Posted in

Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..

Radhika Khera Resigns
Spread the love

Radhika Khera Resigns | ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేరా  ఆదివారం పార్టీకి రాజీనామా  చేశారు. ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఖేరా ఆరోపించారు. “రామ్ లల్లా జన్మస్థలం అయోధ్య ధామ్ మనందరికీ చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడికి వెళ్లకుండా నేను ఆపుకోలేకపోయాను. కానీ నేను రామాల‌యాన్ని(Ayodhya Ram Mandir) సందర్శించినందుకు పార్టీ (Congress Party) లో నేను ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. అని అమె పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం (Congress Party)లో నాతో అనుచితంగా ప్రవర్తించారు, నన్ను గదిలో బంధించారు, నేను అరిచి, వేడుకున్నాను, కానీ నాకు న్యాయం జరగలేదు. ఈ రోజు నేను పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. కానీ రామ్ లల్లా నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది, ”అని వార్తా సంస్థ ANI తో మాట్లాడుతూ ఆమె అన్నారు.

Highlights

Radhika Khera Resigns : తాను ఎప్పుడూ పార్టీ గీతను దాటలేదని, పూర్తి భక్తి, నిజాయితీతో పనిచేశానని ఖేరా (Radhika Khera) అన్నారు. “నేను అయోధ్యను సందర్శించినందున, నేను హిందువునైనందున, నేను సనాతన ధర్మాన్ని అనుసరించే వ్య‌క్తినైనందుకు నాకు న్యాయం జరగలేదు. పార్టీకి 22 సంవత్సరాల తర్వాత నేను రాజీనామా చేశాను. ఈ వారం ప్రారంభంలో, AICC అధికార ప్రతినిధి రాధిక ఖేరా “అవమానం” కారణంగా రాజీనామా చేస్తున్నట్టు చెప్పినట్లు ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆమెకు, సీనియర్‌ ఆఫీస్‌ బేరర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం వల్లే ఈ గొడవ జరిగిందని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా ఖేరా ఛత్తీస్‌గఢ్‌కు AICC కమ్యూనికేషన్, మీడియా కోఆర్డినేటర్‌గా ఉన్నారు

రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కేదార్ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రాధిక ఖేరా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. కాంగ్రెస్ జాతీయ నాయకురాలు దుఃఖంలో ఉంటే మేం కూడా కలవరపడుతున్నాం. “రాధికా జీ, మీరు కాంగ్రెసోళ్లకు దూరంగా ఉండండి, ఛత్తీస్‌గఢ్‌లో మీకు ఏమీ జరగదు, ” అని అతను ఒక వీడియోలో చెప్పాడు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *