ కొరియాలో ఈ పరీక్షలు చేస్తున్నారు. వాహన వినియోగదారుల భద్రతే లక్ష్యం దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా మోడళ్ల కార్లు​ రోడ్డుపై తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అడుగుపెడతాయి. అయితే.. భద్రతా పరంగా ఏ వాహనాన్ని ఎంచుకోవాలనే దానిపై సందేహిస్తున్న కస్టమర్లకు.. ఈ భారత్​ ఎన్​సీఏపీ...
రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు
National

రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు

 న్యూఢిల్లీ: రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను (road accidents ) తగ్గించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లపై "బ్లాక్ స్పాట్స్" తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు . ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు అమూల్యమైనవని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే ఉంటున్నారు.. ప్రమాదాల కారణంగా గాయపడినవారు వారి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతున్నారు." అని గడ్కరీ అన్నారు.అధికారిక లెక్కల ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.54...