National

వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

Spread the love

Vande Bharat Metro train : పశ్చిమ మధ్య రైల్వేలోని కోట డివిజన్‌లో కొత్తగా నిర్మించిన 16-కోచ్‌ల వందే భారత్ మెట్రో రేక్ విజయవంతమైన ట్రయల్ రన్‌ను ఇటీవల పూర్తి చేసింది. లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) బృందం నిర్వహించిన ఈ ట్రయల్, భారతదేశ అధునాతన రైలు నెట్‌వర్క్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది.

రైల్వే అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం , వందే భారత్ మెట్రో రేక్‌ను కోట – మహిద్‌పూర్ రోడ్ స్టేషన్‌ల మధ్య ‘అప్’ దిశలో అలాగే మహిద్‌పూర్ రోడ్ – షామ్‌ఘర్ స్టేషన్‌ల మధ్య ‘డౌన్’ లైన్‌లో పరీక్షించారు.

కోటా డివిజన్‌కు చెందిన సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రోహిత్ మాల్వియా మాట్లాడుతూ.., వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ట్రయల్ నిర్వహించామని, ఒక్కో కోచ్‌లో ప్రయాణీకుల బరువుకు సమానంగా మొత్తం 24.7 టన్నులు లోడ్ చేశామని వివరించారు. “ట్రయల్ సమయంలో రైలు గరిష్టంగా 145 km/h వేగంతో సుమారు 50 కిలోమీటర్లు నడిచింది. తుది ఫలితాలతో మేము చాలా సంతోషిస్తున్నాము” అని మాల్వియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

రేక్‌పై ఇన్‌స్ట్రుమెంటేషన్ పని ఆదివారం షెడ్యూల్ జరిగింది. రైలు వేగం మరియు బ్రేకింగ్ సిస్టమ్‌పై తదుపరి పరీక్షలు రాబోయే 15 రోజులలో నిర్వహించనున్నారు.

ట్రయల్స్‌ను RDSO యొక్క డైరెక్టర్ ఆఫ్ టెస్టింగ్, BM సిద్ధిఖీ పర్యవేక్షిస్తున్నారు. కోట డివిజన్‌లో కూడా 18 మరియు 20 కోచ్‌లతో వందే భారత్ రేక్‌ల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *