Posted in

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాంకబరి పూజలు

Warangal
Spread the love

Warangal news | వరంగల్ 16వ డివిజన్ కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి శాకంబరి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని భక్తులు వివిధ కూరగాయలు ఫలాలతో అద్భతంగా అలంకరించారు. వేదపండితులు లక్ష్మీ నరసింహాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.

Highlights

ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, ఆర్యవైశ్య జిల్లా మహాసభ జిల్లా సెక్రెటరీ గందె శ్రీనివాస్ దంపతులు, పొట్టి శ్రీనివాస్, కాలనీ వైశ్యులు మండల ఆర్యవైశ్య సంఘం, కీర్తినగర్ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొడకండ్ల భద్రయ్య, కమిటీ సభ్యులు, కీర్తి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *