Sunday, June 1Welcome to Vandebhaarath

Tag: Telugu news

Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?
astrology

Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?

Rashi Phalalu (09-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 9న బుధవారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం 🐐 మేషం09-04-2025)Rashi Phalalu : ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. గ్రహబలంలో మార్పు లేదు. ఉద్యోగం విషయమై పై అధికారులతో కలుపుగోలుగా ముందుకు సాగాలి. దైవబలంతో పనులు పూర్తవుతాయి. మీ ధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది. అశ్వినీ నక్షత్ర జాతకులు ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం 10 తర్వాత చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దుర్గాధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి.🐂 వృషభం09-04-2025)ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన ప్రగతి సాధి...
waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
National

waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

waqf amendment act 2025 : దేశంలో నేటి నుంచి వక్ఫ్ సవరణ చట్టం (waqf law) అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చిందని అందులో పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయ సభలతో ఆమోదం పొందగా ఆతర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఆ తర్వాత ఈ కొత్త చట్టం నేటి నుంచి అమల్లోకి వస్తుంది.బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయ సభలు వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించాయి. ఈ బిల్లును ఏప్రిల్ 3న లోక్‌సభ ఆమోదించింది. అక్కడ 288 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏప్రిల్ 4న రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రాజ్యసభ కూడా దీనిని ఆమోదించింది. ఏప్రిల్ 5న అధ్యక్షుడు ముర్ము కూడా వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించారు. ఆ తరువాత ఈ కొత్త చట్టం ఏ రోజు నుం...
Waqf bill : అక్రమ వక్ఫ్ ఆస్తులను జప్తు చేస్తాం. యాక్షన్ లోకి దిగిన యోగి ప్రభుత్వం!
National

Waqf bill : అక్రమ వక్ఫ్ ఆస్తులను జప్తు చేస్తాం. యాక్షన్ లోకి దిగిన యోగి ప్రభుత్వం!

Yogi Adhthynath On Waqf bill : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adhthynath) ప్రభుత్వం యాక్షన్ లోకి దిగినట్లు కనిపిస్తోంది. చట్టవిరుద్ధంగా ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను గుర్తించి, కార్యాచరణ ప్రారంభించాలని యోగి ప్రభుత్వం జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం కేవలం 2,963 వక్ఫ్ ఆస్తులు మాత్రమే రిజిస్టర్ చేయబడ్డాయి. రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం, సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన 2533 ఆస్తులు, షియా వక్ఫ్ కు చెందిన 430 ఆస్తులు మాత్రమే నమోదు అయి ఉన్నాయి.Waqf bill : వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదంలోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత, వక్ఫ్ సవరణ బిల్లు శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఎగువ సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీనితో బిల్లుకు పార...
Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..
Trending News

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక ట్రిప్పులలో బిజీగా ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు స్టేషన్లలో రాత్రిపూట బస చేయడానికి ఏర్పాట్లు చేసింది. DMRC న్యూఢిల్లీ స్టేషన్‌లో ఒక పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ మీరు నిశ్చింతగా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ వాసులకు జీవనాడి లాంటిది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ లో లక్షలాది మందికి ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల రాకపోకలతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్‌లోనే పడుకోవచ్చని అనుకున్నారా? మీరు ఖచ్చితంగా నిద్రపోవచ్చు, కానీ రాత్రిపూట మెట్రో సేవలు పూర్తయిన తర్వాత స్టేషన్ లో వెంటనే మీమ్మల్ని బయటకు పంపించేస్తారు. అయినప్పటికీ, మీరు మెట్రో స్టేషన్‌లో నిద్రపోవాలనుకుంటే, ఢిల్లీ మెట్రో మీ కోరికను నెరవేర్చింద...
TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..
Andhrapradesh

TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..

TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తర్వాత మీడియాతో మాట్లాడిన నాయుడు.. పవిత్ర తిరుమల ఆధ్యాత్మికతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు.TTD లో హిందూయేతర ఉద్యోగుల బదిలీఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగులు గ్రహించాలని ఆయన కోరారు. "క్రైస్తవులు కానివారు లేదా ముస్లిమేతరులు వారి వారి ప్రార్థనా స్థలాలలో లేనట్లే, తిరుమలలో కూడా హిందూయేతర ఉద్యోగులు ఉండకూడదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆస...
TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం
Telangana

TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్‌ ‌షాపులలో సన్నబియ్యం పంపిణీ  చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొననున్నారు.కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్‌ ‌షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్‌ ‌షా...
Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు
Telangana

Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు

TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది.హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది.TG Rain Alertనేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది.IMD HyderabadRain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ...
EPFO EDLI Scheme | PF ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. కొత్త అప్ డేట్ ఇదే..
Business

EPFO EDLI Scheme | PF ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. కొత్త అప్ డేట్ ఇదే..

EPFO EDLI Scheme New Rules 2025 : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 237వ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో కీలక మార్పులను ప్రకటించింది. సర్వీసులో ఉండగా ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సవరణలను చేశారు.EPFO EDLI Scheme అంటే ఏమిటి?EDLI పథకం ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో భాగం. ఇది సామాజిక భద్రతను అందిస్తుంది .ఈ పథకం కింద ఒక EPF సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.EDLI పథకంలో ముఖ్యమైన మార్పులుకనీస బీమా ప్రయోజనంగతంలో ఒక ఉద్యోగి తన మొదటి సంవత్సరం సర్వీసులో మరణిస్తే, ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేది కాదు. కానీ కొత్త నిబంధనలలో కనీసం ₹50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం 5,000 కంటే ఎక్కువ కుటుంబ...
Ayodhya Ram Mandir : రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన అయోధ్య రామమందిరం
Trending News

Ayodhya Ram Mandir : రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన అయోధ్య రామమందిరం

స్టాంప్ డ్యూటీ, రాయల్టీ చెల్లింపులు ఇవే..Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపింది. గత 5 సంవత్సరాలలో, ప్రభుత్వం వివిధ రకాల పన్నులు, విద్యుత్ బిల్లుల ద్వారా ఏకంగా రూ. 400 కోట్లు చెల్లించింది .అయోధ్యలో 2020 ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గత సంవత్సరం జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.కాగా అయోధ్యలోని రామాలయ నిర్మాణం దాదాపు 96 శాతం పూర్తయింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, ఆలయ పనులు జూన్ 2025 నాటికి పూర్తవుతాయి. సప్త రుషి ఆలయాలలో చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన పనులు మే నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi) 2020 ఫిబ్రవరి 5న ఏర్పడినప్పటి నుంచి గత 5 సంవత్సరాలలో ...
Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు
National

Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు

Delhi Metro Timings | లక్నో/న్యూఢిల్లీ: హోలీ వేడుకల కారణంగా లక్నో, ఢిల్లీలో మెట్రో (Delhi Metro) సేవలు మార్చి 14న సాధారణ ఉదయం షెడ్యూల్‌కు బదులుగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు ధృవీకరించారు. మార్చి 14న హోలీ సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో రైలు సేవలు అందుబాటులో ఉండవని DMRC తెలిపింది.ఆ తర్వాత అన్ని లైన్లలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి."హోలీ పండుగ రోజు, మార్చి 14న, airport ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండవు" అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. ఈ సేవలు అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. లక్నో, ఢిల్లీలోని ప్రయాణీకులు మార్చి 14న బయల...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..