Wednesday, July 2Welcome to Vandebhaarath

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Spread the love

Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చివరి రోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1969 నాటి తెలంగాణ ఉద్యమ ఛాయాచిత్రాలతో కూడిన భారీ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటి, రెండో దశకు దారితీసిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన కేసీఆర్.. వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు గతంలో ఉద్యమాన్ని ఎలా కొనసాగించారో గుర్తు చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా సమైక్యాంధ్రలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ. ఉద్యమాన్ని నిలబెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయులు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“ప్రారంభ దశలో ఉద్యోగులు, విద్యార్థులను తీసుకురావొద్దని భావించే తెలంగాణ ఉద్యమం రెండవ దశను ప్రారంభించాము. 1969లో మొదటి దశ ఉద్యమంలో మాదిరిగా రక్తపాతం జరగకుండా ఉండాలనుకున్నాం. కానీ ఉద్యమం ఊపందుకోవడంతో నేను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. యువత అప్పటి పాలకులపై విరుచుకుపడి ప్రాణత్యాగాలు చేసింది.’’ అని ఆయన అన్నారు. అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, అయితే వారి కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 600-700 మంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్థిక సహాయం, ఇళ్లు అందించి త్యాగధనులను గౌరవించేలా చేశామన్నారు. ఎవరికైనా సాయం అందకుంటే ఆయా కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

బీఆర్ అంబేద్కర్ విగ్రహం, బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరజ్యోతి స్మారకం, ట్యాంక్ బండ్‌తో సహా హైదరాబాద్‌లో ఇకపై ప్రధాన ఆకర్షణీయ ప్రాంతాలుగా మారనున్నాయని, దీనిక సమీపంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన ఆరుగురు యువకుల కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి సన్మానించారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.

ఈ సందర్భంగా జరిగిన డ్రోన్ షోలో ఏకకాలంలో 750 డ్రోన్‌లు గాలిలో కనిపించాయి. 15 నిమిషాలపాటు సాగిన ఈ ప్రదర్శనలో తెలంగాణ సాధించిన విజయాలు, ఐకానిక్ నిర్మాణాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవి ఉన్నాయి.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..