Friday, January 23Thank you for visiting

Special Stories

Special stories and Exclusive stories

Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు

Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు

Special Stories
Independence Day 2024 | భారతదేశపు అతిపెద్ద జాతీయ పండుగ - స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. ప‌ల్లెల నుంచి మ‌హా నగరాల వరకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌లంద‌రూ ఆగస్ట్ 15 న జరగబోయే స్వ‌తంత్ర దినోత్స‌వ సన్నాహాల్లో మునిగిపోయారు. దేశభక్తితో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొద‌లైంది. తెల్ల‌దొర‌ల నుంచి దేశాన్ని ర‌క్షించేందుకు స్వాతంత్ర్య  దినోత్సవం సమరయోధులు, నాయకులు చేసిన అమూల్య‌మైన‌ త్యాగాలను గుర్తుచేసుకునే సమయం ఇది.దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగ, 'తిరంగ యాత్ర' వంటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంతో అంత‌టా సందడిగా మారింది. జూలై 28న తన నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసారంలో, ప్ర‌ధాని మోదీ హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి మాట్లాడారు. harghart...
Railway News | పర్వతాల మధ్య రైలు కూతలు..  ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ త్వరలో ప్రారంభం..

Railway News | పర్వతాల మధ్య రైలు కూతలు.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ త్వరలో ప్రారంభం..

Special Stories
Udhampur-Srinagar-Baramulla Rail | అత్యంత సుంద‌ర‌మైన క‌శ్మీర్ ప్రాంతంలో మొట్ట‌మొద‌టిసారి రైలు కూత‌లు వినిపించ‌నున్నాయి. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకోవడంతో కాశ్మీర్ లోయ ప్ర‌యాణికుల సుదీర్ఘ‌మైన చిర‌కాల స్వ‌ప్నం నెర‌వేరే క్ష‌ణాలు ఆస‌న్న‌మ‌వుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 3694 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు దాదాపు సిద్ధంగా ఉందని తెలిపారు.ఇటీవ‌ల విలేకరుల సమావేశంలో కేంద్ర‌ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ దాదాపు పూర్తవుతుందని, కత్రా - రియాసి మధ్య 17 కిలోమీటర్ల T-1 సొరంగం విభాగం మాత్రమే పెండింగ్‌లో ఉందని తె...
Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?

Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?

Special Stories
Kanwar Yatra Rules 2024 | ఎంతో భక్తిశ్రద్ధలతో శివభక్తులు నిర్వహించే  'కన్వర్ యాత్ర'కు అంతా సిద్ధమైంది. జూలై 22 నుంచి ఆగస్టు 2వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ  క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..  శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'కన్వర్ యాత్ర' మార్గాల్లో ఉన్న అన్ని తినుబండారాల షాపుల‌కు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ అన్ని టీ స్టాళ్లు, ధాబాలు, తోపుడు బండ్లకు కూడా వర్తించ‌నుంది. అయితే కన్వర్ యాత్రికుల పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర‌క‌టించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది మంది శివ భక్తులు తమ స్థానిక దేవాలయాలలో సమర్పించడానికి ప‌విత్ర‌ గంగాజలాన్ని సేకరించేందుకు కుండలను మోసుకుంటూ కాలినడకన నడుస్తారు. ఈ స‌మయంలో వారు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉంటారు. అలాగే ఆహారంలో ఉల్లిపా...
Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి

Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి

National, Special Stories
Zika virus | వ‌ర్షాకాలం మొద‌లు కాగానే దోమ‌లు విజృంభిస్తున్నాయి. డెంగీ, మ‌లేరియా వంటి విష‌జ్వ‌రాలు వ్యాపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జికా వైర‌స్ కేసులు భార‌త్ లో న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వైర‌స్‌ కేసులు మహారాష్ట్రలో ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీల‌క సూచ‌న‌లు జారీ చేసింది. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విష‌జ్వ‌రాల‌పై నిరంతర నిఘా ఉంచాల‌ని చెప్పింది. గర్భిణీ స్త్రీలపై దృష్టి పెట్టాల‌ని, జికా వైరస్ సోకిన గర్భిణుల పిండం ఎదుగుదలను నిశితంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. జికా వైరస్ అంటే ఏమిటి? 1947లో ఉగాండాలో మొట్టమొదట జికా వైరస్ ను కనుగొన్నారు.  ఏడెస్ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.  ఈ ప్రాణాంతక వైరస్ పేరు ఉగాండాలోని జియాకా అడవి నుంచి వచ్చింది. ఇక్కడే దీన్ని గుర్తించారు. ఇది చికున్‌గున్యా,...
Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Special Stories
Nalanda New Campus | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం ఉదయం నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 దేశాల రాయబారులు పాల్గొన్నారు. నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మొక్కను నాటారు. ప్రధాని మోదీ . పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా పరిశీలించారు.అంతకుముందు X లో PM Modi తన అభిప్రాయాలను పంచుకున్నారు.  "ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు, రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభమవుతుంది. నలందకు ఈ అద్భుతమైన భాగంతో బలమైన అనుబంధం ఉంది. కొత్త క్యాంపస్ లో ఏమున్నాయి? క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించబడింది.  ఒక్కో బ్లాక్ లో 40 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900. ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసి...
Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Special Stories
Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న న‌లంద యూనివ‌ర్సిటీలో కొత్త క్యాంప‌స్‌ను ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ (PM Modi) ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ .. యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డమైన‌ న‌లంద మ‌హావీర‌ను సంద‌ర్శించారు.నలంద విశ్వ‌విద్యాలయానికి సంబంధించిన‌ పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంప‌స్‌ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ పురాతన విశ్వ‌విద్యాల‌యాన్ని 427 CEలో కుమారగుప్త చక్రవర్తి స్థాపించాడు. ఎనిమిది శతాబ్దాలకుపైగా నలంద విజ్ఞాన దీవిగా వర్ధిల్లింది. ఎంతో అనుభ‌వ‌జ్ఞ‌లైన వేద‌పండితులు ఇక్క‌డ బోధించేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి సుదూర ప్రాంతాల నుండి 2,000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఈ విద్...
kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?

kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?

Special Stories
kavach technology | ఒకే లైన్‌లో ఒకే సమయంలో రెండు రైళ్లు ప్రయాణిస్తే ఒక‌దానికొక‌టి ఢీకొన‌కుండా ఉండేందుకు పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థనే ఈ కవాచ్.. అయితే ఈరోజు ప‌శ్చిమ బెంగ‌ల్ డార్జిలింగ్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ట్రాక్‌లపై ఈ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ అందుబాటులో లేదు. కోల్‌కతాకు వెళ్లే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే గ‌తంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కవాచ్ సిస్టమ్‌ గురించి వివరిస్తున్న పాత వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. ఈ వ్యవస్థను ఇంకా చాలా రైలు నెట్‌వర్క్‌లో ఇన్‌స్టాల్ చేయలేదని అధికారులు తెలిపారు.వచ్చే ఏడాది నాటికి 6,000 కి.మీ ట్రాక్‌లను కవర్ చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ-గౌహతి మార్గంలో భద్రతా వ్యవస్థను అమలు చేయాలని భార‌తీయ‌ రైల్వే యోచిస్తోంది. బెంగాల్ ఈ ఏడాది కవ...
Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Special Stories
Jammu And Kashmir :  2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయి పోలింగ్.. జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది.అయితే మిగతా మూడు స్థానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024...
New license rules | డ్రైవింగ్ లైసెన్స్ జారీలో విప్ల‌వాత్మ‌క మార్పులు.. జరిమానాలు, చార్జీలు ఇవీ..

New license rules | డ్రైవింగ్ లైసెన్స్ జారీలో విప్ల‌వాత్మ‌క మార్పులు.. జరిమానాలు, చార్జీలు ఇవీ..

Special Stories
New license rules  | రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేసే ప్ర‌క్రియ‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇది జూన్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్సింగ్ ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డం, కాలుష్యాన్ని నివారించ‌డం, ర‌హ‌దారి భ‌ద్ర‌త‌ను మెరుగుప‌ర‌చాల‌నే ల‌క్ష్యంతోనే ఈ కొత్త నిబంధ‌న‌లను కేంద్రం తీసుకువ‌స్తోంది.జూన్ 1 నుండి వాహ‌న‌దారులు తమ డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ RTO లకు బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల నుంచి తీసుకోవచ్చు. ఈ ప్రైవేట్ సంస్థలు లైసెన్స్ అర్హత కోసం పరీక్షలు నిర్వహించడానికి, సర్టిఫికెట్‌లను జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. దీని వ‌ల్ల లైసెన్సుల ప్ర‌క్రియ సుల‌భంగా. వేగ‌వంతంగా జ‌రుగుతుంది. ప్రభుత్వ RTOల వద్ద గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండే ఇబ్బందుల‌ను కూడా త‌ప్పుతాయి. భారీగా జరిమానాలు..! జరిమానాలు రూ. 1000 రూ. 2000 మ...
Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..

Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..

Special Stories
Arogya Maitri Cube | ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్-లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్ భారత్ లో అందుబాటులోకి వచ్చింది.  ఆరోగ్య మైత్రి క్యూబ్‌ పేరుతో పిలిచే డిజాస్టర్ హాస్పిటల్ మే 14న ఆగ్రాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ రన్ చేసింది. విపత్తుల సమయంలో అత్యవసరంగా వైద్య సహాయం అందించేందుకు  ప్రాజెక్ట్ భీష్మ్ (project BHISHM) కింద ఆరోగ్య మైత్రి క్యూబ్స్ ను రూపొందించారు.  ఎయిర్ బెలున్ లా ఉండే ప్రత్యేక నిర్మాణంలో అత్యవసరంగా ఉపయోగపడే వైద్యపరికరాల కిట్  ఉంటుంది.  ఎప్పుడైనా ఎక్కడైనా సులువుగా రవాణా చేయడానికి అనువుగా ఉంటుంది.ఎయిడ్ క్యూబ్ అత్యవసర సమయాల్లో వైద్య సహాయాన్ని అందించే అనేక వినూత్న సాధనాలను కలిగి ఉంది. ఇది సమర్థవంతమైన సమన్వయం, రియల్ టైం మానిటరింగ్,  వైద్య సేవల సమర్థవంతమైన నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సు (AI),  డేటా విశ్లేషణలు వంటివి కూడా చేయవచ్చు.కేంద్ర ప్రభుత్వం తొలిసారి 2022 ఫిబ్రవరి లో ప్రాజెక్ట...