Thursday, June 19Thank you for visiting

Tag: Uttar Pradesh

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

Crime, National
వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్లు విలువైన 2కిలోల 380 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు, రూ.5.20 లక్షల విలువైన 14 గంజాయి ప్యాకెట్లు, పిస్టల్, కారు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు రూ.5వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి(ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్), కపిల్ జాటోవు (మీరట్), మహ్మద్ షరీఫ్ (ఘజియాబాద్), ఎండి జాద్ ఖాన్(ఘజియాబాద్) ఉన్నారు. అరెస్టు వివరాలను వరం గల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న వరంగల్ మట్టెవాడ, హన్మకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్ మెంట్లో తాళం వేసిన ఉన్న 8 ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆ...
నిద్రలేవగానే ఎదురుగా కాలికి చుట్టుకొని ఉన్న కాలనాగు.. మూడు గంటలపాటు ప్రార్థనలు..

నిద్రలేవగానే ఎదురుగా కాలికి చుట్టుకొని ఉన్న కాలనాగు.. మూడు గంటలపాటు ప్రార్థనలు..

Trending News
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నిద్రలేస్తుండగానే ఆమె కాళ్లకు కాలనాగు చుట్టుకొని బుసలు కొడుతూ కనిపించింది. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. అది ఎక్కడ కాటేస్తుందోనని భయాందోళనతోనే అది ప్రశాంతంగా వెళ్లిపోయేవరకు వేచి ఉంది. ధైర్యాన్ని కూడగట్టుకొని ఏకంగా మూడు గంటలపాటు అలాగే కూర్చుండిపోయింది. పాము తనంతట తానుగా వెళ్లిపోవాలని కదలకుండా ఉండిపోయింది. మూడు గంటలకు పైగా దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. వివరాల్లోకి వెళితే.. దహర్రా గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉన్న మిథ్లేష్ యాదవ్ సోమవారం ఉదయం తన కాలుపై ఏదో పట్టుకొని ఉన్నట్లు అనిపించింది. లేచి చూడగా ఓ రాచనాగు (కింగ్ కోబ్రా) తన కాలు చుట్టూ చుట్టుకొని ఉంది. వెంటనే ఆమె చేతులు జోడించి, క్షేమంగా విడిచిపెట్టాలని ప్రార్థించింది. “నేను నా ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాను. నేను మేల్కొన్నప్పుడు.. నా కాలుకు పాము చుట్టుకోవడం...
ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో మైనర్ కి జీవితఖైదు.. అసలేం జరిగింది…

ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో మైనర్ కి జీవితఖైదు.. అసలేం జరిగింది…

Crime
Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరీలో నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 2022 సెప్టెంబర్ 14న ఇద్దరు టీనేజ్ బాలికలను వారి ఇంటి నుండి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి చంపిన దారుణ ఘటనలో ఓ మైనర్ ను దోషిగా నిర్ధారించిన పోక్సో కోర్టు..అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే మొత్తం రూ.46,000 జరిమానా చెల్లించాలని తాజాగా తీర్పు వెలువరించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్రిజేష్ కుమార్ పాండే మాట్లాడుతూ బాల నిందితుడిని ఆగస్టు 22న దోషిగా నిర్ధారించిన తర్వాత, అదనపు జిల్లా జడ్జి రాహుల్ సింగ్ ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం అతను దోషిగా తేలిన వివిధ సెక్షన్ల కింద శిక్షలను ప్రకటించిందని తెలిపారు.IPCలోని సెక్షన్ 302/34లో బాలనేరస్థుడికి జీవిత ఖైదు రూ.15,000 జరిమానా, సెక్షన్ 452 ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5,000 జరిమానా, అలాగే సెక్షన్ 363 కింద రూ. 5,000 జరిమానాతో ...
కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..

కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..

Crime
బరేలీ (ఉత్తరప్రదేశ్): కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురు నిందితులకు బరేలీ కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి యాభై వేల జరిమానా కూడా విధించింది. కల్తీ దేశీ నెయ్యి తయారు చేసిన ఐదుగురు నిందితులకు అదనపు జిల్లా జడ్జి అరవింద్ కుమార్ కోర్టు జీవిత ఖైదు విధించించారు. ఐదుగురు నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించించారు. కల్తీకి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటివరకు ఇది అత్యధిక శిక్షగా భావిస్తున్నారు. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు. 2009లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన తీర్పు 14 ఏళ్ల తర్వాత ఆగస్టు 12న శనివారం వెలువడింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తేజ్‌పాల్ సింగ్ రాఘవ్ మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతోందని, కేసు విచారణ సందర్భంగా ఎనిమిది మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరిచామని తెలిపారు. కల్తీ దేశీ నెయ్యి తయారీ ప్రక్రియ నగరంలో నేలమాళిగలో నడుస్తోంది....
400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..

400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..

Special Stories
Aligarh: రామమందిరం కోసం ప్రపంచంలోనే అతిపెద్దదైన తాళాన్ని తయారు చేశాడు అలీఘర్ కు చెందిన ఒక రామభక్తుడు సత్య ప్రకాశ్ శర్మ. చేతితో తాళాలను తయారు చేయడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తాజాగా అయోధ్యలోని రామమందిరం కోసం ఏకంగా 400 కిలోల తాళాన్ని రూపొందించారు. రామమందిరం వచ్చే ఏడాది జనవరిలో భక్తుల కోసం ప్రారంభించనుండగా సత్య ప్రకాష్ శర్మ "ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన తాళం" సిద్ధం చేయడానికి నెలల తరబడి కష్టపడ్డారు. దానిని ఈ సంవత్సరం చివర్లో రామ మందిర అధికారులకు బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నారు.శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు మాట్లాడుతూ తమకు చాలా మంది భక్తుల నుండి కానుకలు అందుతున్నాయని, తాళం ఎక్కడ ఉపయోగించాలో చూడాలని అని పేర్కొన్నారు. 45 ఏళ్లుగా 'తాళా నగరి' (taala nagri) లేదా తాళాల భూమి (land of locks) అని కూడా పిలువబడే అలీఘర్‌లో తాళాలు తయారు చేయడంలో తన కుటుంబం ఒక శతాబ్దానికి పై...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..