Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Telangana Govt

Current Charges | విద్యుత్‌ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఊరట
Telangana

Current Charges | విద్యుత్‌ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఊరట

Current Charges Hike In Telangana | హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు​ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించిన‌ట్లైంది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ తిర‌స్క‌రించింది. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్ల‌డించారు. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నామ‌ని, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంద‌ని వివ‌రించారు. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేద‌న్నారు. స్థిర చార్జీలు రూ.10 యధావిధిగా ఉంటాయ‌ని, పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేద‌ని హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్...
Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు
Telangana

Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి - బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు. రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా.. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు ...
TS Mahalakshmi Scheme | బీపీఎల్‌ కుటుంబాలకే రూ.500లకు గ్యాస్ సిలిండర్ ‌
Telangana

TS Mahalakshmi Scheme | బీపీఎల్‌ కుటుంబాలకే రూ.500లకు గ్యాస్ సిలిండర్ ‌

 TS Mahalakshmi Scheme : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ పథకం అర్హులకే అందించాలని చూస్తోంది. ఈ ఆరు పథకాల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకం. రూ.500లకే వంట గ్యాస్‌, మహిళలకు నెలకు రూ.2,500 వంటి పథకాలు ప్రజలను ఆకర్షించాయి. కాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి... గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ‘ప్రజాపాలన’ పేరుతో... కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారంటీ పథకాల కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పథకాల అమలు కోసం... దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విడుదల చేశారు. ఈ క్రమంలో... రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వస్తుందని ఎంతో మంది భావించారు.కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం... తెల్ల రేషన్‌ కార్డుతో ముడిపెట్టింది. అంటే.. బీపీఎల్‌ అంటే దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వం...