Posted in

రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. పట్టాలెక్కనున్న రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులు..

prime Minister
Unified Pension Scheme
Spread the love

PM Modi AP Tour | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయ‌న‌ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు సుస్థిర అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రధాన కృషిలో ఒక భాగమని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే గురువారం భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఇత‌ర ప్రాజెక‌ట్ఉల‌ను ప్రారంభించేందుకు. విశాఖపట్నం ప్రజలను క‌లుసుకునేందుకు తాను ఎదురు చూస్తున్నాన‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. NTPC గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన, నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కింద ఇటువంటి హబ్‌గా అవతరించడం చాలా సంతోషకరమైన విషయమ‌ని అన్నారు.

కాగా కొత్త‌ ప్రాజెక్టులు 20 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని క‌లిగి ఉంటాయి. ఇది 1,500 TPD (రోజుకు టన్నులు) గ్రీన్ హైడ్రోజన్ 7,500 TPD గ్రీన్ హైడ్రోజన్ ఉత్పన్నాలు, గ్రీన్ మిథనాల్, గ్రీన్ యూరియాతో సహా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో భారతదేశ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా అవ‌త‌రించ‌నుంది. 2030 నాటికి భారతదేశం నాన్-ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ లక్ష్యమైన 500 GW సాధించడంలో ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.

విశాఖ‌లో సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం

విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించ‌నున్నారు. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌కు సమీపంలో ఉన్నందున ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో ఈ పార్క్ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని PMO తెలిపింది.

కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా (KRIS సిటీ)కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఇది ఒక ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్, ఇది గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మార‌నుంది. ఈ ప్రాజెక్ట్ సుమారు రూ. 10,500 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది, ఈ ప్రాజెక్టు వ‌ల్ల దాదాపు లక్ష మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం చేప‌ట్టిన ఫ్లాగ్‌షిప్ ఈవెంట్, ఇది భారతీయ ప్రవాసులతో కనెక్ట్ అవ్వడానికి ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించడానికి ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుంది. భువనేశ్వర్‌లో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఒడిశా ప్రభుత్వం భాగస్వామ్యంతో 18వ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సులో పాల్గొనేందుకు 50కి పైగా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాస సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని PMO తెలిపింది.

PM Modi AP Tour భారతీయ ప్రవాసుల కోసం ఢిల్లీలోని నిజాముద్దీన్ నుంచి బయలుదేరి మూడు వారాల పాటు ఆధ్యాత్మిక‌ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల‌కు ప్రయాణించే ప్రత్యేక పర్యాటక రైలు అయిన ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ రిమోట్‌గా ఫ్లాగ్-ఆఫ్ చేస్తారు. ఇది ‘ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన’లో భాగమని ప్ర‌ధాని కార్యాల‌యం పేర్కొంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *