Friday, April 11Welcome to Vandebhaarath

Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!

Spread the love

Pakistan Economic Crisis Explained | మ‌న పొరుగుదేశం దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా చితికిపోయి సాయం కోసం అన్ని దేశాల‌ను యాచిస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో ఆ దేశ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 మే 17న, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది వీర జవాన్లను కోల్పోయిన తర్వాత భారత్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని అంగీకరించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇషాక్ దార్ స్పందిస్తూ.. ఈ నిర్ణ‌యం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి ఎగుమతులపై భారతదేశం 200% సుంకాన్ని విధించిందని, నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్ బస్సు సర్వీస్, వాణిజ్యాన్ని నిలిపివేసిందని అన్నారు.

పాక్ తో వాణిజ్యాన్ని తగ్గించడానికి భారతదేశం తక్షణ చర్యలు తీసుకుంది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా మొదటిది.. పాకిస్తాన్ ఇకపై ‘అత్యంత అనుకూల దేశాల’ లేదా MFN జాబితాలో లేదని భారత్ ప్రకటించింది. రెండవది, పాకిస్తాన్ నుండి వచ్చే అన్ని ఉత్పత్తులపై భారతదేశం వెంటనే 200% దిగుమతి సుంకాన్ని విధించింది. దీంతో క్ర‌మంగా ఆ దేశంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి..

పాకిస్తాన్ నైతిక స్థైర్యాన్ని అలాగే ఆర్థికంగా విచ్ఛిన్నం చేయడానికి మొద‌ట భార‌త్ వైమానిక దాడి చేసింది. ఈ నిర్ణయం తరువాత, అప్పటి ఆర్థిక మంత్రి దివంగత నేత‌ అరుణ్ జైట్లీ X (ట్విటర్)లో ఇలా రాశారు, “పుల్వామా ఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్‌కు MFN హోదాను ఉపసంహరించుకుంది. ఉపసంహరణ తర్వాత, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎగుమతి చేసే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం తక్షణమే 200%కి పెంచాము అని పేర్కొన్నారు.

READ MORE  Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

పాకిస్థాన్‌పై ఆర్థిక ప్రభావం

భారత్ 200% దిగుమతి సుంకం విధించ‌డంతో కీలక మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారతదేశానికి వస్తువులను ఎగుమతి చేసే పాకిస్తాన్ ను తీవ్రంగా దెబ్బతీసింది. దాని ఎగుమతుల‌ వ‌ల్ల‌ ముఖ్యంగా వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వ‌చ్చే ఆదాయం భారీగా క్షీణించింది. “భారీ సుంకాలు విధించ‌డం వ‌ల్ల భారతదేశంతో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడం మా ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది” అని దార్ చెప్పారు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి ప్రత్యర్థి దేశంపై భారత్ ఆర్థిక చర్యల ఎఫెక్ట్ ఎంతో స్ప‌ష్టం చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో, పాకిస్థానీ వ్యాపార సంఘం భారత్‌తో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని కోరుకుంటున్నదని, అయితే భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునఃప్రారంభించే ఆలోచన లేదని డార్ హైలైట్ చేశారు .
పరిశ్రమల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం.. 2016-17 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశం పాకిస్తాన్ నుంచి USD 450 మిలియన్+ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 200% సుంకం విధించిన తరువాత, ఇది 2019-20లో USD 14 మిలియన్లకు పడిపోయింది. ఆ తర్వాత 2020-21లో USD 2 మిలియన్లు, 2021-22లో USD 3 మిలియన్లు, 2022-23లో USD 20 మిలియన్లు USD 3 మిలియన్లకు పడిపోయింది. 2023-24 ఆర్థిక సంవత్స‌రంలో 3 మిలియ‌న్ల‌కు దిగ‌జారింది.

READ MORE  Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

అప్పులే ఆధారం..

ఆర్థిక పతనాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ అనేకసార్లు ఆర్థిక సహాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రతిఫలంగా ప్ర‌పంచ బ్యాంకు పాక్ లో త‌న సబ్సిడీలను రద్దు చేయాల‌ని ఒత్తిడి చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు, విద్యుత్ ధరలను పెంచేసింది.. అప్పులు తీసుకోకుంటే రోజుగ‌డ‌వ‌ని ప‌రిస్థితికి పాకిస్థాన్ దిగ‌జారింది.

భారతదేశం ప‌క‌డ్బందీ వ్యూహం

పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకోవాల‌ని మణిశంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దుల్లా వంటి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు భారతదేశంలో ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌పై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై దేశ‌వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. పాక్ విష‌యంలో భార‌త్ నిర్ణ‌యాల‌ను అంద‌రూ స‌మ‌ర్థిస్తున్నారు. భారతదేశం విధించిన ఆర్థికప‌ర‌మైన‌ ఒత్తిడి కార‌ణంగా ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తిచ్చే శక్తుల‌పై దెబ్బ‌ప‌డుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే సంస్థ‌ల‌కు భారత్ బలహీనపరచగలిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేదా బిజెపి అధికారంలో ఉన్నంత వరకు భారత్‌తో “సాధారణ” సంబంధాలు సాధ్యం కాదని పాకిస్తాన్ పదేపదే చెప్పడం గమనార్హం. అందుకే పాక్ నేత‌లు భార‌త్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇటీవల, పాక్ మాజీ మంత్రి 2024 లోక్ సభ ఎన్నికల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి స‌పోర్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిదే..

READ MORE  Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..

భవిష్యత్ లో మ‌రిన్ని చిక్కులు

Pakistan Economic Crisis :  ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని అంతా భావిస్తున్నందున, భారతదేశం – పాకిస్తాన్ మధ్య వాణిజ్యం ఇక ఎప్ప‌టికీ సాధ్యం కాక‌పోవ‌చ్చు. అది ఒక‌ కలలా కనిపిస్తోంది, రాబోయే సంవత్సరాల్లో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని అంచనాలున్నాయి. ఇది అనేక రంగాలలో భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడటం అసాధ్యం. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం మానేసి, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని శాశ్వతంగా వదిలేస్తే తప్ప పాకిస్తాన్‌తో సంబంధాలు మ‌ళ్లీ కుదురుకోవు. ఈ రెండూ అసాధ్యంగా కనిపిస్తున్నందున, పాకిస్తాన్‌లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం భారతదేశం అవలంబించిన విధాన‌లే కార‌ణ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌న దేశం జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప‌క‌డ్బందీ వ్యాహానికి నిదర్శనంగా చెప్ప‌వ‌చ్చు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *