Saturday, March 15Thank you for visiting

Raksha Bandhan | రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!

Spread the love

Raksha Bandhan 2024 | ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగ (రక్షా బంధన్ ) అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. అన్నా చెలెళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా ఈ రాఖీ పౌర్ణ‌మి నిలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 19న సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతోంది. అదే రోజున రాత్రి 11:55 గంటలకు పౌర్ణమి ముగియనుంది. అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ ముహూర్తంగా వేద పండితులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

వర్జ్యం: మధ్యాహ్నం 12.53 నుంచి 2.33 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.29 నుంచి 1.20 వరకు…తిరిగి… మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.51 వరకు ఉంది.

READ MORE  Rakhi: తెలంగాణ ప్రజలకురాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

రక్షాబంధన్ చరిత్ర

History Of Raksha Bandhan : ఒకసారి దేవతలు, రాక్షసుల మధ్య పన్నెండేళ్లపాటు యుద్ధం జరిగింది, అందులో దేవతలు ఓడిపోయి రాక్షసులు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓటమితో నిరుత్సాహపడిన ఇంద్రుడు తన గురువైన బృహస్పతి వద్దకు వెళ్లి నేను యుద్ధం చేయక తప్పదని చెప్పాడు, అయితే మనం ఇప్పటివరకు యుద్ధంలో మాత్రమే ఓడిపోయాము. ఇంద్రుని భార్య ఇంద్రాణి కూడా ఇదంతా వింటూనే ఉంది. రేపు శ్రావణ శుక్ల పూర్ణిమ అని, నేను నిబంధనల ప్రకారం రక్షా సూత్రాన్ని సిద్ధం చేస్తాను, మీరు దానిని బ్రాహ్మణులచే కట్టించుకోండి. ఇది మీకు త‌ప్ప‌కుండా విజయం చేకూరుస్తుంది అని ఆమె చెప్పింది. మరుసటి రోజు ఇంద్రుడు రక్షా విధానంతో రక్షాబంధనాన్ని పూర్తి చేశాడు. దీని తరువాత, ఇంద్రుడు ఐరావతం అని పిలువ‌బ‌డే ఏనుగుపై స్వారీ చేస్తూ యుద్ధభూమికి చేరుకున్నప్పుడు రాక్షసులు చాలా భయపడి పారిపోయారు. అలా రక్షాబంధ‌నం ప్రభావం వల్ల ఇంద్రుడు విజ‌యం సాధించాడు. అప్పటి నుండి ఈ పండుగను ఘ‌నంగా జరుపుకుంటారు.

READ MORE  Raksha Bandhan 2023 : రాఖీ పండుగ తేదీ, శుభ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత

శ్రావణ పూజ

శ్రావ‌ణ‌ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాత్రి బాల శ్రవణ్ కుమార్ తన అంధులైన‌ తల్లిదండ్రుల కోసం అడ‌విలో నీరు తీసుకురావడానికి వెళ్ళాడు. దశరథ రాజు ఒక‌చోట‌ దాక్కుని వేట కోసం ఎదురు చూస్తున్నాడు. నీటి కుండలోని నీళ్ల‌ శబ్దాన్ని విని జంతువు శబ్దంగా భావించి, ద‌శర‌థ మ‌హారాజు శ్రవణ్ పై బాణం వేయ‌డంతో అత‌డు ప్రాణాలు కోల్పోతాడు. శ్రవణ్ మరణవార్త విన్న అతని అంధ తల్లిదండ్రులు బోరున విలపించారు. అప్పుడు దశరథుడు అజ్ఞానంతో చేసిన నేరానికి క్షమాపణ చెప్పి శ్రావణం నాడు శ్రావణ పూజను ప్రోత్సహించాడు. అప్పటి నుంచి శ్రావణ పూజ నిర్వహించడం ప్రారంభించి, ముందుగా శ్రావణుడికి రక్ష సూత్రాన్ని సమర్పించారు.

శ్రావణ ఉపకర్మ

శ్రావ‌ణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు శ్రావణి ఉపకర్మ సమయంగా పరిగణిస్తారు. ఈ రోజు ముఖ్యంగా బ్రాహ్మణులకు పండుగ, ఇందులో వేదపారాయణం చేస్తారు. ఈ రోజున, యాగ్యోపవీతం ధ‌రిస్తారు. అంటే పూజ చేసి పాత యాగ్యోపవీతం తొలగించి కొత్తది ధరిస్తారు. ఇది గొప్ప సంప్రదాయంలో ఒక‌టిగా నిలుస్తోంది. పూర్వ‌కాలంలో గురువు తన శిష్యులతో కలిసి ఈ ఆచారాన్ని నిర్వహించేవారు.

READ MORE  రతన్ టాటా సామ్రాజ్యానికి ఆ ముగ్గురిలో వారసుడు ఎవ‌రు?

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవ‌లం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సంబంధిత నిపుణులను సంప్రదించిన త‌ర్వాత ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోగ‌ల‌రు.. అలాగే పై సమాచారాన్ని వందేభార‌త్ ధ్రువీకరించడం లేదు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?