Friday, May 9Welcome to Vandebhaarath

Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు

Spread the love

Indian Railways update :  దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజుల‌పాటు అనేక రైళ్లను ర‌ద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్ల‌ను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్ర‌ధానంగా సికింద్రాబాద్, రక్సాల్, హైదరాబాద్ పాట్నా మధ్య ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి.

  • రైలు నం. 07005 సికింద్రాబాద్-రక్సాల్ స్పెషల్ 2024 సెప్టెంబర్ 23, 30వ‌ తేదీల్లో రద్దు చేశారు.
  • రైలు నం. 07006 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 26 సెప్టెంబర్, అక్టోబర్ 3న రద్దు
  • రైలు నం. 07051 హైదరాబాద్-రక్సాల్ స్పెషల్ 28 సెప్టెంబర్, అక్టోబర్ 5వ తేదీన‌ రద్దు
  • రైలు నం. 07052 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 2024 అక్టోబర్ 1, 8వ‌ తేదీల్లో రద్దు
  • రైలు నం. 03253 పాట్నా-సికింద్రాబాద్ స్పెషల్ 23, 25, 30 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024 తేదీల్లో రద్దు
  • రైలు నం. 07255 హైదరాబాద్-పాట్నా స్పెషల్ 25 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024న రద్దు
  • రైలు నం. 07256 సికింద్రాబాద్-పాట్నా స్పెషల్ 27 సెప్టెంబర్ మరియు 4 అక్టోబర్ 2024న రద్దు
READ MORE  Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!

పలు రైళ్ల దారి మళ్లింపు (Train Diversions)

  • రైలు నం. 18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి-సికింద్రాబాద్ మీదుగా 2024 సెప్టెంబర్ 28, 5, 6వ తేదీలలో నడుస్తుంది.
  • రైలు నం. 18046 హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 2024 సెప్టెంబర్ 24, 29 మరియు 30వ‌ తేదీలలో సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు-విజయవాడ మీదుగా మళ్లించబడుతుంది.
  • రైలు నం. 18112 యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ 29 సెప్టెంబర్ 2024న బళ్లారి-గుంతకల్-నంద్యాల్-గుంటూరు-విజయవాడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
  • రైలు నం. 17008 దర్భంగా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 1 అక్టోబర్ 2024న పెద్దపల్లి-నిజామాబాద్-సికింద్రాబాద్ మీదుగా మళ్లించనున్నారు.
  • రైలు నం. 07052 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 24 సెప్టెంబర్ 2024న పెద్దపల్లి-నిజామాబాద్-సికింద్రాబాద్ మీదుగా మళ్లించనున్నారు.
READ MORE  ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

ఈ నగరం నుంచి కత్రాకు కొత్త రైలు

Prayag raj to Vaishno Devi katra Train : భక్తుల దీర్ఘకాల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తర మధ్య రైల్వే ఇటీవ‌ల‌ ప్రయాగ్‌రాజ్‌లోని సుబేదర్‌గంజ్ స్టేషన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణో దేవి(Vaishno Devi Temple)  కత్రాకు నేరుగా రైలు సర్వీసును ప్రారంభించింది. కత్రా జమ్మూ మెయిల్ ప్రతిరోజూ ఉదయం 10:35 గంటలకు సుబేదర్‌గంజ్ స్టేషన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:15 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు చేరుకుంటుందని ఉత్తర మధ్య రైల్వే PRO అమిత్ మాల్వియా మీడియాకు తెలిపారు. ఈ రైలు ఫతేపూర్, గోవింద్‌పురి, తుండ్లా, అలీఘర్, చిపియానా బుజుర్గ్, ఢిల్లీ, సబ్జీ మండి, నరేలా, సోనిపట్, గనౌర్, సమల్ఖా, కురుక్షేత్ర, అంబాలా కాంట్ మీదుగా సాగుతుందని ఆయన తెలిపారు.

READ MORE  Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

తిరుగు ప్రయాణంలో, రైలు ప్రతిరోజూ మధ్యాహ్నం 3:20 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:35 గంటలకు సుబేదర్‌గంజ్ చేరుకుంటుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..