Friday, February 13"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: IRCTC

త్వరలో రైల్వే సూపర్ యాప్‌.. టిక్కెట్ల బుకింగ్స్ తో స‌హా అన్ని అందులోనే..

త్వరలో రైల్వే సూపర్ యాప్‌.. టిక్కెట్ల బుకింగ్స్ తో స‌హా అన్ని అందులోనే..

National
Indian Railways New super app | రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. భారతీయ రైల్వే డిసెంబర్ 2024 చివరి నాటికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ యాప్‌లలో ఒకదానిని ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుత IRCTC ప్లాట్‌ఫారమ్‌కు భిన్నమైన కొత్త యాప్.. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా చేయడానికి ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అనేక‌ సేవలను అందించ‌నుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికుల‌కు ఎంతో ల‌బ్ధి చేకూర‌నుంది.సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్, ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి అనేక రైల్వే సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందిస్తుంది. కొత్త సూపర్ యాప్ రైల్వే-లింక్డ్ సేవలతో వ్యవహరించే అనేక మొబైల్ యాప్‌ల సమ్మేళనం.కొత్త యాప్ ప్రయాణికులు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను బుక్ చేయడం, రైలు స్టేట‌స్ ను తనిఖీ చేయడం వంటి అనేక సేవలను అందిస్తుంది. కొత్త యాప్ ద్వ...
Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు

Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు

National
IRCTC టూర్ ప్యాకేజీ | శబరిమల యాత్ర కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ ఆండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్తగా భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటక కేంద్రాలు,  పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కోసం నడిపిస్తున్న భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైళ్లకు యాత్రికుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో కొత్తగా మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. తాజాగా సికింద్రాబాద్‌ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన  కరపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో హాల్లింగ్ స్టేషన్లు ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్,నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, న...
Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?

Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?

Trending News
Indian Railways | భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల (Senior Citizens )కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు లోయర్ బెర్త్‌లకు అర్హులు. అలాగే కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌ను పొందే అవకాశాలను పొందవచ్చు.సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా ఈ సౌకర్యాలను పొందవచ్చు, ఫలితంగా వారు సాఫీగా గమ్యస్థానాలను చేరవచ్చు. అయితే, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా గరిష్టంగా ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తున్నట్లయితే, లోయర్ బెర్త్ ప్రాధాన్యత హామీ ఉండదు. సీనియర్ సిటిజన్‌కు ఎగువ లేదా మధ్య బెర్త్ కేటాయిస్తే, టిక్కెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణ సమయంలో అందుబాటులోకి వస్తే వారిని దిగువ బెర్త్‌కు ...
How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచ‌ర్‌.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..

How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచ‌ర్‌.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..

Trending News
How To Book Current Ticket : దీపావళి పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రజలు చేసే అతి ముఖ్యమైన పని, తమ ఇళ్లలో తేవి తమ బంధువుల‌తో కలిసి పండుగలను ఆస్వాదించాలనే ఆశతో రైలు టిక్కెట్ బుకింగ్ చేసుకోవ‌డం.. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది క‌న్ఫార్మ్‌ రైలు టిక్కెట్‌ను దొర‌క‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అనేక మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పటిక‌ప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతుంటాయి. ఇక హైదరాబాద్ నుంచి, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం చెన్నై మార్గాల్లో ప్రయాణించే రైళ్ల పరిస్థితి అత్యంత‌ దారుణంగా ఉంటుంది. తత్కాల్‌లో సీటు వస్తుందో రాదో న‌మ్మ‌కంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితిలో ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇదే కరెంట్ టికెట్ ఆప్ష‌న్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయమేమిటంటే రైలు రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత మీరు కరెంట్ టిక్కెట్‌ను బుక్ చేసుకుని ప్రయాణించవచ్...
Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

National
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ - ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు. కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు..ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) బోర్డింగ్ / డీ-బో...
IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..

IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..

Trending News
IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాగే ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 'దివ్య దక్షిణ యాత్ర' టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తిరువణ్ణామలై ( అరుణాచలం) - రామేశ్వరం - తిరువనంతపురం - కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL కోచ్ లతో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంది. తొమ్మిది రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250 గా నిర్ణయించింది. .దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, తిరువనంతపురం (త్రివేండ్రం) వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3A...
IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు 

IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు 

National
IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్‌లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జ‌రిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల‌ సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల కోసం ఉత్తర రైల్వే రైలు నెం 04465/66 (ఢిల్లీ-షామ్లీ-ఢిల్లీ), 04403/04 (ఢిల్లీ-సహారన్‌పూర్-ఢిల్లీ) రైళ్ల‌ను హరిద్వార్ వరకు పొడిగించింది. అలాగే మేళా కోసం ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.కన్వర్ మేళా కోసం హరిద్వార్‌కు ప్రత్యేక రైళ్లురైలు నెం. 04322 (మొరాదాబాద్-లక్సర్-మొరాదాబాద్) రైలు నెం. 04324 (హరిద్వార్-ఢిల్లీ-హరిద్వార్) రైలునెం. 04330 (రిషికేశ్-ఢిల్లీ-రిషికేశ్) రైలు నెం. 04372 (రిషికేశ్-లక్నో చార్‌బాగ్-రిషికేశ్) రైలు నెం. 04370 (రిషికేశ్-బరేలీ-రిషికేశ్)మేళా సందర్భంగా, ఉత్తర రైల్వే 14 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తోంద‌ని, ఎక్కువ మంది ప్ర‌యాణించేందుకు వీలుగా 24 రైళ్లకు అద...
IRCTC |  మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్

IRCTC | మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్

Trending News
IRCTC Ticket Booking Rules | మీ స్నేహితులకో, మీకు తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్‌సీటీసీ ఐడీతో ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్షతోపాటు , భారీ జరిమానా విధించే ప్ర‌మాదం ఉంది. రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.మీరు మంచి ఉద్దేశంతో ఇత‌రులకు టికెట్‌ బుకింగ్ కోసం మీ వ్యక్తిగత IDని ఉపయోగించడం ఇక‌పై నేరంగా పరిగణించనున్నారు. చట్టపరమైన శిక్ష‌ల‌ను ఎదుర్కోకుండా ఉండటానికి తాజా నిబంధ‌న‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం, అధికారికంగా నియమించబడిన ఏజెంట్లకు మాత్రమే థ‌ర్డ్‌ పార్టీల కోసం బుకింగ్‌లు చేయడానికి అధికారం ఉంటుంది. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించవ‌చ్చు. ఇతరులకు IRCTC టికెట్ బుకింగ్‌పై పరిమితులు క...
South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో మ‌రో 12 రైల్వేస్టేష‌న్ల‌లో త‌క్కువ ధ‌ర‌లో ఎకానమీ మీల్స్..

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో మ‌రో 12 రైల్వేస్టేష‌న్ల‌లో త‌క్కువ ధ‌ర‌లో ఎకానమీ మీల్స్..

Trending News
South Central Railway Economy Meals | రైలు ప్రయాణీకులకు సరసమైన, నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్నిఅందించేందుకు భార‌తీయ రైల్వే శాఖ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ భోజనాలు ప్లాట్‌ఫారమ్‌లపై సాధారణ కోచ్‌ల వ‌ద్ద అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులకు త‌క్కువ ధ‌ర‌లోనే నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించడానికి భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో కలిసి "ఎకానమీ మీల్స్ ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి త‌క్కువ‌ ధరలో రెండు రకాల భోజనాలు అందిస్తోంది. ఈ భోజన కౌంటర్లు ఇప్పుడు భారతీయ రైల్వేలలో 100కి పైగా స్టేషన్లలో దాదాపు 150 కౌంటర్లలో పనిచేస్తున్నాయి. కొత్త‌గా చేర్చిన స్టేష‌న్లు ఇవే.. దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలో కొత్తగా 12 స్టేషన్లలో ఎకాన‌మీ మీల్స్‌ అందించడం ప్రార...
Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.

Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.

Trending News
Train Ticket Booking | ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. కానీ రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు, మీరు కావాలనుకున్న లేదా ఎంపిక చేసుకున్న సీటును మీరు పొందగలరా?  ఈ సమస్యకు IRCTC అతి త్వరలో పరిష్కారం చూపుతుంది. ఇప్పుడు, సినిమా హాళ్లు లేదా విమానాల మాదిరిగా, మీరు రైలులో కూడా మీకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు.మీకు నచ్చిన సీటును మీరు ఎంచుకోవచ్చు:ఈ విషయం గురించి రైల్వే అధికారి మాట్లాడుతూ సినిమా టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీకు నచ్చిన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చని, అదేవిధంగా, రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు, మీరు పైభాగంలో లేదా మధ్య, దిగువ సీటును బుక్ చేసుకోగలుగుతారు. దీనికి అవసరమైన అన్ని వ్యవస్థలను IRCTC దాదాపుగా సిద్ధం చేసిందని ఆయన చెప్పారు.సీట్లు ఎలా బుక్ చేయబడతాయి: IRCTCలో నేరుగా బుక్ చేస్తున్నప్పుడు, మీకు ఖాళీగా ఉన్న అన్ని సీట్ల జాబితా డిస్ప్లే చేస్తుంది. అటువంటి ...