Tuesday, July 1Welcome to Vandebhaarath

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

కూల్చేసిన  వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..
Telangana

కూల్చేసిన వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..

యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కృషి తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో భూమి ప్లాట్లు కోసం కొంతమంది రియల్టర్ల చేతిలో నరికివేయబడిన 100 ఏళ్ల మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు ఈ ప్రకృతి ప్రేమికులు. దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగిన 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్‌ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్‌ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్‌ ట్రక్కుపై 54 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి జాగ్రత్తగా  చెట్టును మళ్లీ నాటారు. ఇప్పుడది కొ్త్తకొమ్మలు, చిగుటాకులతో పచ్చగా కళకళలాడుతోంది.చెట్టు జీవం పోసిన ప్రకృతి ప్రేమికుడు అనిల్  గోదావర్తి మాట్లాడుతూ.. “మే 30న మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని ఘన్‌పూర్‌కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మర్రిచెట్టు (Banyan Tree) పడి ఉండడం గమనించాను. దాన్నిచూసిన వెంటనే ఆ చెట్టును నా స్థలంలోకి తీసుకురావడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకు...
వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు
Telangana

వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సా...
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Telangana

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చివరి రోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ ఛాయాచిత్రాలతో కూడిన భారీ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటి, రెండో దశకు దారితీసిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన కేసీఆర్.. వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు, ...
నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం
Telangana

నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం

ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బ‌ృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన అమరుల అఖండ జ్యోతిని గురువారం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ వైపు హుస్సేన్ సాగర్‌, మరోవైపు డాక్టర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య దీనిని నిర్మించారు.రూ.177.50 కోట్లు వెచ్చించి జూన్ 22న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో రూపొందించడం దీని ప్రత్యేకత.. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మ్యూజియం, 100 మంది సీటింగ్ సామర్థ్యంతో ఆడియో విజువల్ హాల్, 650 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, టూరిస్టులకు రెస్టారెంట్, ఇతర సౌకర్యాలు, 350 మందికి పార్కింగ్ సదు...
జూన్ 20న జగన్నాథ రథయాత్ర
Telangana

జూన్ 20న జగన్నాథ రథయాత్ర

ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ Secunderabad's Shree Jagannath Rath Yatra :  హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి రథయాత్రలో భాగంగా, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం కోసం తెరచి ఉంచుతారు. అనంతరం Jagannath Rath Yatra సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమై జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా సాయంత్రం...
ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..
Telangana

ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరంహైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది. 2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు.రాష్ట్ర జనా...
రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
Telangana

రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలుహైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్‌లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.MJ మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి GPO అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. MJ బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అలస్కా వద్ద దారుసలాం, ఏక్ మినార్ తదితర ప్రాంతాలకు అవసరమైన ప్రాతిపదికన మళ్లిస్తారు. పిసిఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద బిజెఆర్ విగ్రహం వైపు అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.నాలుగు చక్రాల వాహనాల (ఫోర్ వీలర్స్) పై నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను గృహ కల్ప, గగన్ విహార్, ...
పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్
Telangana

పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే.... వివరాలు ఇవీ.. Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల పిల్లలకు ప్రతి నెలలో నాలుగవ శనివారం నో బ్యాగ్‌ డే అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి కలుగుతుంది. రోజంతా ఆటపాటలు ఉత్సాహంగా గడపనున్నారు. మరోవైపు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలను తప్పనిసరి చేశారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివించడంతోపాటు 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని నిర్ణయించారు. ఇక పదో తరగతి సిలబస...
వావ్ చల్లని కబురు.. వర్షాలు కురుస్తాయట.. ఎప్పుడో తెలుసా?
Telangana

వావ్ చల్లని కబురు.. వర్షాలు కురుస్తాయట.. ఎప్పుడో తెలుసా?

వారం పది రోజులుగా తెలంగాణలో ఎండలు భగ్గు మంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటితే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. 9గంటలకే మధ్యాహ్నానాన్ని తలపించేలా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే తీవ్రమైన మండుటెండలతో మాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.అంతే కాదండోయ్ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ రాష్ట్రం వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కరుస్తాయన్ని వాతావ...
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఆదర్శం
Telangana

పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఆదర్శం

రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి..న్యూయార్క్ ఇన్వెస్టర్  రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్‌పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యట నలో కేటీఆర్ న్యూయార్క్ లో జరిగిన ఇన్వె స్టర్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నా రు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట జిక్ పార్ట్నర్ షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్ టేబుల్ సమావే శా న్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడు తూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. న్యూయా ర్క్ సిటీలోనే తాను చదువుకుని, పనిచేసిన ట్లు ఆయన గుర్తుచేశారు. పెట్టుబడులకు తెలం గాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంటుందని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఐటీ, పరి శ్రమల శాఖ ట్విట్టర్...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..