Friday, January 23Thank you for visiting

Special Stories

Special stories and Exclusive stories

Somnath Temple | వెయ్యేళ్ల వీరత్వానికి గుర్తుగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’

Somnath Temple | వెయ్యేళ్ల వీరత్వానికి గుర్తుగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’

Special Stories
Somnath Swabhimaan Parv 2026 | న్యూఢిల్లీ : భారతీయ నాగ‌రిక‌త‌, సాంస్కృతిక వార‌స‌త్వ స్ఫూర్తికి సోమనాథ్ ఆలయం (Somnath Temple) ఒక సజీవ సాక్ష్యం. క్రీ.శ. 1026లో గజినీ మహమూద్ చేసిన మొదటి భారీ దాడి నుంచి 2026 నాటికి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' (1026–2026) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. సోమనాథ్ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారతదేశం యొక్క ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.జ్యోతిర్లింగాలలో ప్రథమం:గుజరాత్ తీరంలోని ప్రభాస్ పటాన్ వద్ద వెలసిన సోమనాథ్ స్వామి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటివారు. ఋగ్వేదం, స్కందపురాణం, శివపురాణం వంటి పురాతన గ్రంథాలలో ఈ క్షేత్రానికి సంబంధించిన అనేక ప్రాముఖ్య‌త‌లు ప్ర‌స్తావించ‌బ‌డి ఉంది. హిరణ్, కపిల, సరస్వతి నదులు అరేబియా సముద్రంలో కలిసే 'త్రివేణి సంగమం' వద్ద ఈ ఆలయం కొలువ...
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారతే జీవనాడి – India Bangladesh Trade

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారతే జీవనాడి – India Bangladesh Trade

Special Stories
నిత్యావసరాల నుండి వస్త్ర పరిశ్రమ వరకు అన్నిటిపైనా ఆధారం..India Bangladesh Trade | న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత, ఉద్రిక్తతలు ఆ దేశ ఆర్థిక పునాదులను వణికిస్తున్నాయి. భౌగోళిక సామీప్యత, తక్కువ రవాణా ఖర్చుల కారణంగా బంగ్లాదేశ్ తన దైనందిన అవసరాల కోసం భారతదేశంపై విపరీతంగా ఆధారపడుతోంది. భారత్ నుంచి సరఫరా నిలిచిపోతే, ఆ దేశంలో ఆహార సంక్షోభం తలెత్తడమే కాకుండా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.భారత్ నుంచి వెళ్లే కీలక వస్తువులు:బంగ్లాదేశ్ తన ఆహార భద్రత, పారిశ్రామిక అవసరాల కోసం ఈ క్రింది వస్తువుల కోసం భారత్ వైపు చూస్తుంది.ఆహార ధాన్యాలు: ఏటా సుమారు 2.1 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు భారత్ నుంచి దిగుమతి అవుతాయి. దీని విలువ సుమారు రూ. 6,575 కోట్లు. అలాగే బియ్యం సరఫరాలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి, చక్కెర, సుగం...
Save Aravalli Hills | ఆరావళి మనుగడకే ముప్పు?

Save Aravalli Hills | ఆరావళి మనుగడకే ముప్పు?

Special Stories
Save Aravalli Hills | న్యూఢిల్లీ: భారతదేశ పర్యావరణ వెన్నెముకగా పిలువబడే ఆరావళి పర్వత శ్రేణులు ఇప్పుడు అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. సుమారు 2 బిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన పర్వతాలను కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఆరావళి కొండల నిర్వచనాన్ని మార్చడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.కొత్త నిర్వచనం - పెరుగుతున్న ఆందోళనసుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం, 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలను మాత్రమే రక్షిత ప్రాంతాలుగా పరిగణిస్తారు. దీనివల్ల దాదాపు 91 శాతం ఆరావళి ప్రాంతం రక్షణ పరిధి నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మైనింగ్ మాఫియాకు మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు వరంగా మారుతుందని, పర్యావరణానికి శాపంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉత్తర భారత రక్షణ కవచంఢిల్లీ నుండి గుజరాత్ వరకు దాదాపు ...
13 డిసెంబర్ 2001: 45 నిమిషాల బుల్లెట్ల వర్షం.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి పూర్తి కథనం

13 డిసెంబర్ 2001: 45 నిమిషాల బుల్లెట్ల వర్షం.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి పూర్తి కథనం

Special Stories
ప్రజాస్వామ్య దేవాలయాన్ని వణికించిన రోజు9 మంది వీర సైనికుల అమరత్వంకుట్రలో భాగమైన అఫ్జల్ గురుకు మరణశిక్ష.2001 Parliament Attack | డిసెంబర్ 13, 2001. సరిగ్గా 24 ఏళ్ల క్రితం, భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజులలో ఒకటిగా నిలిచింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఐదుగురు పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు కేవలం 45 నిమిషాల పాటు బుల్లెట్లతో విరుచుకుపడి, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ దాడిలో 9 మంది వీర సైనికులు అమరులయ్యారు. దాడి జరిగిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ వెళ్లిపోయినప్పటికీ, 200 మందికి పైగా ఎంపీలు, మంత్రులు పార్లమెంట్ భవనం లోపలే ఉన్నారు.ఉగ్రదాడి ఎలా జరిగింది? (11:30 AM)ఉదయం 11:30 గంటల ప్రాంతంలో, ఉపరాష్ట్రపతి భద్రతా దళాలు ఆయన కోసం వేచి చూస్తుండగా, ఐదుగురు ఉగ్రవాదులు తెలుపు రంగు అంబాసిడర్ ...
Delhi Red Fort blast | ఢిల్లీ పేలుళ్ల కాలక్రమం: అనంత్‌నాగ్ వైద్యుల ఉగ్ర సంబంధాలు వెలుగులోకి

Delhi Red Fort blast | ఢిల్లీ పేలుళ్ల కాలక్రమం: అనంత్‌నాగ్ వైద్యుల ఉగ్ర సంబంధాలు వెలుగులోకి

National, Special Stories
Delhi Red Fort blast | జమ్మూ కాశ్మీర్ పోలీసులు (JKP) ప్రారంభించిన ఒక‌ సాధారణ దర్యాప్తు.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తో సంబంధ‌మున్న అత్యంత ప్ర‌మాద‌క‌ర‌ 'వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్'ను విచ్ఛిన్నం చేసింది. ఇది జాతీయ భద్రతకు పొంచి ఉన్న‌ భారీ ముప్పును నివారించింది. శ్రీనగర్‌లో JeM పోస్టర్‌లతో ప్రారంభమైన దర్యాప్తు, భారతీయ నగరాల్లో పెద్ద దాడులకు ప్రణాళికలు వేస్తున్న వైద్యులు, విద్యార్థులు, మతాధికారులతో సహా అత్యంత రాడికలైజ్డ్ నిపుణుల నెట్‌వర్క్‌ను గుర్తించింది.హర్యానా పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో, జెకెపి 2,900 కిలోగ్రాముల పేలుడు పదార్థాలు, రెండు ఎకె-47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. దీని వలన జెఎం మాడ్యూల్‌తో సంబంధం ఉన్న తొమ్మిది మంది అనుమానితులను అరెస్టు చేశారు.ఢిల్లీ పేలుళ్ల సంబంధంనవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన క...
Namo Bharat : నమో భారత్ భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు.. వీటి వేగం, మార్గాలు పూర్తి వివ‌రాలు ఇవే..

Namo Bharat : నమో భారత్ భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు.. వీటి వేగం, మార్గాలు పూర్తి వివ‌రాలు ఇవే..

Special Stories
భారత్‌లో హైస్పీడ్ రైళ్ల విష‌యానికొస్తే రాజధాని, శతాబ్ది పేర్లు వెంట‌నే గుర్తుకొస్తాయి. కానీ భారతీయ రైల్వేలలో ఇపుపుడు పూర్తిగా మారిపోయింది. నేడు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు సాంప్రదాయ ఎక్స్‌ప్రెస్ కాదు, ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో నడుస్తున్న ఆధునిక "నమో భారత్" (Namo Bharat ). ఇది 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది.దీనికి ముందు, 2016లో ప్రారంభ‌మైన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వేగ‌వంత‌మైన రైలుగా గుర్తంపు పొందింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు.. హజ్రత్ నిజాముద్దీన్ - ఆగ్రా మధ్య 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. తరువాత, వందే భారత్ రైళ్లు కూడా ఈ గరిష్ట వేగానికి సరిపోయాయి. అయితే, జూన్ 24, 2024న, రైల్వే మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనకుండా దాని గరిష్ట వేగాన్ని 160 కి.మీ....
అక్రమ వలసదారులపై కొరడా రెడీ !  చొరబాటుదారులను అడ్డుకునేందుకు కొత్త చట్టం   – Immigration Act 2025

అక్రమ వలసదారులపై కొరడా రెడీ ! చొరబాటుదారులను అడ్డుకునేందుకు కొత్త చట్టం – Immigration Act 2025

Special Stories
Immigration Act 2025 : భారత్​ లో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం కొత్త చట్టం అమలులోకి వచ్చింది. కొత్త నిబంధనలు భారత్​లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరులను నియంత్రించనుంది. హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త నిబంధనలతో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ను బలోపేతం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 నియమాలు సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ బిల్లు ఏప్రిల్ 2025లో పార్లమెంటులో ఆమోదించింది. ఈ బిల్లు కింద, ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు భారతదేశంలోని విదేశీ పౌరులను పరిశీలించి, వారిపై చర్యలు తీసుకునే చట్టపరమైన హక్కులు ఇచ్చింది. ఈ చట్టంతో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వంటి అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చు ఈ బిల్లులో ప్రత్యేకత ఏమిటి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకుందాం..Immigration Act 2025 చట్టంలోని నిబంధనలు...
Indian Military :  కార్గిల్ యుద్ధం తర్వాత భారత సైనిక శక్తి ఎలా మారిపోయింది..?

Indian Military : కార్గిల్ యుద్ధం తర్వాత భారత సైనిక శక్తి ఎలా మారిపోయింది..?

Special Stories
Indian Military Modernization | 1999 మే- జూలై మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం (Kargil War), భారతదేశ చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయింది. మన సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలు, వ్యూహాత్మక చతురతకు నిదర్శనం కార్గిల్ వార్. హిమాలయాలలోని ప్రమాదకరమైన శిఖరాలలో భారత భూభాగంలోకి పాకిస్తాన్ చొరబడటంతో ప్రారంభమైన ఈ యుద్ధంలో భారత దళాలు కీలక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుని నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరలా పట్టు సాధించాయి. ఈ విజయంలో భారత సైనికుల ధైర్యం నిర్ణయాత్మక పాత్ర పోషించినప్పటికీ, యుద్ధభూమిలో కొన్ని కీలక ఆయుధాలు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.కార్గిల్‌లో సత్తాచాటిన ఆయుధాలుబోఫోర్స్ FH-77B హోవిట్జర్: స్వీడన్‌లో తయారైన 155mm బోఫోర్స్ ఆర్టిలరీ గన్ కార్గిల్‌లో తిరుగులేని ఆయుధం. నిటారుగా ఉన్న కోణంలో 27 కి.మీ. వరకు కాల్పులు జరపగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది టోలోలింగ్, టైగర్ హిల్, పాయింట్ 4875 వద్ద ప...
Bastar : బస్తర్ మారుతోంది.. ఇప్పుడు 300 టవర్లతో కమ్యూనికేషన్ విప్లవం

Bastar : బస్తర్ మారుతోంది.. ఇప్పుడు 300 టవర్లతో కమ్యూనికేషన్ విప్లవం

Special Stories
Bastar Development :గత ఏడాది కాలంలో మావోయిస్టుల పట్టు నుంచి విముక్తి పొందిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని గ్రామాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం 300 సెల్ ఫోన్ టవర్లను (Bastar Mobile Towers) ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, మావోయిస్టు గ్రూపుల మధ్య సెల్ ఫోన్ టవర్లు మొదటి నుంచీ ఒక ప్రధాన వివాదంగా ఉన్నాయి. ప్రభుత్వానికి, టవర్లను ఏర్పాటు చేయడం వ్యూహాత్మక ప్రాధాన్యం.. కానీ మావోయిస్టులు వాటిని నాశనం చేయడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తారు.కాగా కనీసం 32 సెల్ ఫోన్ టవర్ల (Bastar Telecom Towers )ను ప్రత్యేకంగా అబుజ్‌మడ్ లో ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. సాయుధ మావోయిస్టు కేడర్లతో చివరి పోరాటం ఇక్కడే జరుగుతోంది. శుక్రవారం ...
Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం

Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం

National, Special Stories
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే అత్యంత కీల‌క‌మైన‌ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెన (Chenab Bridge) ఉంది.శుక్రవారం ఉదయం 11 గంటలకు దీనిని ప్ర‌ధాన మంత్రి మోదీ ప్రారంభించారు.చీనాబ్ వంతెన అంటే ఏమిటి?చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించి ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. దిల్లీలోని కుతుబ్ మినార్ కంటే నదీ గర్భం నుంచి రైలు స్థాయి వరకు దాదాపు ఐదు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటలకు తగ్గిస్తుంది.Chenab Bridge విశేషాలుఎత్...