
హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది…
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వారధులను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన (Steel Bridge) శనివారం అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమ నేత, కార్మిక నాయకుడు, మాజీ మంత్రి అయిన నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టారు. ఇందిరా పార్క్ చౌరస్తా (Indira Park) నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని వీఎస్టీ చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఫలితంగా ఆర్టీసీ క్రాస్రో డ్స్, అశోక నగర్, వీఎస్టీ (VST) జంక్షన్ల ప్రాంతంలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
ఎన్నో ప్రత్యేకతలుదక్షిణ భారత దేశంలోనే ఇది మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్.
జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి మరో ప్రత్యేకత ఉంది. మొదటిసార...