Thursday, April 10Welcome to Vandebhaarath

Tag: Crime news

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు
Crime, Local

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది. మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగ...
పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు
Crime, Local

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర...
లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్  విద్యార్థి
Crime

లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్ విద్యార్థి

Bengaluru: తుమకూరులో లెక్చరర్ వద్ద కొడవలి పట్టిన విద్యార్థిపై కేసు నమోదైంది.  విద్యాబుద్ధులు చెప్పే గురువునే ఓ మైనర్ విద్యార్థి కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఆగస్టు 23న తుమకూరు జిల్లాలో ఒక లెక్చరర్ ను కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించినందుకు డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరులోని కుణిగల్ తాలూకాలోని బాలగంగాధరనాథ నగారాలోని డిప్లొమా కాలేజీలో ఈ ఘటన జరిగింది. సదరు విద్యార్థి క్లాస్ కు రాకపోవడంత లెక్చరర్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆగస్టు 23న కొడవలితో కాలేజీకి వెళ్లి తనపై ఫిర్యాదు చేసినందుకు లెక్చరర్‌ను బెదిరించాడు. ఈ ఘటనపై లెక్చరర్ పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించగా బెల్లూరు పోలీసులు ఘటన...
పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి
Crime

పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి

ఇలాంటి కీచకులనేంచేయాలి?మధ్యప్రదేశ్‌లో అత్యాచారం కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డాడు. సాత్నాలో 5 ఏళ్ల దళిత బాలికపై నిందితులు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 10 సంవత్సరాల కారాగార శిక్ష నిందితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.. ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చి మరో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధితురాలు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. కొంత దూరంలో రక్తసిక్తమైన స్థితిలో బాలిక నిపించింది. ఏం జరిగింది నిందితుడు రాకేష్ వర్మ అలియాస్ రక్కు ఆమెకు మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టాడు. బాలి...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి
Crime

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి

Warangal: వరంగల్‌ జిల్లాలో బుధవారం  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వరంగల్‌ నుంచి ఆటో తొర్రూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.. అస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన జరిగిన యాక్సిడెంట్ జరిగిన చోటుకు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తేనె విక్రయించే కూలీలని  తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చే...
బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..
National

బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..

ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను  క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల  సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో...
ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..
Trending News

ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..

న్యూఢిల్లీలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి దర్జాగా తిరిగాడు.. తీరా అతడు చేసిన ట్రావెల్ వీడియోలతో సులభంగా పోలీసులకు చిక్కాడు.బిందాపూర్‌కు చెందిన సంజీవ్ (29) జూలై 11న న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత, అతని ట్రావెల్ వ్లాగ్‌ల ద్వారా పోలీసులు అతడు ఉన్న చోటును ట్రాక్ చేశారు. ఆగ్రాలో ఉండగా దొంగను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. అంతకుముందు తన ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఇంటి యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.విచారణలో భాగంగా పోలీసులు సమీపంలోని ప్రదేశాలలోని సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు .. నిందితుడు సంజీవ్ చోరీ చేసిన ఇంటి నుండి బయటకు వెళ్లడం కనిపించింది. అతడి చివరి ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికి అతను తన మొబైల్ ...
ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్
Crime

ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్

ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది. ఈ హృదయవిదారక ఘటన ఘజియాబాద్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) ఇందిరాపురం స్వతంత్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు. కాగా తన సూసైడ్ నోట్‌లో బాలిక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అయితే "నా సోదరుడు డ్రగ్స్ మానేయడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని రాసి ఉంది. బాధితురాలి అన్నయ్య పోక్సో చట్టం కింద జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. గురువారం ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టిందని, గది లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థల...
ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..
Trending News

ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..

మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది.. సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె "తప్పిపోయిన" బిడ్డ కోసం పోలీసులు వరుసగా మూడు రోజులు వెతికినప్పటికీ, చిన్నారి ఆచూకీ లభించలేదు.పోలీసుల విచారణలో చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో నయన మాండవి కూలీగా పనిచేస్తోంది. తన రెండున్నరేళ్ల కుమారుడు వీర్ మాండవి అదృశ్యంపై ఫిర్యా...