Thursday, April 17Welcome to Vandebhaarath

Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

Spread the love

Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం ‘శ్రీ విజయ పురం’గా మార్చింది, భార‌త‌దేశంపై వలసవాద ముద్రలను విముక్తి క‌లిగించేందుకు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. . పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ఎంట్రీ పాయింట్‌.. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు.
హోం మంత్రి అమిత్ షా Xపై ఒక పోస్ట్‌లో తాజా నిర్ణయాన్ని ప్రకటించారు “మునుపటి పేరుకు వలసవాద వారసత్వం ఉన్నప్పటికీ, శ్రీ విజయ పురం మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి అండ‌మాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక అని పేర్కొన్నారు.

పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశ స్థానం. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు. హోం మంత్రి అమిత్ షా X వేదికగా ఒక పోస్ట్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు మరియు “మునుపటి పేరుకు వలసవాద వారసత్వం ఉన్నప్పటికీ, శ్రీ విజయ పురం మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక.”

READ MORE  మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త

“మన స్వాతంత్ర్య పోరాటంతోపాటు భార‌త‌ చరిత్రలో అండమాన్ నికోబార్ దీవుల (Andaman Nicobar)కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నావికా స్థావరంగా పనిచేసిన ద్వీపం భూభాగం.. నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా మారింది” అని అమిత్ షా అన్నారు.

“నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని మొదటిసారి ఇక్క‌డే ఆవిష్క‌రించారు. అలాగే వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు స్వతంత్ర దేశం కోసం పోరాడిన వారు ఇక్క‌డి సెల్యులార్ జైలులోనే బందీ చేయ‌బ‌డ్డార‌ని అని హోం మంత్రి చెప్పారు.

READ MORE  ED raids | మంత్రి పొంగులేటికి షాక్‌.. ఆయన కంపెనీలో ఈడీ దాడులు

ఇదిలా ఉండ‌గా జూలైలో, రాష్ట్రపతి భవన్ ఐకానిక్ ‘దర్బార్ హాల్ ను ‘అశోక్ హాల్ గా, గ‌ణ‌తంత్ర మండ‌పాన్ని అశోక‌ మండపం’గా మార్చారు. . “భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని మార్చేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది.  రక్షణ దళాలలో కూడా వలసరాజ్యాల వారసత్వాన్ని తొలగించడానికి కేంద్రం, భారత నావికాదళ సిబ్బంది అందరూ లాఠీలను మోసే పద్ధతిని తక్షణమే అమలులోకి తెచ్చింది. భారత నావికాదళం ఛత్రపతి శివాజీ ముద్రతో ప్రేరణ పొందిన దాని చిహ్నాన్ని కూడా మార్చుకుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *