Posted in

Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

Charlapalli railway station
Charlapalli railway station
Spread the love

Charlapalli railway station | హైదరాబాద్: అత్యుత్తమ విమానాశ్రయాలను త‌ల‌పించేలా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చ‌ర్లపల్లి రైల్వే స్టేషన్ దేశంలోని స‌క‌ల స‌దుపాయాల‌తో హైటెక్ హంగుల‌తో అల్ట్రామోడర్న్ ప్యాసింజర్ ఫెసిలిటీగా రెడీ అయింది. కొత్త స్టేషన్ వచ్చే నెలలో ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు సులువుగా ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డానికి సమర్థవంతమైన కనెక్టివిటీని అందించే సౌక‌ర్యాలు ఇప్ప‌టివ‌ర‌కు పూర్తిచేయ‌లేదు.

రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లేందుకు రెండు వైపులా రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే సమన్వయ లోపంతో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు అర్ధంత‌రంగా నిలిచిపోయాయి. ఫలితంగా, ప్రయాణికులు ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డం క‌ష్టంగా మారింది. మ‌రోవైపు కొత్త స్టేషన్ వైపు ఉన్న వివిధ రోడ్లను ప‌లు కార‌ణాల ద్వారా ప్రారంభించ‌లేదు. ఇటీవల పూర్తయిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) రెండవ దశ ద్వారా ప్రయాణికులు కూడా చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా మేడ్చల్‌-బొలారం మధ్య ఫలక్‌నుమా మీదుగా ఉమ్‌దానగర్‌, లింగంపల్లి నుంచి తెల్లాపూర్‌, సనత్‌నగర్‌ నుంచి చెర్లపల్లి, మౌలాలీ మీదుగా ఘట్‌కేసర్‌ వరకు రైల్వే ట్రాక్‌ల పనులు పూర్తయ్యాయి. ఎంఎంటీఎస్‌ సేవలు ప్రారంభిస్తే చర్లపల్లికి వెళ్లేందుకు లింగంపల్లి, మేడ్చల్‌, మల్కాజిగిరి, కాచిగూడ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఎంఎంటీఎస్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సర్వీసులు కూడా సరిగ్గా సరిపోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Charlapalli railway station
Charlapalli railway station

ఇరుకుగా ర‌హ‌దారులు

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు చెర్లపల్లి స్టేషన్‌కు చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి, ఇందులో మహాలక్ష్మి నగర్ కాలనీ నుంచి 40 అడుగుల రహదారి, IOCL నుంచి చెర్లపల్లికి అనుసంధానించే రహదారి ఉన్నాయి. ప్రస్తుతం రెండు రోడ్లు చాలా ఇరుకుగా ఉండడంతో చాలా విస్త‌రించాల్సి ఉంది. ఇందుకోసం గతంలో జీహెచ్‌ఎంసీ సర్వేలు నిర్వహించి రోడ్డు విస్తరణకు కనీసం 20 ఆస్తులను కూల్చివేయాల్సి ఉంటుందని తేల్చింది. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పటి నుంచి రోడ్డు విస్తరణ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

అప్రోచ్ రోడ్లు నిర్మించకుండా చర్లపల్లి స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువ‌స్తే.. పెద్దఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాద‌ముందని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ప్రయాణికులు సమయానికి స్టేషన్‌కు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ‌లితంగా స‌మ‌యానికి రైళ్ల‌ను అందుకోలేని దుస్థితి ఏర్ప‌డ‌వ‌చ్చు. వివిధ శాఖల మధ్య సమన్వయం కుద‌రుర్చుకొని త్వ‌రిత‌గ‌తిని రైలు, బ‌స్ క‌నెక్టివిటీని మెరుగుప‌ర‌చాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *