తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం..  మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

 

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.  మార్చురీలో భద్రపరిచిన   ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి.
వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016వ సంవత్సరంలో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రవి రెండో వివాహం చేసుకోగా వీరికి కుమారుడు జన్మించాడు. అయితేతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రవికుమార్‌ క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల కుటుంబంలో గొడవలు కాగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

READ MORE  Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

పోలీసులు అతడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోస్ట్ మార్టం సమయంలో, అతని శరీరంలోని భాగాలను ఎలుకలు తినేశాయని గమనించిన అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు నిరసన తెలిపారు. మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ఆసుపత్రిలో మర్యాదగా వ్యవహరించాలంటే అందరికీ లంచం ఇవ్వాల్సి వస్తోందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పై అంతస్తు నుంచి కిందిస్థాయి వరకు లంచాలు ఇవ్వాల్సిందే.. ఆస్పత్రిలో మృతదేహాలకు కూడా భద్రత లేదు. అయితే ఆసుపత్రి అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. మార్చురీలో ఎలుకలు లేవని స్పష్టంచేశారు.

READ MORE  ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *