Friday, January 23Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వ‌స్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..

వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వ‌స్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..

Trending News
Indian Railways | రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త, దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే కొత్త‌గా వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat sleeper train) ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రైలు ద్వారా అధునాత‌న సౌకర్యాల‌తో రాత్రిపూట వేగంగా త‌మ గ‌మ్య స్థానాల‌ను చేరుకోవ‌చ్చు. వందేభార‌త్ రైలు జనవరి 2025 నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీప‌ర్‌ రైళ్లను తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు: మార్గాలు వందే భారత్ స్లీపర్ రైలు మొద‌ట‌ న్యూఢిల్లీ మ‌ధ్య‌ శ్రీనగర్ మార్గంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీని జమ్మూ, కాశ్మీర్‌కు అనుసంధానిస్తుంది. ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దాదాపు 13 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. మ‌రికొద్దిరోజుల్లోనే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చ...
Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్..  ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్.. ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

Trending News
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi ) 'వోకల్ ఫర్ లోకల్'  (Vocal for Local ) ప్రచారానికి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మ‌య్యారు. వినియోగ‌దారుల్లో ఈ నినాదంతో ఎంతో మార్పును తీసుకువ‌చ్చింది. ఇది గతంలో ఫ్యాన్సీ చైనీస్ లైట్లు, డెకరేషన్ ఉత్పత్తులు ఎక్కువ‌గా కొనుగోలు చేసేవారు. వ్యాపార‌, వాణిజ్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ దీపావళికి భారతీయులు చైనీస్ వస్తువుల కంటే 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఇది ప్రతిగా చైనాకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది దాదాపు 1.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.పిఎం మోడీ 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్ర‌ధాన ల‌క్ష్యం. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను కొనుగోలు చేయాల‌ని ప్రధాన...
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ తో అద‌ర‌గొట్టిన విజ‌య్‌..

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ తో అద‌ర‌గొట్టిన విజ‌య్‌..

Trending News
Actor Vijay  | చెన్నై: వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, అభిమానుల మ‌ధ్య త‌మిళ అగ్ర న‌టుడు.. త‌న పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి మ‌హానాడులో ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ తో అద‌ర‌గొట్టాడు.. ''నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో నేను భయపడడం లేదుస‌స అంటూ నటుడు విజయ్‌ (Vijay) వ్యాఖ్య‌లు చేశారు. సినిమా రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్‌ అని అన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ గీతం వినిపిస్తుండగా ప్రత్యేకంగా నిర్మించిన ర్యాంప్‌పై నడిచిన ఆయన 100 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై పార్టీ జెండాను లాంఛనంగా ఎగురవేశారు. గంటల కొద్దీ నిరీక్షణ త‌రువాత విజ‌య్‌ అద్భుతమైన తీరిలో మ...
Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..

Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..

Trending News
Deepavali 2024 Date : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. పండగ నాడు ప్రతి ఇంటా..  దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ సంవత్సరం దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే దానిపై  చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి జరుపుకుంటారు. అయితే ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై ప్రజల్లో స్పష్టత లేదు.ప్రముఖ జోత్యిష్య పండితుల ప్రకారం..  ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 తోపాటు నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వొచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 31 ...
ఎట్టకేలకు ఊపందుకుంటున్న మణుగూరు-రామగుండం రైల్వే లైన్ పనులు

ఎట్టకేలకు ఊపందుకుంటున్న మణుగూరు-రామగుండం రైల్వే లైన్ పనులు

Trending News
Manugur to Ramagundam Railway Line : తెలంగాణ‌లో ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న మణుగూరు-రామగుండం రైల్వే లైన్ ప్రాజెక్టుపై క‌ద‌లిక వచ్చింది. ఈ కొత్త బ్రాడ్‌గేజ్ రైలు మార్గానికి సంబంధించిన పనులు వేగవంతం కానున్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులకు కాంపిటెంట్ అథారిటీ విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భూపాలపల్లి సబ్ కలెక్టర్ కాటారం, రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాలపల్లి, పెద్దపల్లి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భూసేకరణ ప్రక్రియను నిర్వహించే వీలు క‌లిగింది కాటారం సబ్‌కలెక్టర్‌ మల్హర్‌రావు, కాటారం మండలాల్లో భూసేకరణను చూస్తారని, భూపాలపల్లి జిల్లాలోని ఘన్‌పూర్‌, భూల్‌పల్లి మండలాల్లో భూపాలపల్లి ఆర్‌డీవో పర్యవేక్షిస్తారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం, మంథని, రామగిరి, కమాన్‌పూర్‌, పెద్దపల్లి మండలాల్లో భూసేకరణను అదనపు కలెక్టర...
Vande Bharat | ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్

Vande Bharat | ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్

Trending News
Vande bharat Express | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భార‌తీయ రైల్వే అన్ని విధాలుగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌త్యేక రైళ్ల ను న‌డిపిస్తోంది. రైల్వేస్టేష‌న్ల‌ను ఆధునికీక‌రించ‌డంతోపాటు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో వందేభార‌త్ రైళ్ల‌ను కూడా అన్ని మార్గాల్లో ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటి వరకు చైర్‌కార్‌తో నడిచే వందేభారత్‌ను త‌క్కువ దూరం గ‌ల మార్గాల్లో న‌డిపించేవారు. అయితే ఇప్పుడు స్లీపర్ వందేభారత్ కూడా వ‌చ్చేసింది. దీంతో సుదూర మార్గాల్లో కూడా నడిపించాల‌ని భావిస్తున్నారు.అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్‌లో కాకుండా చైర్ కార్‌లో ఉన్నప్పటికీ, దీపావళి, ఛత్‌ల పండుగ‌ల‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని దిల్లీ – పాట్నాల మధ్య వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును నడిపించాల‌ని నిర్ణయించారు. పండుగల సందర్భంగా ప్ర‌యాణికుల‌ రద్దీకి అన...
Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?

Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?

Trending News
Indian Railways | భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల (Senior Citizens )కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు లోయర్ బెర్త్‌లకు అర్హులు. అలాగే కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌ను పొందే అవకాశాలను పొందవచ్చు.సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా ఈ సౌకర్యాలను పొందవచ్చు, ఫలితంగా వారు సాఫీగా గమ్యస్థానాలను చేరవచ్చు. అయితే, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా గరిష్టంగా ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తున్నట్లయితే, లోయర్ బెర్త్ ప్రాధాన్యత హామీ ఉండదు. సీనియర్ సిటిజన్‌కు ఎగువ లేదా మధ్య బెర్త్ కేటాయిస్తే, టిక్కెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణ సమయంలో అందుబాటులోకి వస్తే వారిని దిగువ బెర్త్‌కు ...
భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

Trending News
Indian Railways Update  | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది.  భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటించారు.హౌరా-అమృత్‌సర్ మెయిల్ భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలుగా భావిస్తుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం వాణిజ్య సేవల కోసం అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో దేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అప్‌డేట్ అయితే భారతీయ రైల్వేల స్థాయి ఒక్కసారిగా మారిపోనుంది. జపాన్‌కు ...
Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించ‌డం వెనుక క‌థేంటి?

Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించ‌డం వెనుక క‌థేంటి?

Trending News
Odisha | తాను ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాను సందర్శించినప్పుడు ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా (Baijayant Jay Panda) వెల్ల‌డించారు. దానిని ప్రధాని మోదీకి ఇవ్వమని పట్టుబట్టిందని తెలిపారు. అయితే  ఈ సంఘటనకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు." నన్ను ఎప్పుడూ ఆశీర్వదించే మా నారీ శక్తికి నమస్కరిస్తున్నాను." ఒడిశాలోని ఓ గిరిజన మహిళ 100 రూపాయల నోటును ఆ రాష్ట్రంలోని బిజెపి సీనియర్ నాయకుడికి అందజేసింది. దానిని ప్రధానికి కృతజ్ఞతగా తెలియజేయమని వేడుకుంది. అని ప్రధాని నరేంద్ర మోడీ వివ‌రించారు.తాను ఒడిశా (Odisha) లోని సుందర్‌గఢ్ (Sundargarh district) జిల్లాను సందర్శించినప్పుడు, ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా చె...
Bahraich  : బ‌హ్రైచ్ హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లపై బుల్డోజ‌ర్ యాక్షన్..?

Bahraich : బ‌హ్రైచ్ హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లపై బుల్డోజ‌ర్ యాక్షన్..?

Trending News
Bahraich violence  |  బహ్రైచ్‌లోని జిల్లా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) అధికారులు శుక్రవారం బహ్రైచ్‌లో హింసను ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది ఇళ్లపై నోటీసులు అతికించారు. మూడు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, లేకుంటే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.నివేదిక‌ల ప్రకారం..  24 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా హత్యకు కార‌ణ‌మై హింసాకాండకు పాల్పడిన ఐదుగురిలో ఒకరైన అబ్దుల్ హమీద్‌తో సహా 23 మందిపై బుల్డోజర్ చర్యను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని ప్రధాన జిల్లా రహదారిపై శాఖ అనుమతి లేకుండా రహదారి మధ్య సెంట‌ర్ పాయింట్ నుంచి 60 అడుగుల దూరం లోపు ఏదైనా నిర్మాణ పనులు చేస్తే అది అక్రమ నిర్మాణాల కేటగిరీ కిందకు వస్తుంద‌ని అధికారులు తెలిపారు.“బహ్రైచ్ (Bahraich ) జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో లే...