Friday, February 13"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Mallu Bhatti Vikramarka

LRS in Telangana | ఎల్ఆర్ఎస్‌పై కీలక అప్ డేట్..  మూడు నెలల్లోనే పరిష్కారం.. తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం

LRS in Telangana | ఎల్ఆర్ఎస్‌పై కీలక అప్ డేట్.. మూడు నెలల్లోనే పరిష్కారం.. తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం

Telangana
LRS in Telangana : రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ ‌రెగ్యులరైజేషన్‌ ‌స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్ర‌క్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరించాల‌ని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. త‌మ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజ‌లకు ఇబ్బందులు లేకుండా స‌త్వ‌ర‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు.. శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అక్కడి కలెక్టరేట్‌ ‌నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ...
Ration Card | తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇదే..

Ration Card | తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇదే..

Telangana
Ration Card Application | తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న‌ రేషన్ కార్డులు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ త్వ‌ర‌లో షురూకానుంది. రేష‌న్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇక‌పై వేర్వేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు ఉండదని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను రేష‌న్ కార్డు ప్రామాణికం కాద‌ని కూడా చెప్పారు. ఇక నుంచి తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా కోసం మాత్రమేనని, ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ప్రైవేట్ హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన అసెంబ్లీలో వెల్ల‌డించారు. మ‌రోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కొత్త రేష‌న్ కార్డు కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో ఇక్క‌డ చూద్దాం.. కొత్త రేషన్ కార్డు...
Indiramma Housing Scheme | ఇండ్లు లేని పేద‌ల‌కు శుభ‌వార్త‌.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌ల సాయం..

Indiramma Housing Scheme | ఇండ్లు లేని పేద‌ల‌కు శుభ‌వార్త‌.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌ల సాయం..

Telangana
Telangana Budget |  తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. నిరుపేదలకు గూడు సమకూర్చడమే త‌మ‌ ప్రభుత్వ కర్తవ్యమని బ‌డ్జెట్ స‌మావేశంలో ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల‌ పేరుతో పేదల‌ను ముంచింద‌ని విమ‌ర్శించారు. నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి.. ఇళ్లు కేటాయించలేద‌ని ఆరోపించారు. అయితే పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రారంభించామని చెప్పారు. పేద ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 50 వేల గృహాల నిర్మించాల‌ని ప్రభుత్వం లక్ష్యంగ...
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరు?  రూ.5 లక్షలు.. ఎలా మంజూరు చేస్తారు.. ?

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరు? రూ.5 లక్షలు.. ఎలా మంజూరు చేస్తారు.. ?

Telangana
Indiramma Housing Scheme | నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే 'ఇందిరమ్మ ఇళ్ల' పథకానికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. గతంలో ప్రజాపాలన (Praja Palana) లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయనున్నారు.ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ దశల వారీగా ఈ పథకం వర్తింపజేయనున్నారు. స్థలం ఉండి ఇల్లు లేనవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే స్థలం కూడా లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి వివిధ రకాల ఇంటి మోడల్ డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. ఈ మోడల్ లో తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్‌ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ మోడల్ ను తీర్చిదిద్దారు. మొదటి విడతలతో అన్ని 90 వేలకు పైగా లబ్ధిదారులను గుర్తించ...